Political News

డిసెంబ‌రులోనే అసెంబ్లీ ర‌ద్దు.. ముంద‌స్తు ఖాయం

అవినీతికి చిట్టా బయటపడుతుందనే సీఎం కేసీఆర్ రోజుకో నాటకానికి తెరలేపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఏ ఫ్రంట్ పెట్టట్లేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు.

ఢిల్లీలో ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి కలిసి ఆయన దోపిడీ గురించి లెక్క చెప్పారని.. దీంతో ఫ్రంట్పై మాట మార్చారని ఆరోపించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజీగూడలో కాంగ్రెస్ కార్యకర్తలతో రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో కాంగ్రెస్లో చేరిన వారికే పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సూచించిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని… రాజకీయ అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాళ్ల ద్వారానే పరిపాలన చేస్తామని పేర్కొన్నారు.

రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు అధికారం చలాయించరని… తమ నాయకులను ముందు పెట్టి పాలన చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకునేవాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని… మార్చిలో ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ పేదల కష్టాలు తీర్చాల్సినవారు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు.

12 నెలలు కష్టపడితే అధికారం కాంగ్రెస్దేనని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయంబర్స్మెంట్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పేదల దగ్గర ఆసైన్ భూములను ప్రభుత్వం గుంజుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక… ఆ భూములపై వాళ్లకే హక్కులు ఇస్తామని భరోసా ఇచ్చారు. బస్తీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొంటామని హామీ ఇచ్చారు.

This post was last modified on March 6, 2022 4:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

53 minutes ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

6 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

6 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

6 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

7 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

9 hours ago