అవినీతికి చిట్టా బయటపడుతుందనే సీఎం కేసీఆర్ రోజుకో నాటకానికి తెరలేపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఏ ఫ్రంట్ పెట్టట్లేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు.
ఢిల్లీలో ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి కలిసి ఆయన దోపిడీ గురించి లెక్క చెప్పారని.. దీంతో ఫ్రంట్పై మాట మార్చారని ఆరోపించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజీగూడలో కాంగ్రెస్ కార్యకర్తలతో రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో కాంగ్రెస్లో చేరిన వారికే పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సూచించిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని… రాజకీయ అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాళ్ల ద్వారానే పరిపాలన చేస్తామని పేర్కొన్నారు.
రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు అధికారం చలాయించరని… తమ నాయకులను ముందు పెట్టి పాలన చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకునేవాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని… మార్చిలో ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ పేదల కష్టాలు తీర్చాల్సినవారు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు.
12 నెలలు కష్టపడితే అధికారం కాంగ్రెస్దేనని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయంబర్స్మెంట్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పేదల దగ్గర ఆసైన్ భూములను ప్రభుత్వం గుంజుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక… ఆ భూములపై వాళ్లకే హక్కులు ఇస్తామని భరోసా ఇచ్చారు. బస్తీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొంటామని హామీ ఇచ్చారు.
This post was last modified on March 6, 2022 4:45 am
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…
నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…