Political News

డిసెంబ‌రులోనే అసెంబ్లీ ర‌ద్దు.. ముంద‌స్తు ఖాయం

అవినీతికి చిట్టా బయటపడుతుందనే సీఎం కేసీఆర్ రోజుకో నాటకానికి తెరలేపుతున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీని కథ తేలుస్తా.. గద్దె దించేవరకు నిద్రపోనని చెప్పిన సీఎం కేసీఆర్ ఇప్పుడు మాట మార్చారని అన్నారు. జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ను కలిసిన తర్వాత బీజేపీకి వ్యతిరేకంగా ఏ ఫ్రంట్ పెట్టట్లేదని కేసీఆర్ చెప్పారని విమర్శించారు.

ఢిల్లీలో ముఖ్యమంత్రిని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యం స్వామి కలిసి ఆయన దోపిడీ గురించి లెక్క చెప్పారని.. దీంతో ఫ్రంట్పై మాట మార్చారని ఆరోపించారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అన్నోజీగూడలో కాంగ్రెస్ కార్యకర్తలతో రేవంత్రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంలో కాంగ్రెస్లో చేరిన వారికే పథకాల్లో ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు సూచించిన వారికే మొదటి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని… రాజకీయ అవకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారు. వాళ్ల ద్వారానే పరిపాలన చేస్తామని పేర్కొన్నారు.

రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అధికారులు అధికారం చలాయించరని… తమ నాయకులను ముందు పెట్టి పాలన చేస్తామని రేవంత్ రెడ్డి తెలిపారు. పార్టీ సభ్యత్వం తీసుకునేవాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయని జోస్యం చెప్పారు. డిసెంబర్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తారని… మార్చిలో ఎన్నికలు వస్తాయని పేర్కొన్నారు. ఇక్కడ పేదల కష్టాలు తీర్చాల్సినవారు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారని మండిపడ్డారు.

12 నెలలు కష్టపడితే అధికారం కాంగ్రెస్దేనని రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయంబర్స్మెంట్, 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. పేదల దగ్గర ఆసైన్ భూములను ప్రభుత్వం గుంజుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక… ఆ భూములపై వాళ్లకే హక్కులు ఇస్తామని భరోసా ఇచ్చారు. బస్తీలను అభివృద్ధి చేస్తామని అన్నారు. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకూ కొంటామని హామీ ఇచ్చారు.

This post was last modified on March 6, 2022 4:45 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

13 minutes ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

6 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago