Political News

అమరావతి కాదు కమ్మరావతి: మంత్రి అప్పలరాజు

అమరావతిపై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ ప్రాంత రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. మూడు రాజధానులంటూ ప్రభుత్వం మొండిపట్టు పట్టి అమరావతిని నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో ఈ తీర్పు రావడంతో వారంతా సంబరాలు చేసుకుంటున్నారు. అయితే, తాము పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్న తరహాలో తాము పరిపాలిస్తున్న రాష్ట్రానికి మూడు రాజధానులు అంటున్నారు వైసీపీ నేతలు. 

ఈ క్రమంలోనే ఆ తీర్పును కొందరు వైసీపీ నేతలు తప్పుబడుతూ సుప్రీం కోర్టుకు వెళతామని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక, మరికొందరు వైసీపీ నేతలైతే..అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతూ…తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నారు. ఈ నేపథ్యంలో అమరావతిపై మంత్రి సీదిరి అప్పలరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అది అమ‌రావ‌తి కాద‌ని, క‌మ్మ‌రావ‌తని అప్పలరాజు చేసిన వ్యాఖ్య‌లు పెను దుమారం రేపుతున్నాయి. 
3 రాజధానులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని, ప్రతి విషయంపై చంద్రబాబు కోర్టుకెళ్లి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అప్పలరాజు విమర్శించారు. తాము అధికార వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని, ఎన్ని అడ్డంకులు వచ్చినా మూడు రాజధానులపై జగన్ ముందుకెళ‌తార‌ని ధీమా వ్యక్తం చేశారు.

అమ‌రావ‌తిలో భూములు కొన్నవారు, అమ్మినవారు అందరూ చంద్ర‌బాబు సామాజిక వ‌ర్గానికి చెందిన వారని వైసీపీ నేత‌లు గతంలోనూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక, అమరావతే రాజధాని అంటూ తమ సామాజిక వర్గానికి చెందిన వారికి చంద్రబాబు లీకులిచ్చి అందరికంటే ముందుగా భూములు కొనేలా వ్య‌వ‌హ‌రించార‌ని సీఎం జ‌గ‌న్ కూడా గతంలో వ్యాఖ్యానించిన సంగ‌తి తెలిసిందే.

This post was last modified on March 6, 2022 4:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

50 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago