సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల హాజరుపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీ తుది నిర్ణయం తీసుకుంది. గత నవంబరులో జరిగిన సమావేశాల్లో చంద్రబాబు సతీమణిని వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు ఘోరంగా అవమానించారంటూ.. బాబు కన్నీరు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే చట్టసభలకు వెళ్లరాదని, సీఎం అయ్యాకే వస్తానని శపథం చేశారు. దీంతో సభకు వెళ్లాలా? వద్దా అనే విషయంపై పార్టీ రెండురోజులుగా నేతలతో సమావేశం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే పొలిట్బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో జరిగిన అవమానానికి కలత చెంది చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు.
చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరుపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం ఆన్లైన్లో జరిగిన టీడీఎల్పీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై.. చంద్రబాబు టీడీఎల్పీలో చర్చించారు.
అయితే.. ఎఎవరు ఎలా అనుకున్నా.. ప్రజల కోసం.. టీడీపీ పనిచేయాలని చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలో తాను చేసిన శపథానికి తాను కట్టుబడి ఉంటానని.. కానీ, పార్టీనేతలు మాత్రం ప్రజల కోసం.. సభలకు హాజరు కావాలని ఆయన సూచించారు. దీంతో సోమవారం నుంచి జరగనున్న అసెంబ్లీ, మండలి సమావేశాలకు చంద్రబాబు తప్ప.. మిగిలిన నాయకులు హాజరు కానున్నారు.
అదేసమయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై నిలదీయాలని కూడా చంద్రబాబు పార్టీ నేతలను ఆదేశించారు. ఇటు అసెంబ్లీ, అటు మండలిలోనూ.. ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ విధిగా సభలకు హాజరై.. సమస్యలను ప్రస్తావించాలని.. ప్రభుత్వం తీసుకున్న ప్రజావ్యతిరేక విధానాలను ముఖ్యంగా చెత్తపన్ను, ఓటీఎస్, లే అవుట్లలో 5 శాతం భూముల కేటాయింపు, రాజధానిపై హైకోర్టు తీర్పు వంటి విషయాలను ప్రస్తావించాలని చంద్రబాబు సూచించారు. ఎక్కడా వెనక్కి తగ్గాల్సిన అవసరం లేదని.. ప్రజలు మనల్ని ఎన్నుకున్న విషయాన్ని మనం మరిచిపోరాదని.. అన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. సోమవారం నుంచి సభకు హాజరు కానున్నారు.
This post was last modified on March 5, 2022 9:02 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా అవతరించిన దురంధర్ తాజాగా ఓటిటిలో వచ్చాక కొత్త డిబేట్ మొదలయ్యింది. ఇంతకన్నా…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
ఏపీ సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్లు సుమారు గంటకుపైగా చర్చలు జరిపారు. బుధవారం ఉదయం ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసానికి…