Political News

బాబు త‌ప్ప‌.. అసెంబ్లీకి టీడీపీ ఎమ్మెల్యేలు

సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల హాజరుపై ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ తుది నిర్ణయం తీసుకుంది.  గ‌త న‌వంబ‌రులో జ‌రిగిన స‌మావేశాల్లో చంద్ర‌బాబు స‌తీమ‌ణిని వైసీపీ ఎమ్మెల్యేలు కొంద‌రు ఘోరంగా అవ‌మానించారంటూ.. బాబు క‌న్నీరు పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలోనే చట్టసభలకు వెళ్లరాదని, సీఎం అయ్యాకే వ‌స్తాన‌ని శ‌ప‌థం చేశారు. దీంతో స‌భ‌కు వెళ్లాలా? వ‌ద్దా అనే విష‌యంపై పార్టీ రెండురోజులుగా నేత‌ల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తోంది. ఈ క్ర‌మంలో ఇప్పటికే పొలిట్‌బ్యూరోలో మెజారిటీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత సమావేశాల్లో జరిగిన అవమానానికి కలత చెంది చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించారు.

చంద్రబాబు మినహా మిగిలిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరుపై పార్టీలో గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. మధ్యాహ్నం ఆన్లైన్లో జరిగిన టీడీఎల్పీ భేటీలో దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. సభకు హాజరుకాకుంటే ప్రత్యామ్నాయ కార్యక్రమాల నిర్వహణపై.. చంద్రబాబు టీడీఎల్పీలో చర్చించారు.

అయితే.. ఎఎవ‌రు ఎలా అనుకున్నా.. ప్ర‌జ‌ల కోసం.. టీడీపీ ప‌నిచేయాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఈ క్ర‌మంలో తాను చేసిన శ‌ప‌థానికి తాను క‌ట్టుబ‌డి ఉంటాన‌ని.. కానీ, పార్టీనేత‌లు మాత్రం ప్ర‌జ‌ల కోసం.. స‌భ‌ల‌కు హాజ‌రు కావాల‌ని ఆయ‌న సూచించారు. దీంతో సోమ‌వారం నుంచి జ‌ర‌గ‌నున్న అసెంబ్లీ, మండ‌లి స‌మావేశాల‌కు చంద్ర‌బాబు త‌ప్ప‌.. మిగిలిన నాయ‌కులు హాజ‌రు కానున్నారు.

అదేస‌మ‌యంలో ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై నిల‌దీయాల‌ని కూడా చంద్ర‌బాబు పార్టీ నేత‌ల‌ను ఆదేశించారు. ఇటు అసెంబ్లీ, అటు మండ‌లిలోనూ.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడాల‌ని సూచించారు. ప్ర‌తి ఒక్క‌రూ విధిగా స‌భ‌ల‌కు హాజ‌రై.. స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించాల‌ని.. ప్ర‌భుత్వం తీసుకున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ముఖ్యంగా చెత్త‌ప‌న్ను, ఓటీఎస్‌, లే అవుట్ల‌లో 5 శాతం భూముల కేటాయింపు, రాజ‌ధానిపై హైకోర్టు తీర్పు వంటి విష‌యాల‌ను ప్ర‌స్తావించాల‌ని చంద్ర‌బాబు సూచించారు. ఎక్క‌డా వెన‌క్కి త‌గ్గాల్సిన అవ‌స‌రం లేద‌ని.. ప్ర‌జ‌లు మ‌న‌ల్ని ఎన్నుకున్న విష‌యాన్ని మ‌నం మ‌రిచిపోరాద‌ని.. అన్నారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. సోమ‌వారం నుంచి స‌భ‌కు హాజ‌రు కానున్నారు.

This post was last modified on March 5, 2022 9:02 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

13 seconds ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

46 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

1 hour ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

2 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago