Political News

మంత్రులందరిది ఒకేమాటా?

రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుకు పూర్తి విరుద్ధంగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని, మూడు రాజధానుల ఏర్పాటు కుదరదని, అసలు మూడు రాజధానుల ఏర్పాటు అధికారమే రాష్ట్రప్రభుత్వం, అసెంబ్లీకి లేనేలేదని తేల్చి చెప్పేసింది. హైకోర్టు తీర్పు విషయంలో చాలామందికి తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయం తెలిసిందే. సరే తీర్పును పక్కనపెట్టేస్తే మంత్రులందరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు.

తీర్పుకు మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులే అని పదే పదే చెబుతున్నారు. తీర్పు రూపంలో కోర్టు ఇంత స్పష్టంగా చెప్పినా మంత్రులు మాత్రమే తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడుందని చెబుతున్నారు. బొత్సా సత్యనారాయణ, బాలినేని  శ్రీనివాసులరెడ్డి, మేకతోటి సుచరిత స్పష్టంగా ప్రకటించారు. మంత్రుల ప్రకటనలు చూస్తుంటే హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా మాట్లాడుతున్నట్లే ఉంది.

మంత్రులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రితో మాట్లాడకుండా స్వతంత్రంగా మాట్లాడే అవకాశాలు దాదాపు ఉండవని అర్ధమవుతోంది. పైగా హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తామని కూడా చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తే హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనకబడిపోతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు హేతుబద్దంగా లేదని అందరికీ అనిపిస్తునే ఉంది.

మూడు నెలల్లో రైతుల ప్లాట్లను డెవలప్ చేయటం సాధ్యంకాదు. అలాగే ఆరుమాసాల్లో అమరావతి నగరాన్ని నిర్మించటం ఎవరివల్లా కాదని అందరికీ తెలిసిందే. మనం డబల్ బెడ్ రూమ్ ఇంటిని కట్టుకోవాలంటేనే కనీసం ఏడాది పడుతుంది. అలాంటిది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆరుమాసాల్లో నవనగరాలను నిర్మించటం సాధ్యంకాదు. ఇలాంటి అనేక అంశాలపై సుప్రింకోర్టు స్టే ఇవ్వటమో లేకపోతే సవరించటమో జరుగుతుందని అధికారపార్టీ నేతలు ఆశిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఏమి చేస్తుందనే విషయమై ఆసక్తి పెరిగిపోతోంది.

Satya

Recent Posts

పవన్ కొత్త టార్గెట్ ఇదే!

2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏపీతో పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక…

1 hour ago

`అన్న‌లు` నా పార్టీలోనే ఉన్నారు: క‌విత షాకింగ్ కామెంట్స్‌

తెలంగాణ ర‌క్ష‌ణ‌ సేన‌(టీఆర్ఎస్‌) పార్టీ అధ్య‌క్షురాలు క‌విత ఏం మాట్లాడినా.. ఆలోచించే మాట్లాడ‌తార‌న్న పేరుంది. పైగా మాట‌ల విష‌యంలో ఆమె…

2 hours ago

అమర్ నాథ్ వ్యాఖ్యలపై అనిత రియాక్షన్

ఏపీ హోం మంత్రి వంగలపూడి అనితపై వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై…

2 hours ago

చిన్నారి కోరికపై వరంగల్‌కు పవన్… రాజకీయంగానూ ఆసక్తి!

జనసేన అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న చిన్నారి నిరంజన్…

2 hours ago

ఏపీలో ప్ర‌భుత్వం మార‌దు: చంద్ర‌బాబు

ఏపీలో సుస్థిర ప్ర‌భుత్వం కొన‌సాగుతుంద‌ని.. మ‌ళ్లీ మ‌ళ్లీ ప్ర‌భుత్వం మారే ప‌రిస్థితి కూడా ఉండ‌ద‌ని సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. ఆ…

3 hours ago

జూన్ పంతొమ్మిది… గెలుపు గుర్రం ఎవరిది

పెద్ది హడావిడి అయిపోతోంది. మూడో వారంలో అడుగు పెట్టబోతున్న తరుణంలో బుకింగ్స్ బానే ఉన్నాయి కానీ కలెక్షన్ల పరంగా మరీ…

3 hours ago