Political News

మంత్రులందరిది ఒకేమాటా?

రాజధాని అమరావతి విషయంలో హైకోర్టు తీర్పుకు పూర్తి విరుద్ధంగా మంత్రులు మాట్లాడుతున్నారు. రాజధానిగా అమరావతే ఉండాలని, మూడు రాజధానుల ఏర్పాటు కుదరదని, అసలు మూడు రాజధానుల ఏర్పాటు అధికారమే రాష్ట్రప్రభుత్వం, అసెంబ్లీకి లేనేలేదని తేల్చి చెప్పేసింది. హైకోర్టు తీర్పు విషయంలో చాలామందికి తీవ్ర అసంతృప్తి ఉందన్న విషయం తెలిసిందే. సరే తీర్పును పక్కనపెట్టేస్తే మంత్రులందరు విరుద్ధంగా మాట్లాడుతున్నారు.

తీర్పుకు మంత్రులు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తమ ప్రభుత్వ విధానం మూడు రాజధానులే అని పదే పదే చెబుతున్నారు. తీర్పు రూపంలో కోర్టు ఇంత స్పష్టంగా చెప్పినా మంత్రులు మాత్రమే తమ ప్రభుత్వం మూడు రాజధానులకే కట్టుబడుందని చెబుతున్నారు. బొత్సా సత్యనారాయణ, బాలినేని  శ్రీనివాసులరెడ్డి, మేకతోటి సుచరిత స్పష్టంగా ప్రకటించారు. మంత్రుల ప్రకటనలు చూస్తుంటే హైకోర్టు తీర్పుకు విరుద్ధంగా మాట్లాడుతున్నట్లే ఉంది.

మంత్రులు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే ముఖ్యమంత్రితో మాట్లాడకుండా స్వతంత్రంగా మాట్లాడే అవకాశాలు దాదాపు ఉండవని అర్ధమవుతోంది. పైగా హైకోర్టు తీర్పుపై సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తామని కూడా చెబుతున్నారు. ఒకవేళ ప్రభుత్వం సుప్రింకోర్టులో పిటీషన్ వేస్తే హైకోర్టు ఇచ్చిన తీర్పు వెనకబడిపోతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఎందుకంటే అమరావతి విషయంలో హైకోర్టు తీర్పు హేతుబద్దంగా లేదని అందరికీ అనిపిస్తునే ఉంది.

మూడు నెలల్లో రైతుల ప్లాట్లను డెవలప్ చేయటం సాధ్యంకాదు. అలాగే ఆరుమాసాల్లో అమరావతి నగరాన్ని నిర్మించటం ఎవరివల్లా కాదని అందరికీ తెలిసిందే. మనం డబల్ బెడ్ రూమ్ ఇంటిని కట్టుకోవాలంటేనే కనీసం ఏడాది పడుతుంది. అలాంటిది మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆరుమాసాల్లో నవనగరాలను నిర్మించటం సాధ్యంకాదు. ఇలాంటి అనేక అంశాలపై సుప్రింకోర్టు స్టే ఇవ్వటమో లేకపోతే సవరించటమో జరుగుతుందని అధికారపార్టీ నేతలు ఆశిస్తున్నారు. మొత్తానికి ప్రభుత్వం ఏమి చేస్తుందనే విషయమై ఆసక్తి పెరిగిపోతోంది.

Satya

Recent Posts

పాపం ఎవరిది… టికెట్ రేట్లదా ? పాప్ కార్న్ ధరలదా ?

ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…

1 hour ago

చెన్నై సంగీతం ఇంకా గట్టిగా వినిపించాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…

4 hours ago

వారణాసి విలన్ నో బడీ… చప్పుడు లేదేంటి

సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…

6 hours ago

ప్రేక్షకుల పల్స్ పట్టుకోవడం ఎలా

మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…

6 hours ago

తమిళంలోకి శివాజీ క్రేజీ ఎంట్రీ

తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్‌ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…

6 hours ago

నాయకుల మాట వినకపోతే చీలిక తప్పదు జగన్…!

ఏపీలో ప్ర‌తిప‌క్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయ‌కులు చీలిపోవ‌డ‌మో.. లేక కూట‌మిలోని ఓ పార్టీలో చేరిపోవ‌డ‌మో…

7 hours ago