Political News

పోలవరం: కేంద్రమంత్రి మాటలు నమ్మచ్చా?

‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపైసా కేంద్రమే భరిస్తుంది’ ఇది తాజాగా కేంద్ర జలశక్తి మంత్ర గజేంద్రసింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు జగన్మోహన్ రెడ్డితో కలిలి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనేక మాటలు చెప్పారు, హామీలూ ఇచ్చారు. వీటన్నింటిలోను ముఖ్యమైనది ఏమిటంటే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతిపైనా కేంద్రమే భరిస్తుందనేది.

ఇక్కడే మంత్రి మాటల నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే మొదటినుండి కేంద్రమంత్రులు చెబుతునే ఉన్నారు. ఇంతకుముందు జలశక్తి మంత్రులు కూడా పోలవరం సందర్శన సందర్భంగా హామీలిచ్చారు. తీరా నిదుల కోసం ఢిల్లీ వెళితే అక్కడ సవాలక్ష కొర్రీలు వేస్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటి పంపిన బిల్లులను మంజూరుచేయరు. బిల్లుల్లో భారీగా కోతలు వేసి వాళ్ళిష్టం వచ్చినపుడు మంజూరు చేస్తారు. 2017-18 సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని రు. 55,548 కోట్లుగా ఫైనల్ చేయమని రాష్ట్రప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పట్టించుకోవటంలేదు.

ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన నిర్వాసితుల పునరావాసానికి అయ్యే ఖర్చును తాము ఇచ్చేది లేదని ఒకపుడు కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం పెద్దఎత్తున పోరాటం చేసినా కేంద్రం అభ్యంతరాలు చెబుతునే ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాలని రాష్ట్రప్రభుత్వం అడుగుతునే ఉన్నా కేంద్రంనుండి సానుకూల నిర్ణయమైతే రాలేదు. తాజా పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు.

మొత్తానికి కేంద్రమంత్రులు పర్యటించిన సమయంలో ఏదో హామీలిచ్చేయటం, ఢిల్లీకి తిరిగెళ్ళిన తర్వాత మరచిపోవటం మామూలైపోయింది. మరి తాజా పర్యటన తర్వాత షెకావత్ ఏమి చేస్తారో చూడాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టు పురోగతిని మూడు నెలలపాటు వ్యక్తిగతంగా తానే పరిశీలిస్తానని చెప్పారు. నిజంగా మంత్రి ఆపని చేస్తే ప్రాజెక్టుకే మంచిది. అలాగే సవరించిన అంచనాలు రు. 55 వేల కోట్లకు కూడా కేంద్ర ఆర్ధికశాఖతో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య కూడా తీరుతుంది. మరి షెకావత్ ఏమి చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on March 5, 2022 11:39 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

పవన్‌కు బంపర్ మెజారిటీ?

ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారం కూడా సమయం లేదు. ఈ ఎన్నికల్లో అందరి దృష్టినీ…

34 mins ago

సందీప్ కిషన్ సినిమాలో ఫాదర్ ట్విస్టు

రవితేజ ధమాకా సూపర్ హిట్ తర్వాత ఏడాదికి పైగా గ్యాప్ తీసుకున్న దర్శకుడు త్రినాథరావు నక్కిన సందీప్ కిషన్ తో…

6 hours ago

మహాసేన రాజేష్.. మళ్లీ యుటర్న్

మహాసేన పేరుతో మీడియా సంస్థను నెలకొల్పి దళితుల కోసం బలంగా వాయిస్ వినిపిస్తూ మంచి పేరు సంపాదించిన వ్యక్తి రాజేష్.…

6 hours ago

నా దగ్గర డబ్బు లేదు-జగన్

దేశంలోనే ధనిక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఆయన అధికారిక ఆస్తులే వందల కోట్లయితే…

6 hours ago

నారా లోకేష్ కోసం.. రోడ్డెక్కిన‌ నంద‌మూరి కుటుంబం !

టీడీపీ యువ నాయ‌కుడు, మాజీ మంత్రి నారా లోకేష్ మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. గ‌త…

6 hours ago

అంబటికి మళ్లీ అల్లుడి కౌంటర్

ఆంధ్రప్రదేశ్ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా ఆయన అల్లుడు డాక్టర్ గౌతమ్ ఇటీవల పెట్టిన వీడియో ఎంత వైరల్ అయిందో…

7 hours ago