Political News

పోలవరం: కేంద్రమంత్రి మాటలు నమ్మచ్చా?

‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ప్రతిపైసా కేంద్రమే భరిస్తుంది’ ఇది తాజాగా కేంద్ర జలశక్తి మంత్ర గజేంద్రసింగ్ షెకావత్ చేసిన వ్యాఖ్యలు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు జగన్మోహన్ రెడ్డితో కలిలి ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి అనేక మాటలు చెప్పారు, హామీలూ ఇచ్చారు. వీటన్నింటిలోను ముఖ్యమైనది ఏమిటంటే ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ప్రతిపైనా కేంద్రమే భరిస్తుందనేది.

ఇక్కడే మంత్రి మాటల నమ్మశక్యంగా లేవు. ఎందుకంటే మొదటినుండి కేంద్రమంత్రులు చెబుతునే ఉన్నారు. ఇంతకుముందు జలశక్తి మంత్రులు కూడా పోలవరం సందర్శన సందర్భంగా హామీలిచ్చారు. తీరా నిదుల కోసం ఢిల్లీ వెళితే అక్కడ సవాలక్ష కొర్రీలు వేస్తారు. పోలవరం ప్రాజెక్టు అథారిటి పంపిన బిల్లులను మంజూరుచేయరు. బిల్లుల్లో భారీగా కోతలు వేసి వాళ్ళిష్టం వచ్చినపుడు మంజూరు చేస్తారు. 2017-18 సవరించిన అంచనాల ప్రకారం ప్రాజెక్టు వ్యయాన్ని రు. 55,548 కోట్లుగా ఫైనల్ చేయమని రాష్ట్రప్రభుత్వం కోరుతున్నా కేంద్రం పట్టించుకోవటంలేదు.

ప్రాజెక్టు నిర్మాణంలో భాగమైన నిర్వాసితుల పునరావాసానికి అయ్యే ఖర్చును తాము ఇచ్చేది లేదని ఒకపుడు కేంద్రం స్పష్టంగా చెప్పేసింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం పెద్దఎత్తున పోరాటం చేసినా కేంద్రం అభ్యంతరాలు చెబుతునే ఉంది. ప్రతి 15 రోజులకు ఒకసారి బిల్లులు చెల్లించాలని రాష్ట్రప్రభుత్వం అడుగుతునే ఉన్నా కేంద్రంనుండి సానుకూల నిర్ణయమైతే రాలేదు. తాజా పర్యటనలో కూడా జగన్మోహన్ రెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు.

మొత్తానికి కేంద్రమంత్రులు పర్యటించిన సమయంలో ఏదో హామీలిచ్చేయటం, ఢిల్లీకి తిరిగెళ్ళిన తర్వాత మరచిపోవటం మామూలైపోయింది. మరి తాజా పర్యటన తర్వాత షెకావత్ ఏమి చేస్తారో చూడాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాజెక్టు పురోగతిని మూడు నెలలపాటు వ్యక్తిగతంగా తానే పరిశీలిస్తానని చెప్పారు. నిజంగా మంత్రి ఆపని చేస్తే ప్రాజెక్టుకే మంచిది. అలాగే సవరించిన అంచనాలు రు. 55 వేల కోట్లకు కూడా కేంద్ర ఆర్ధికశాఖతో ఆమోదముద్ర వేయిస్తే నిధుల సమస్య కూడా తీరుతుంది. మరి షెకావత్ ఏమి చేస్తారో చూడాల్సిందే.

This post was last modified on March 5, 2022 11:39 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

2 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

5 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

5 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

5 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

6 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

7 hours ago