చేతకానివాళ్లే కులం, మతం, ప్రాంతాల గురించి మాట్లాడతారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. సమర్థులు మాత్రం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారని అన్నారు. తెలుగువారే తన కులం, తన మతమని, తెలుగువారంతా తన కుటుంబ సభ్యులే అని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైకాపాకు అడ్రెస్ లేకుండా చేయాల్సిన బాధ్యత ఐటీడీపీ కార్యకర్తలదే అని చంద్రబాబు సూచించారు.
గుండెపోటు పేరు చెప్పి బాబాయిపై గొడ్డలిపోటు వేశారని.. పైగా సిగ్గు లేకుండా సీబీఐపై ఎదురుదాడికి దిగారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సినిమాలోనూ చూడని విధంగా బాబాయిని హత్య చేశారని దుయ్యబట్టారు. రూ.40కోట్ల సుపారీ ఎవరి రక్తచరిత్ర అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమం(ఐటీడీపీ) సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి తీర్పును `నీలి మీడియా`లో చూపించనంత మాత్రాన నిజం ప్రజలకు చేరకుండా ఆగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సామాజిక మాధ్యమానికి ఉన్న శక్తి ఏపాటిదో అందరూ తెలుసుకోవాలన్నారు. సెల్ ఫోన్లే ఐటీడీపీ కార్యకర్తల ఆయుధాలని పేర్కొన్నారు. నిజాలను వెలికితీయటంలో ఐటీడీపీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచించారు.
25ఏళ్ల క్రితం ఫోన్లను ప్రమోట్ చేస్తే తనను ఎగతాళి చేశారని.. నేడు తిండిలేకపోయినా ఉండగలరు కానీ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్లో నాటిన హైటెక్ సిటీ విత్తనం ప్రజల కోసమేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి, చింతకాయల విజయ్తోపాటు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
కాగా, పోలవరంపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసి.. పైసా కూడా నిరూపించలేకపోయారని చంద్రబాబు మండిపడ్డారు. తాము తామే కనుక అధికారంలో కొనసాగుంటే.. ఈపాటికి పోలవరం ఉరకలెత్తేదని, అమరావతి పూర్తయ్యేదని పేర్కొన్నారు. పోలీసులు ఖబడ్దార్, చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలని హితవు పలికారు. కార్యకర్తలు.. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడించారు.
This post was last modified on March 5, 2022 6:43 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…