చేతకానివాళ్లే కులం, మతం, ప్రాంతాల గురించి మాట్లాడతారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు దుయ్యబట్టారు. సమర్థులు మాత్రం అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారని అన్నారు. తెలుగువారే తన కులం, తన మతమని, తెలుగువారంతా తన కుటుంబ సభ్యులే అని పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వైకాపాకు అడ్రెస్ లేకుండా చేయాల్సిన బాధ్యత ఐటీడీపీ కార్యకర్తలదే అని చంద్రబాబు సూచించారు.
గుండెపోటు పేరు చెప్పి బాబాయిపై గొడ్డలిపోటు వేశారని.. పైగా సిగ్గు లేకుండా సీబీఐపై ఎదురుదాడికి దిగారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ సినిమాలోనూ చూడని విధంగా బాబాయిని హత్య చేశారని దుయ్యబట్టారు. రూ.40కోట్ల సుపారీ ఎవరి రక్తచరిత్ర అని నిలదీశారు. పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీ సామాజిక మాధ్యమం(ఐటీడీపీ) సభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి తీర్పును `నీలి మీడియా`లో చూపించనంత మాత్రాన నిజం ప్రజలకు చేరకుండా ఆగిందా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సామాజిక మాధ్యమానికి ఉన్న శక్తి ఏపాటిదో అందరూ తెలుసుకోవాలన్నారు. సెల్ ఫోన్లే ఐటీడీపీ కార్యకర్తల ఆయుధాలని పేర్కొన్నారు. నిజాలను వెలికితీయటంలో ఐటీడీపీ కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని సూచించారు.
25ఏళ్ల క్రితం ఫోన్లను ప్రమోట్ చేస్తే తనను ఎగతాళి చేశారని.. నేడు తిండిలేకపోయినా ఉండగలరు కానీ ఫోన్ లేకుండా ఉండలేని పరిస్థితి ఉందన్నారు. హైదరాబాద్లో నాటిన హైటెక్ సిటీ విత్తనం ప్రజల కోసమేనని చెప్పారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అయ్యన్నపాత్రుడు, సోమిరెడ్డి, చింతకాయల విజయ్తోపాటు పార్టీ కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చారు.
కాగా, పోలవరంపై ఎన్నో అవినీతి ఆరోపణలు చేసి.. పైసా కూడా నిరూపించలేకపోయారని చంద్రబాబు మండిపడ్డారు. తాము తామే కనుక అధికారంలో కొనసాగుంటే.. ఈపాటికి పోలవరం ఉరకలెత్తేదని, అమరావతి పూర్తయ్యేదని పేర్కొన్నారు. పోలీసులు ఖబడ్దార్, చట్టాన్ని కాపాడకుండా ఉల్లంఘిస్తే గౌతం సవాంగ్ ఏమయ్యాడో ఆలోచన చేయాలని హితవు పలికారు. కార్యకర్తలు.. ఆరోగ్యపరంగా, వృత్తిపరంగా ఎలాంటి ఇబ్బంది వచ్చినా సమన్వయం చేసేందుకు ప్రత్యేక వ్యవస్థ రూపొందిస్తామని వెల్లడించారు.
This post was last modified on March 5, 2022 6:43 am
వారణాసి లాంటి ప్యాన్ వరల్డ్ మూవీ చేశాక మహేష్ బాబు నెక్స్ట్ ఏ దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడనే సస్పెన్స్…
కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే కూతురు, మహిళా ఎస్సై మధ్య జరిగిన ఫైటింగ్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆలయ…
టాక్సిక్ విడుదల నేపథ్యంలో దర్శకురాలు గీతూ మోహన్ దాస్ గురించి ప్రేక్షకుల్లో ఒకరకమైన ఆసక్తి నెలకొంది. ఎందుకంటే కెజిఎఫ్ తర్వాత…
ఇటీవలే విడుదలై బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టిస్తున్న ఇరుముడి మీద టీచర్ల సమాఖ్య అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. సినిమాలో ప్రభుత్వ…
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…