Political News

చైనాకు డబుల్ లాస్.. ధ్రువీకరించిన అమెరికా

రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినపుడు.. అవతలి వాళ్లే ఎక్కువ నష్టపోయారని.. తమకు జరిగిన నష్టం నామమాత్రమని ఆయా దేశాలు చెప్పుకుంటాయి. ఈ విషయంలో చైనా చేసే అతి గురించి అందరికీ తెలిసిందే. ప్రజాస్వామ్య దేశాలైతే యుద్ధంలో తమకు జరిగిన నష్టం గురించి బయటికి చెప్పక తప్పదు. మీడియాలో వార్తలొస్తాయి. అంతర్జాతీయ సమాజానికి విషయం తెలుస్తుంది. కానీ నియంతృత్వ పాలన ఉన్న చైనాలో ఏ సమాచారం బయటికి పొక్కనివ్వరు.

కరోనా విషయంలో ఎలా సమాచారాన్ని తొక్కి పెట్టి ప్రపంచాన్ని మాయ చేశారో తెలిసిందే. ఇక శత్రు దేశాలతో ఘర్షణ లేదా యుద్ధం జరిగినపుడు కూడా చైనా ఇదే తీరును అనుసరిస్తుంది. తమకు జరిగిన నష్టాన్ని బయటికి పొక్కనివ్వదు.

1962లో భారత్‌పై గెలిచిన యుద్ధం గురించి చైనా చెప్పుకుంటుంది కానీ.. 1967లో మన సైనికుల చేతిలో చావుదెబ్బ తిన్న ఉదంతాన్ని మాత్రం బయటికి రాకుండా చేయడానికి ప్రయత్నించింది. అప్పటి ఘర్షణలో వందల సంఖ్యలోనే చైనా తన సైనికుల్ని కోల్పోయిందన్నది చరిత్రకారులు చెప్పేమాట.

ఇక వర్తమానం విషయానికి వస్తే.. భారత్-చైనా సరిహద్దుల్లో కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. లద్దాఖ్ సమీపంలో తాజాగా జరిగిన ఘర్షణల్లో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడైంది. అందులో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు కూడా ఉన్నాడు.

ఐతే ఈ చిన్నపాటి యుద్ధంలో చైనా రెట్టింపు సంఖ్యలో సైనికుల్ని కోల్పోయినట్లు చెబుతున్నారు. కానీ చైనా ఈ విషయాన్ని అంగీకరించలేదు. భారత్ ఈ సంగతి చెబితే ప్రపంచం నమ్ముతుందో లేదో కానీ.. అమెరికా ఇంటలిజెన్స్ వర్గాలు చెబితే దానికే క్రెడిబిలిటీ వస్తుంది. 40 మందికి పైగానే చైనా సైనికులు చనిపోయినట్లు భారత్ చెబుతుండగా.. అమెరికా నిఘా వర్గాలు కనీసం 35 మంది చైనా సోల్జర్జ్ చనిపోయినట్లుగా పేర్కొంటున్నాయి.

ఈ మేరకు యుఎస్‌న్యూస్.కామ్ వెబ్ సైట్లో కథనం కూడా ప్రచురితమైంది. ‘‘అమెరికా ఇంటలిజెన్స్ వర్గాల లెక్కల ప్రకారం దాదాపు 35 మంది చైనా సైనికులు చనిపోయారు. వీరిలో ఓ సీనియర్ అధికారి కూడా ఉన్నారు. బలగాల ఉపసంహరణపై సమావేశం జరుగుతుండగానే ఈ ఘర్షణ చోటు చేసుకుంది’’ అని ఆ వెబ్ సైట్ పేర్కొంది.

This post was last modified on June 17, 2020 9:53 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

11 రూపాయల టికెట్లు రాంగా రైటా

ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…

5 hours ago

అనిరుధ్ మీద హైదరాబాదీల ప్రేమ

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…

7 hours ago

సభలోకి దేవుడిని లాగడం కరెక్టేనా?

ఏపీ అసెంబ్లీ బ‌డ్జెట్ స‌మావేశాల్లో శాస‌న స‌భ‌ను బాయ్‌కాట్ చేసిన వైసీపీ ప్ర‌జాప్ర‌తినిధులు శాస‌న మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…

7 hours ago

వేరే రాష్ట్రం నుంచి స్విగ్గీ ఏంటయ్యా ప్రభాస్?

తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్‌లో షూటింగ్స్…

9 hours ago

తిరుమల లడ్డూ వివాదం: 45 రోజుల్లో నిజాలు బహిర్గతం

ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…

9 hours ago

ప్రేక్షకుల మూడ్ ఇలా ఉందేంటి

ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…

10 hours ago