Political News

మూడు నెలల్లో ఏం చేస్తారో? జ‌గ‌న్‌కు స‌వాలే

పాల‌న వికేంద్రీక‌ర‌ణ కోసం మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌నే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి ఏపీ హైకోర్టు అడ్డుక‌ట్ట వేసింది. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తే అంటూ స్ప‌ష్ట‌మైన తీర్పునిచ్చింది. అంతే కాకుండా భూ స‌మీక‌ర‌ణ స‌మ‌యంలో రైతుల‌తో చేసుకున్న ఒప్పందాన్ని క‌చ్చితంగా పాటించాల‌ని ఆదేశించింది. దీంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఇప్పుడు ఎలాంటి అడుగులు వేస్తుందో అనే ఆస‌క్తి క‌లుగుతోంది. హైకోర్టు విధించిన గ‌డువు లోపు రాజ‌ధాని ప్రాంతంలో ప్ర‌భుత్వం అభివృద్ధి ప‌నులు చేస్తుందా? లేదా ఈ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్తుందా? అన్న‌ది సందేహంగా మారింది.

రైతుల‌తో సీఆర్‌డీఏ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వారికిచ్చిన హామీల అమ‌లుపై హైకోర్టు గ‌డువులు నిర్దేశించింది. రాజ‌ధానిలో నెల రోజుల్లో మౌలిక వ‌స‌తులు, మూడు నెలల్లో ఎల్‌పీఎస్ లేఅవుట్‌లు అభివృద్ధి చేసి రైతుల‌కు స్థలాలు అప్ప‌గించాల‌ని ఆదేశించింది. అంతే కాకుండా రాజ‌ధాని న‌గ‌ర నిర్మాణం, సీఆర్‌డీఏ ప్రాంత అభివృద్ధి ఆరు నెలల్లో పూర్తి చేయాల‌ని పేర్కొంది. ఎప్ప‌టిక‌ప్పుడూ ప‌నుల పురోగ‌తిపై కోర్టుకు నివేదిక‌లు అంద‌జేయాల‌ని ఆదేశించింది. దీంతో హైకోర్టు నిర్దేశించిన గ‌డువు లోపు వైసీపీ ప్ర‌భుత్వం ఈ ప‌నులు చేస్తుందా? అనే ప్ర‌శ్న రేకెత్తుతోంది.

కోర్టు ఆదేశాల‌కు అనుగుణంగా న‌డుచుకోవాలంటే వెంటనే సీఆర్‌డీఏను రంగంలోకి దించాలి. కానీ అప్ప‌ట్లో చేసిన ప‌నుల‌కు ఇంకా కొంద‌రు కాంట్రాక్ట‌ర్ల‌కు బిల్లులు చెల్లించ‌లేదు. ఆ బిల్లులు ఇవ్వ‌కుండా వాళ్లు మ‌ళ్లీ ప‌ని చేసేందుకు ముందుకు వ‌స్తారా? అన్న‌ది అనుమాన‌మే. ఎల్‌పీఎస్ లే అవుట్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ కేవ‌లం 4.45 శాతం ప‌నులే జ‌రిగాయి. ఇప్పుడా ప్రాంత‌మంతా పిచ్చి మొక్క‌ల‌తో నిండిపోయింది. వాటిని తొల‌గించి, హ‌ద్దులు నిర్ణ‌యించేందుకు నెల రోజుల స‌మ‌యం ప‌ట్టేలా ఉంద‌ని అంటున్నారు. మ‌రోవైపు అప్పుల్లో కూరుకుపోతున్న ఏపీకి ఈ అభివృద్ధి ప‌నుల కోసం నిధులు స‌మ‌స్య వేధించ‌డం ప‌క్కా. నిధుల స‌మీక‌ర‌ణ త‌ల‌నొప్పిగా మారుతుంది. రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితిపై స్పందిస్తూ ప్ర‌జ‌ల‌కు సంక్షేమ ప‌థ‌కాల పేరుతో డ‌బ్బులు పంచుతున్నారు క‌దా అని హైకోర్టు ప్ర‌స్తావించింది. అలాగే ఈ రాజ‌ధాని నిర్మాణం కోసం కూడా నిధులు ఖ‌ర్చు చేయాల‌ని సూచించింది.

రైతుల‌కు ప్లాట్ల‌ను అభివృద్ధి చేసి ఇవ్వ‌డ‌మ‌నేది స‌మ‌యం, నిధులతో ముడిప‌డిన అంశ‌మ‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ అన్నారు. అలాంటిది మూడు నెలల్లో ఏ ర‌కంగా ఇస్తామ‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ప్రాక్టిక‌ల్‌గానే మాట్లాడుతున్నా త‌ప్ప ఎవ‌రినో కించ‌ప‌ర‌చ‌డం లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. మ‌రి ఈ విష‌యంలో జ‌గ‌న్ ఏం చేస్తారో చూడాలి. 

This post was last modified on March 4, 2022 3:47 pm

Share

Recent Posts

బాల‌య్య, ర‌జినీకో న్యాయం… విజ‌య్‌కో న్యాయ‌మా?

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్ నుంచి వ‌చ్చిన చివ‌రి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్ మీద అభిమానులు ఎన్నో అంచ‌నాలు పెట్టుకున్నారు. కానీ ఆ…

6 hours ago

కొత్త నిర్మాతకు పెద్ద ఇబ్బందులు

ఇండస్ట్రీలో ఇబ్బందులు, సమస్యలు కేవలం చిన్న నిర్మాతలకే వస్తాయనుకుంటే పొరపాటే. ఎంత చెట్టుకు అంత గాలి తరహాలో ఎవరి కష్టాలు…

8 hours ago

వారణాసి అభిమానులకు కీరవాణి శుభవార్త

మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రమే కాకుండా సగటు తెలుగు సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న క్రేజీ మూవీ వారణాసి. ఆర్ఆర్ఆర్…

8 hours ago

ధనుష్ ఎంత లాజిక్కుతో మాట్లాడాడో

నేషనల్ అవార్డుల మీద గత రెండేళ్లుగా ఎంత చర్చ జరుగుతోందో చూస్తున్నాం. ఒకప్పుడు కళాత్మక విలువలున్న సినిమాలకే ఈ పురస్కారం…

8 hours ago

ఇప్పుడైనా ‘అన్న’తనం చూపించాలి జగన్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దయ, కనికరం, ఆప్యాయత, అభిమానం కలిగిన నేతగా ఆయన అభిమానులు, వైసీపీ…

10 hours ago

సుధీర్ బాబు రిస్కు వెనుక కారణం ఏమిటో

సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి ఎంత మద్దతు ఉన్నా సుధీర్ బాబు పెద్ద స్థాయికి వెళ్లలేకపోతున్నాడు. వరస ఫెయిల్యూర్స్…

13 hours ago