Political News

అమ‌రావ‌తి: జై కొడుతున్న కేసీఆర్!

సీఆర్డీఏ యాక్ట్ ను అమ‌లు చేయాల‌ని కోర్టు చెప్పినా కూడా వినేందుకు సిద్ధంగా లేమ‌ని నిన్న‌టి వేళ మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ చెప్ప‌డంతో ముందున్న కాలంలో అమ‌రావ‌తి రైతులు కేసీఆర్ మద్ద‌తు కూడా కోరేందుకు అవకాశాలు ఉన్నాయి. ఎలానూ విభ‌జ‌న చ‌ట్టం అమలులో జ‌రిగిన లేదా జ‌రుగుతున్న అన్యాయంపై జ‌గ‌న్ మాట్లాడడం లేదు కానీ రాజ‌ధాని ప్రాంతంకు చెందిన రైతుల‌ను మాత్రం బాగానే నిలువ‌రిస్తున్నారు. ఇందుకు కులం కార్డు  కూడా ఓ ఆయుధంగా మ‌లుస్తున్నారు.

అమ‌రావ‌తికి కేసీఆర్ జై కొడుతున్నారు.కొట్ట‌బోతున్నారు కూడా! ఇక‌పై ఆ ప్రక్రియ ఇంకా సులువు కానుంది కూడా! ఎందుకంటే రానున్న కాలంలో ఆంధ్రా రాజ‌కీయాల్లో కూడా ఆయ‌న రాణించాల‌న‌కుంటున్నారు. అదేవిధంగా త‌న‌కంటూ ఓ సొంత ఇమేజ్ ను క్రియేట్ చేసుకునే ప‌నిలో కూడా ఉన్నారు.ఉద్య‌మ పార్టీగా తెలంగాణ రాష్ట్ర స‌మితి ఉన్న‌ప్ప‌టి నుంచి ఆంధ్రాలో కూడా కేసీఆర్ కు మంచి ఫాలోయింగ్ ఉంది.దానిని ఎవ్వ‌రూ కాద‌న‌లేరు. అందుకే రానున్న కాలంలో సొంతంగా ఓ జాతీయ పార్టీ ప్రారంభించినా, పీపుల్స్ ఫ్రంట్ పేరిట కూట‌మి రాజ‌కీయాలు న‌డిపినా ఆయ‌న‌కు ఆంధ్రా పాలిటిక్స్ అన్న‌వి ఎంతో ముఖ్యం.ఇక్క‌డ ఓటు బ్యాంకు అన్న‌ది ఆయ‌న‌కు ఎంతో అవ‌స‌రం కూడా!

కేసీఆర్ త‌న‌దైన శైలిలో అమ‌రావ‌తి ఉద్య‌మానికి ముఖ్యంగా రాజ‌ధానిగా ఈ ప్రాంతాన్ని ఉంచేందుకు కూడా కేసీఆర్ మ‌ద్దతు ఎంతో అవ‌స‌రం. అయినా ఆ రోజు అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు మోడీతో పాటు కేసీఆర్ కూడా వ‌చ్చి వెళ్లారు.నాటి శిలాఫ‌ల‌కంపై కూడా మోడీ,కేసీఆర్ పేర్లు ఉంటాయి. క‌నుక ఆ రోజు మాదిరిగానే ఈ రోజు కూడా అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్ త‌రువాత కాలంలో కూడా అమ‌రావ‌తి రైతుల ఉద్య‌మానికి కానీ లేదా సంబంధిత ప్ర‌తిపాద‌న‌లకు కానీ మ‌ద్దతు ఇవ్వ‌డం ఖాయం. త‌ద్వారా రాజ‌కీయ ల‌బ్ధి పొందేందుకు  ఉన్న మార్గాలు అన్నీ కేసీఆర్ కే అనుకూలంగా మార‌నున్నాయి.

ఇదే ద‌శ‌లో జ‌గ‌న్ కు అమ‌రావ‌తి అభివృద్ధిపై అస్స‌లు ఇష్టం లేదు. అంతేకాదు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ల‌క్ష కోట్ల రూపాయ‌లు కావాల‌ని, అంత‌మొత్తం తాము వెచ్చించ‌లేమ‌ని అసెంబ్లీ వేదిక‌గా ఆర్థిక మంత్రి బుగ్గ‌న రాజేంద్ర చెప్పారు.దీంతో అమ‌రావతి కి సంబంధించి సీఆర్డీఏ చట్టం అమ‌లుకు సంబంధించి హైకోర్టు స్ప‌ష్టంగా తీర్పు వెలువ‌రించిన‌ప్ప‌ట‌కీ వాటిని పాటించేందుకు జ‌గ‌న్ క్యాబినెట్ సిద్ధంగా లేదు. ఎలా అయినా సుప్రీం వేదిక‌గా అమ‌రావ‌తి రైతుల పోరాటానికి వ్య‌తిరేకంగా 3 రాజ‌ధానుల‌కు మ‌ద్దతుగా న్యాయ పోరాటం చేయాల‌ని జ‌గ‌న్ అనుకుంటున్నారు. ఇదే క‌నుక జ‌రిగితే మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేసి అయినా ఈ ప్రాంత రైతుల ల‌బ్ధికి అటు కేసీఆర్ ఇటు చంద్ర‌బాబు ఏక‌మై  ఉద్య‌మాన్ని ముందుకు తీసుకువెళ్లే అవ‌కాశాలు ఉంటే అప్పుడు జ‌గ‌న్ కు రాజ‌కీయంగా చుక్కెదురు కావ‌డం ఖాయం.

This post was last modified on March 4, 2022 3:29 pm

Share

Recent Posts

దాయ్‌రాగా మారిన దిశా… బాగా లేటయ్యింది

ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…

16 minutes ago

షర్మిల కూతురి పెళ్ళికి జగన్ డుమ్మా ?

వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…

22 minutes ago

ప్యారడైజ్ పోటీ నుండి తప్పుకున్న కీర్తి సురేష్

ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…

2 hours ago

టార్గెట్ గ‌జ్వేల్‌.. కాంగ్రెస్ వ్యూహం ఇదీ!

గ‌జ్వేల్ నియోజ‌క‌వ‌ర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట‌. అయితే.. ఇక్క‌డే పాగా వేయాల‌ని.. వ‌చ్చే…

2 hours ago

మొహమాట పడితే ఎలాగయ్యా సట్టపులి

తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…

2 hours ago

సిగ్మా సౌండ్ సరిపోతుందంటారా

అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…

8 hours ago