ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి అగమ్య గోచరంగా మారిన సంగతి తెలిసిందే. జగన్ సీఎం అయిన తర్వాత మూడు రాజధానుల నిర్ణయం తీసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించిన బిల్లును రద్దు చేయడం వంటి పరిణామాలతో ఏపీ రాజధాని అమరావతి అని ఫిక్సయింది. అయితే, మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు వ్యవహారం తర్వాత కూడా అమరావతిలో డెవలప్ మెంట్ లేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది.
రాజధాని అమరావతి వ్యవహారంలో జగన్ కు హైకోర్టు షాక్ ఇచ్చింది. 3 రాజధానులు, సీఆర్డీఏ బిల్లుల రద్దు పిటిషన్లపై హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. సీఆర్డీఏ చట్టం ప్రకారం ప్రభుత్వం వ్యవహరించాలని, ఏపీ రాజధాని ప్లానింగ్ను రాబోయే 6 నెలల్లో పూర్తి చేయాలని కీలక తీర్పునిచ్చింది. ముందస్తు ఒప్పందం ప్రకారం 6 నెలల్లో అభివృద్ధి పనులన్నీ పూర్తి చేయాలని, భూములిచ్చిన రైతులకు 3 నెలల్లో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లను అప్పగించాలని ఆదేశించింది. ఆ పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
అంతేకాదు, అమరావతి రాజధాని అవసరాలకు తప్ప ఇతర వేరే పనులకు ఆ భూమి తనఖా పెట్టడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. అమరావతి మాస్టర్ ప్లాన్లో ఉన్నది ఉన్నట్లుగా అమలు చేయాలని, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని, లేని అధికారాలతో సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేయలేరని గుర్తు చేసింది. అంతేకాదు, అమరావతి నుంచి ఏ కార్యాలయాన్నీ తరలించకూడదని, పిటిషనర్లందరికీ ఖర్చుల కింద ప్రభుత్వం రూ.50 వేలు చెల్లించాలని సంచలన ఆదేశాలు జారీ చేసింది.
ఏపీ సీఆర్డీఏ రద్దు చట్టం, 3 రాజధాను చట్టాలను సవాలుచేస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులతో పాటు మరికొందరు ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్లపై విచారణ జరుగుతుండగానే జగన్ సర్కార్ కొత్త చట్టం తీసుకొచ్చింది. దీంతో, ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, రాజధానిలో ఆగిపోయిన పనులను కొనసాగించాలని తీర్పునిచ్చింది.
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో సోమవారం భారీ ప్రమాదం సంభవించింది. 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు.…