Political News

యూపీ ఫలితాలను టర్న్ చేయనున్న బీజేపీ!

ఉత్తరప్రదేశ్ లో ఎన్నికలు ముగింపు దశకు వచ్చేస్తున్నాయి. ఏడు విడతల పోలింగ్ లో ఇప్పటికి ఐదు విడతలు అయిపోయాయి. గురువారం ఆరో విడత పోలింగ్ జరగబోతోంది. ఈ దశలో జరిగిపోయిన పోలింగ్ సరళిపై అనేక విశ్లేషణలు వెలుగుచూస్తున్నాయి. వీటి ప్రకారం బీజేపీ-ఎస్పీ కూటమి అభ్యర్థుల గెలుపోటములపై బీఎస్పీ అభ్యర్థుల ప్రభావం కీలకంగా మారే అవకాశాలు ఉన్నట్లు అర్ధమవుతోంది.

ఎందుకంటే దళితుల్లో కీలకమైన జాతవ్ ల ఓట్లు ఎక్కువగా బీఎస్పీకే పడ్డాయని సమాచారం. మిగిలిన వాళ్ళ ఓట్లలో మెజార్టీ బీజేపీకి పడిందంటున్నారు. ఇదే సమయంలో జాట్లు, ముస్లింలు, యాదవుల ఓట్లు మ్యాగ్జిమమ్ ఎస్పీకే పడినట్లు చెబుతున్నారు. అలాగే ఓబీసీ ఓట్లలో బీజేపీ-ఎస్పీ కూటమి చీల్చుకున్నాయట. ఈ ఓట్ల చీలిక దగ్గరే బీఎస్పీ అభ్యర్థుల పాత్ర కీలకమైంది. ప్రతి నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్ధులు గనుక 10 వేల ఓట్లకు పైగా తెచ్చుకుంటే కచ్చితంగా అది పై రెండు కూటముల్లోని ఎవరో ఒకరిపై తీవ్ర ప్రభావం చూపటం ఖాయమంటున్నారు.

ఎందుకంటే బీఎస్పీ తరపున 93 మంది దళితులు పోటీ చేస్తున్నారు. 114 మంది ఓబీసీలను బీఎస్పీ అధినేత్రి మాయావతి రంగంలోకి దింపారు. 86 మంది ముస్లింలకు టికెట్లిచ్చారు. 110 మంది అగ్రవర్ణాల వారు బీఎస్పీ తరపున పోటీ చేస్తున్నారు. ముస్లింలకు ఎస్పీ కూడా ఇన్ని టికెట్లివ్వలేదు. బీఎస్పీ తరపున పోటీచేస్తున్న వారిలో ఎస్పీ తరపున పోటీ చేసే అవకాశం దొరక్క చివరి నిముషంలో బీఎస్పీలో చేరి టికెట్ తెచ్చుకుని పోటీలోకి దిగిన వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని తక్కువ అంచనా వేసేందుకు లేదని విశ్లేషకులంటున్నారు.

ప్రస్తుత ఎన్నికలు ఎలా జరుగుతున్నాయంటే గెలుపు నీదా నాదా అన్నంత టైటుగా జరుగుతోంది. ఇలాంటి సమయంలో మధ్యలో బీఎస్పీ ఎన్ని ఓట్లు తెచ్చుకుంటే పై రెండు ప్రధాన కూటముల అభ్యర్ధులపై అంత ప్రభావం పడుతుంది. నిజానికి బీఎస్పీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవు. అయితే ప్రత్యర్థి పార్టీల అభ్యర్ధులపై దెబ్బ పడటానికి మాత్రం కారణమవుతుంది.  అందుకనే అందరు ఇపుడు బీఎస్పీ అభ్యర్థుల గురించే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

This post was last modified on March 2, 2022 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

9 hours ago