Political News

ఏపీలో సంక్షేమ పథకాలపై సర్వేలో ఏం తేలింది?

ప‌థ‌కాలు ఏవ‌యినా స‌రే పేర్ల విష‌య‌మై ర‌గ‌డ నెల‌కొంటోంది.గ‌తంలో కూడా పేర్ల విష‌య‌మై వివాదం వ‌చ్చింది.కేంద్ర ప్రాయోజిక ప‌థ‌కాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ ప‌థ‌కాలుగా చెప్పుకుంటోంద‌ని బీజేపీ ఆరోపించింది.ఆధారాల‌తో స‌హా నిరూపించింది కూడా! ప్ర‌ధాని ఫొటో కూడా లేకుండా కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాలు అమ‌లు చేయ‌డం ఎంత‌వ‌ర‌కూ భావ్యం అని ప్ర‌శ్నించింది కూడా! తాజాగా చాలా రోజుల త‌రువాత ఓ వివాదం రేగింది.ప‌థ‌కాల అమ‌లుపై రేగిన ఈ వివాదం నేప‌థ్యం ఇలా ఉంది.

ఆంధ్రావనిలో సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లులో వైసీపీ స‌ర్కారు అన్ని అవ‌రోధాలూ దాటేందుకు ప్ర‌య‌త్నిస్తోంది.అప్పులున్నా కూడా సంక్షేమ ప‌థ‌కాల అమ‌లే ధ్యేయ‌మ‌ని, మొండి ధైర్యంతో ముందుకువెళ్తోంది. రెండున్న‌ర ఏళ్ల‌లో ల‌క్ష కోట్ల‌కు పైగా నిధుల‌ను సంక్షేమానికే వెచ్చించిన ఘ‌న‌త త‌మ‌ద‌ని వైసీపీ గ‌ర్వంగా చెబుతోంది. ప‌థ‌కాల అమ‌లు తీరుపై ప్ర‌శాంత్ కిశోర్ స‌ర్వే కూడా చేశార‌ని అంటున్నారు. కొంద‌రు చిరు వ్యాపారుల‌ను,సామాన్యుల‌ను క‌లిసి పీకే టీం ఇప్ప‌టికే మాట్లాడింద‌ని కూడా అంటున్నారు.

ఈ కోవ‌లో జ‌గ‌న్ కు విస్తుబోయే నిజాలు కూడా తెలిశాయ‌ని అంటున్నారు.ముఖ్యంగా చాలా మంది సంక్షేమ ప‌థ‌కాల అమ‌లును త‌ప్పు ప‌ట్టే విధంగా మాట్లాడార‌ని, రోడ్ల మ‌ర‌మ్మ‌తులు వంటి ప‌నులు వ‌దిలేసి మ‌రీ! డ‌బ్బులు పంచే కార్య‌క్ర‌మం మానుకోవాల‌ని కొంద‌రు హిత‌వు చెప్పార‌ని కూడా స‌మాచారం. ముఖ్యంగా నిరుద్యోగ స‌మ‌స్య‌ను క‌ట్ట‌డి చేస్తేనే ఏ ప్ర‌భుత్వం అయినా స‌క్సెస్ అయ్యింద‌ని భావించాలి అని పీకే టీం ద‌గ్గ‌ర కొంద‌రు చెప్పార‌ని తెలుస్తోంది. వీటి సంగ‌తి ఎలా ఉన్నా కూడా సంక్షేమానికి తాజాగా ఐదు వంద‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా వెచ్చించారు జ‌గ‌న్.

జ‌గ‌న‌న్న తోడు ప‌థ‌కానికి సంబంధించి చిరు వ్యాపారులకు అండ‌గా ఉండేందుకు ఒక్కొక్క‌రికీ ప‌ది వేలు చొప్పున 5,10,462 మందికి ఊతం ఇచ్చారు. వ‌డ్డీ లేని రుణం కింద ఈ మొత్తాన్ని జ‌మ చేశామ‌ని సీఎం అన్నారు.అదేవిధంగా వ‌డ్డీ భారాన్నీ తామే మోస్తామ‌ని చెప్పి అందుకు సంబంధించిన 16.16 కోట్ల రూపాయ‌ల‌ను కూడా జ‌మ చేశామ‌ని సీఎం తెలిపారు.స‌కాలంలో రుణాలు చెల్లిస్తే వ‌డ్డీ మాఫీ త‌ప్ప‌క ఉంటుంద‌ని దీనిని వినియోగించుకోవాల‌ని కూడా చెప్పారు. రుణాలు చెల్లిస్తే మ‌రోసారి రుణాల వ‌ర్తింపున‌కు అవ‌కాశం ఉంటుంద‌ని కూడా వివ‌రించారు.మ‌రోవైపు ఇదే ప‌థ‌కం అమలుపై విమ‌ర్శ‌లు రేగుతున్నాయి.వాస్తవానికి ఇది ప్ర‌ధాన మంత్రి స్వ‌నిధి యోజ‌న అని,దీనినే పేరు మార్చి అమ‌లు చేస్తున్నార‌ని జ‌న‌సేన ఆరోపిస్తుంది.కానీ బొత్స మాత్రం కేంద్రం త‌మ‌నే ఆద‌ర్శంగా తీసుకుంటోంద‌ని నిన్న‌మొన్న‌టి వేళ చెప్ప‌డం విశేషం. కేంద్రం కేవ‌లం ప‌ట్ట‌ణాల్లోనే ఈ ప‌థ‌కం తీసుకువ‌స్తే తాము ప‌ల్లెల‌కూ ఈ ప‌థ‌కం అమ‌లును విస్త‌రింప‌జేశాం అంటున్నారు.దీనిపై బీజేపీ నేత‌లు ఇంత‌వ‌ర‌కూ స్పందించ‌లేదు.

This post was last modified on March 2, 2022 12:09 pm

Share

Recent Posts

లక్షల్లో తీసిన చెత్త సినిమా… కోట్లలో కలెక్షన్లు

ఒక చిన్న వేడుక చేయడానికే కనీసం లక్ష రూపాయలు ఖర్చయ్యే సొసైటీలో ఉన్నాం మనం. అలాంటిది కేవలం రెండు నుంచి…

2 hours ago

రజిని సినిమాలో విలన్… రాపో పెద్ద రిస్కు?

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో రూపొందుతున్న ధర్మన్ షూటింగ్ మంచి ఊపు మీద ఉంది. ఇప్పటికే…

3 hours ago

మడమ తిప్పిన విజయ సాయిరెడ్డి… కొత్త పార్టీ రెడీ!

వైసీపీ మాజీ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి ప్రత్యక్ష రాజకీయాల నుంచి గత ఏడాది జనవరిలో తప్పుకున్న…

3 hours ago

శ్రీలీల మిస్సయ్యింది మమిత సాధించింది

ఇండస్ట్రీకి కొత్త హీరోయిన్లు వస్తున్నారు. ఇరవై, పాతిక వయసు ఉన్న వాళ్లకు మంచి అవకాశాలు దక్కుతున్నాయి. కానీ వాటిని ఎంచుకోవడం,…

3 hours ago

డీఎస్సీ నిర్వహణ సూపర్… లోకేష్ కు ఢిల్లీ మంత్రి అభినందనలు

రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన డీఎస్సీ పరీక్షల నిర్వాహణపై ప్రతిపక్ష వైసీపీ రాద్దాంతం చేస్తున్న విషయం తెలిసిందే. ఆధారాలు లేకుండా…

5 hours ago

మూడో బిడ్డను కంటే సంవత్సరం సెలవు

దక్షిణాది రాష్ట్రాల్లో తగ్గుతున్న జననాల రేటు నేపథ్యంలో కుటుంబాల్లో పిల్లల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వాలు పలు చర్యలు చేపడుతున్నాయి. ఈ…

6 hours ago