Political News

మరుగుదొడ్లకు టార్గెట్టా.. జగన్‌పై కొత్త ట్రోల్స్

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి కుంటుపడ్డ మాట వాస్తవం. ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్నాయంటూ అధికార పార్టీ నేతలు ఎంత ఎదురుదాడి చేసినప్పటికీ.. వాస్తవ పరిస్థితి జనాలకు అర్థమైపోతోంది. అభివృద్ధి కుంటు పడి, ఆదాయం పడిపోయి ప్రభుత్వాన్ని నడపడమే కష్టమైపోతోంది. నెపాన్నికేవలం కరోనా మీద నెట్టడానికి కూడా వీల్లేదు.

ఈ పరిస్థితుల్లో ఆదాయం పెంచుకోవడానికి వినూత్న మార్గాలు వెతుకుతోంది ప్రభుత్వం. ఇందులో భాగంగానే చెత్త పన్ను వేయడం.. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో జనాల నుంచి ఇళ్ల రిజిస్ట్రేషన్ కోసం డబ్బులు వసూలు చేయడం, చేపల దుకాణాలు తెరవడం లాంటివి చేశారు. వీటన్నింటిపైనా విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో ట్రోల్స్ పడ్డాయి. అయినా జగన్ సర్కారు తీరేమీ మారలేదు.

ఇప్పుడు గుంటూరు నగర పరిధిలో ఆదాయం కోసం అక్కడి అధికార వర్గాలు పెట్టుకున్న టార్గెట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మరుగుదొడ్ల నుంచి రోజువారీ, నెలవారీ ఇంత ఆదాయం రావాలంటూ టార్గెట్లు పెట్టి రెవెన్యూ సిబ్బందికి అధికారిక ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఒక్కో మరుగుదొడ్డి బాధ్యతను వీఆర్వోలకు అప్పగిస్తూ.. రోజుకు దేని దగ్గర ఎంత ఆదాయం రావాలో నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు. దీనికి సంబంధించిన జీవో సోషల్ మీడియాలో తెగ తిరిగేస్తోంది.

ఫలానా మరుగుదొడ్డి.. అది ఉన్న పంచాయితీ పరిధిలో ఉన్న సెక్రటరీ పేరు.. అలాగే దాని బాధ్యత చూడాల్సిన వీఆర్వోపేరు.. చివరగా రోజువారీ ఆదాయ లక్ష్యం నిర్దేశిస్తూ గుంటూరు కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ పేరుతో ఆదేశాలు జారీ అయ్యాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనుకుంటే.. ఇలా మరుగుదొడ్ల ఆదాయానికి టార్గెట్లు పెడతారా.. మొన్న భీమ్లా నాయక్ సినిమా థియేటర్ల దగ్గర కాపలాకు పెట్టిన వీఆర్వోలకు ఇప్పుడు ఈ బాధ్యతలు ఇచ్చారా అంటూ జగన్ సర్కారుపై కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.

This post was last modified on March 2, 2022 11:04 am

Share

Recent Posts

సాలిడ్ కంటెంట్ పడితే రవితేజ స్టామినా ఇది

టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…

29 minutes ago

వివేకా హత్యకు రూ.40 కోట్ల సుపారీ?

కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…

3 hours ago

మెగాస్టార్ ప్రస్థానం… టాలీవుడ్ మాస్ సంతకం

తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…

3 hours ago

సందీప్ వంగ ‘చిరు’ ఫ్యానిజం… ఇది చాలా లోతు బాసూ

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…

3 hours ago

చిరంజీవి కాకా… అదిరింది కానుక

ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…

4 hours ago

ప్యారడైజ్ నిర్ణయం ఇరుముడికి వరం

ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…

5 hours ago