Political News

గ‌జ్వేల్ నుంచే ప‌ని మొద‌లుపెట్టిన పీకే

దేశ‌వ్యాప్తంగా సుప‌రిచితుడు అయిన ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్రశాంత్కిషోర్ టీంతో టీఆర్ఎస్ ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ విష‌యంలో ఎక్క‌డా అధికారిక ప్ర‌క‌ట‌న విడుద‌ల కాన‌ప్ప‌టికీ త‌న‌కు అప్పగించిన బాధ్య‌త‌ల ప్ర‌కారం పీకే ఎంట్రీ ఇచ్చారు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణపై దృష్టి పెట్టినట్లు ఆయన పర్యటనల ద్వారా అర్థం అవుతోంది.

ఇప్పటికే తన టీం రాష్ట్ర వ్యాప్తంగా వివిధ అంశాలపై సర్వేలు చేస్తుండగా తాజాగా స్వయంగా పీకే కూడా రంగంలోకి దిగారు. గ‌జ్వేల్ నుంచే పీకే ప‌ని మొద‌లుపెట్టినట్లు తాజాగా ఆయ‌న రెండ్రోజుల టూర్ తెలియ‌జేస్తోంది. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాలనపై ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం మొద‌లుపెట్టిన ప్ర‌శాంత్ కిశోర్ నేరుగా జనంలోకి వెల్తున్నారు. అయితే, పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎవరూ గుర్తు పట్టకుండా జాగ్ర‌త్త‌ప‌డుతున్నారు.

సినీ నటుడు ప్రకాశ్ రాజ్‌తో కలిసి సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్లో పీకే శనివారం పర్యటించారు.  ఇద్దరూ ఉదయం నుంచి  సాయంత్రం పొద్దు పోయే వారకు వరకు గజ్వేల్లోనే పర్యటించారు. గజ్వేల్ పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వివిధ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. అలాగే మల్లన్నసాగర్ రిజర్వాయర్ను పరిశీలించారు. అయితే, తనను ఎవరూ ఏ మాత్రం గుర్తు పట్టకుండా జాగ్రత్త పడ్డారు.

సీఎం కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వ పాలన ఎలా ఉంది..? సీఎం కేసీఆర్ పెట్టిన పథకాలు బాగున్నాయా..? ఇంకా ఏం చేస్తే బాగుంటుంది..? అనే అంశాలను పలువురిని అడిగినట్లు తెలుస్తోంది. ఇంత వివ‌రంగా అధ్య‌య‌నం చేసిన‌ప్ప‌టికీ, గ‌జ్వేల్‌లో తన పర్యటనను రహస్యంగా ఉంచాలని ఆయన ముందే ప్రకాశ్రాజ్కు చెప్పినట్లు తెలుస్తోంది. మ‌రోవైపు త‌న జాగ్ర‌త్త తాను తీసుకుంటూ గ‌జ్వేల్‌ పర్యటనలో ప్రశాంత్ కిశోర్ రెండు మాస్క్‌లు ధరించారు. అందుకే తమ పక్కనే ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరు కూడా పీకేను ఏ మాత్రం గుర్తు పట్టలేకపోయారు. అయితే ఆదివారం ఉదయం ఈ విషయం తెలియడంతో ప్రజా ప్రతినిధులు ఆశ్చర్యపోతున్నారు.

This post was last modified on February 27, 2022 8:55 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

32 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

3 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

12 hours ago