గతంలో ఎన్నడూ లేని విధంగా కేవలం 2 రోజుల అసెంబ్లీ సమావేశాలను చరిత్రలో తొలిసారి చూస్తున్నాం. ఇదంతా కరోనా ప్రభావం. అయితే, వైసీపీ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉండటంతో సమావేశాల కాలం తగ్గినా బిల్లుల ఆమోదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పోతోంది. వీరికి 151 మంది మద్దతు ఉండటం ఒకటైతే… ఇతర పార్టీల నుంచి 3 ఓట్లు అనుకూలంగా ఉన్నాయి. పైగా టీడీపీకి చెందిన అచ్చెం నాయుడు రిమాండ్ ఖైదీగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో టీడీపీ బలం నిష్ఫలం.
ఈ నేపథ్యంలో బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వానికి నల్లేరు మీద నడకలా సులువైపోయింది. ఒక్కరోజులోనే పలు బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మరి వేటికి ఆమోదం లభించిందన్నది చూస్తే… ఇదిగో ఇదే ఆ లిస్టు.
రేపు మండలి సమావేశాలు మొత్తం రాజధాని, సీఆర్డీఏ బిల్లుల చుట్టే తిరగనుంది. ఇప్పటికే ప్రతిపక్ష నేత చంద్రబాబు మళ్లీ అవే బిల్లులు తేవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. మండలిలో ప్రతిపక్షానికి మెజారిటీ ఉన్న విషయం తెలిసిందే.
This post was last modified on June 16, 2020 11:42 pm
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…
ఏపీ రాజధాని అమరావతి అందరిదీ. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ప్రజల పరంగా ఎక్కడా రాజధానిపై వ్యతిరేకత కూడా…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్.. ఒకప్పుడు టాలీవుడ్కు నాలుగు స్తంభాల్లా నిలబడ్డ స్టార్ హీరోలు.…
ప్రభాస్ సినిమా అంటేనే భారీ యుద్ధాలు, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ లు గుర్తొస్తాయి. అయితే వరుసగా అవే చేయడం…
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సోకాల్డ్ రాజధాని అంటూ అమరావతిని…