Political News

కేసీఆర్ అసలు ప్లాన్.. అడ్డంకులివేనా?

నాన్ బీజేపీ,  నాన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్ధాయిలో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు అందరు చూస్తున్నదే. కొందరితో ఫోన్లో మాట్లాడారు మరికొందరిని నేరుగా కలిశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో భేటీ అయ్యారు.

మొదటి నుండి జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అవసరం లేకుండానే కొత్త వేదిక ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెబుతునే ఉన్నారు. దీనికి తాజాగా కేసీఆర్ ప్లాన్ అంటు ఒక సమాచారం బయటకు పొక్కింది. అదేమిటంటే కేవలం ప్రాంతీయ పార్టీలతోనే బలమైన వేదికను ఏర్పాటు చేయాలన్నది కేసీయార్ ప్లానట. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఒక ఫ్రంట్ గా ఏర్పడితే రెండు జాతీయ పార్టీలను ధీటుగా ఎదుర్కోవచ్చనేది కేసీయార్ ఆలోచనగా ఉంది.

తమిళనాడులో ఈ మధ్యనే డీఎంకే అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. కర్నాటకలో జేడీఎస్ ప్రతిపక్షంలో ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ మధ్యనే అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిల్లో ప్రాంతీయ పార్టీలతో మాత్రమే వేదికను ఏర్పాటు చేయాలని కేసీయార్ అనుకుంటే ఎన్ని పార్టీలు కలిసొస్తాయో అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతం డీఎంకే యూపీఏ కూటమిలో ఉంది. దీనికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది.

అలాగే మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే గనుక కేసీయార్ తో చేతులు కలిపితే సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. కాంగ్రెస్ సహకారం లేకుండా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం నడవలేదు. ఇక బెంగాల్లో దీదీ సంగతంటారా ఆమె రూటే సపరేటు. ప్రత్యామ్నాయ వేదికకు తానే నేతృత్వం వహించాలని, ప్రధానమంత్రి అభ్యర్ధిగా తానే ఉండాలని మమత కోరుకుంటున్నారు. కాబట్టి కేసీయార్ అయినా మరొకరి నాయకత్వాన్నైనా దీదీ అంగీకరించే అవకాశం తక్కువ. ఎందుకంటే ప్రస్తుత సీఎంల్లో సీనియర్ మోస్ట్, మూడోసారి సీఎం అయ్యింది మమతానే. కాబట్టి కేసీయార్ ప్లాన్ ఎంతవరకు అమలవుతుందో చూడాల్సిందే.

This post was last modified on February 23, 2022 10:28 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబుపై అంబటి బూతుపురాణం… ఏం జరిగింది?

వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…

52 minutes ago

చిట్టి ఇలా రెచ్చిపోయిందేంటి…

ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…

2 hours ago

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…

2 hours ago

పసిడి పతనం: 48 గంటల్లో రూ. 1.8 లక్షల సంపద ఆవిరి

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…

3 hours ago

11న అసెంబ్లీ… ఆ 11 మంది వస్తారా?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…

3 hours ago

తిరుమల లడ్డు వ్యవహారం… టీటీడీ ఈవో బదిలీ?

తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…

4 hours ago