Political News

కేసీఆర్ అసలు ప్లాన్.. అడ్డంకులివేనా?

నాన్ బీజేపీ,  నాన్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా జాతీయ స్ధాయిలో కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్ చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు అందరు చూస్తున్నదే. కొందరితో ఫోన్లో మాట్లాడారు మరికొందరిని నేరుగా కలిశారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ తో భేటీ అయ్యారు.

మొదటి నుండి జాతీయపార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అవసరం లేకుండానే కొత్త వేదిక ఏర్పాటు చేయాలని కేసీఆర్ చెబుతునే ఉన్నారు. దీనికి తాజాగా కేసీఆర్ ప్లాన్ అంటు ఒక సమాచారం బయటకు పొక్కింది. అదేమిటంటే కేవలం ప్రాంతీయ పార్టీలతోనే బలమైన వేదికను ఏర్పాటు చేయాలన్నది కేసీయార్ ప్లానట. అంటే ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమై ఒక ఫ్రంట్ గా ఏర్పడితే రెండు జాతీయ పార్టీలను ధీటుగా ఎదుర్కోవచ్చనేది కేసీయార్ ఆలోచనగా ఉంది.

తమిళనాడులో ఈ మధ్యనే డీఎంకే అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలో ఉంది. కర్నాటకలో జేడీఎస్ ప్రతిపక్షంలో ఉంది. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఈ మధ్యనే అధికారంలోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే వీటిల్లో ప్రాంతీయ పార్టీలతో మాత్రమే వేదికను ఏర్పాటు చేయాలని కేసీయార్ అనుకుంటే ఎన్ని పార్టీలు కలిసొస్తాయో అనుమానమే. ఎందుకంటే ప్రస్తుతం డీఎంకే యూపీఏ కూటమిలో ఉంది. దీనికి కాంగ్రెస్ నేతృత్వం వహిస్తోంది.

అలాగే మహారాష్ట్రలో శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే గనుక కేసీయార్ తో చేతులు కలిపితే సంకీర్ణ ప్రభుత్వం పడిపోయే అవకాశముంది. కాంగ్రెస్ సహకారం లేకుండా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం నడవలేదు. ఇక బెంగాల్లో దీదీ సంగతంటారా ఆమె రూటే సపరేటు. ప్రత్యామ్నాయ వేదికకు తానే నేతృత్వం వహించాలని, ప్రధానమంత్రి అభ్యర్ధిగా తానే ఉండాలని మమత కోరుకుంటున్నారు. కాబట్టి కేసీయార్ అయినా మరొకరి నాయకత్వాన్నైనా దీదీ అంగీకరించే అవకాశం తక్కువ. ఎందుకంటే ప్రస్తుత సీఎంల్లో సీనియర్ మోస్ట్, మూడోసారి సీఎం అయ్యింది మమతానే. కాబట్టి కేసీయార్ ప్లాన్ ఎంతవరకు అమలవుతుందో చూడాల్సిందే.

This post was last modified on February 23, 2022 10:28 am

Share

Recent Posts

చిన్న శ్రీను శాంపిల్ మాత్ర‌మే.. మ‌రింత మంది సైకిల్ ఎక్కేస్తారా?

వైసీపీకి డేంజ‌ర్ బెల్స్ మోగుతున్నాయా.. ఉత్త‌రాంధ్రలో తాజాగా చోటు చేసుకున్న చిన్న శ్రీను వ్య‌వ‌హారంతో పాటు.. పార్టీలో మ‌రింత మంది…

7 hours ago

ఏఐ వాడకం… ముంచుకొస్తున్న ప్రమాదం

జాంబీ సినిమాలో వైరస్ లాగా ఏఐ వాడకం క్రమంగా టెకీస్ నుంచి సామాన్యుల చేతుల్లోకి వెళ్ళిపోతోంది. ఒకరేమో వారణాసిలో మహేష్…

7 hours ago

డిజాస్టర్ తాత సినిమాకు సీక్వెల్ వస్తోందా

లోక నాయకుడు కమల్ హాసన్, లెజెండరీ దర్శకుడు శంకర్ కాంబోలో వచ్చిన ఇండియన్ 2 / భారతీయుడు 2 డిజాస్టర్…

10 hours ago

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

11 hours ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

11 hours ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

11 hours ago