Political News

తెలంగాణ మ‌న‌దే.. అధికారం ఖాయం: బండి సంజ‌య్

తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని  అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్‌లో పదాధికారుల భేటీలో బండి సంజయ్ పాల్గొన్నారు. పార్టీ సీనియర్‌ నాయకులైనా క్రమశిక్షణ మీరితే వేటు తప్పదని  సంజయ్‌ హెచ్చరించారు. ఏ పార్టీలోనైనా నిత్య అసమ్మతివాదులుంటారని ఆయన తెలిపారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయిందని… ఈ పరిస్థితుల్లో దేశ రాజకీయాలంటూ కొత్త నాటకాలు మొదలెట్టారని విమర్శించారు.

బీజేపీపై కేసీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. ప్రశ్నిస్తే గృహనిర్బంధాలు, కేసులని భయపెడుతు న్నారని ఆరోపించారు. మున్ముందు బీజేపీ శ్రేణులకు మరిన్ని నిర్బంధాలు తప్పవని సూచించారు. కేంద్ర నాయకత్వం పూర్తి అండగా ఉందని తెలిపారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావ‌డం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. “రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనైపోయింది. దేశ రాజకీయాలంటూ కొత్త నాటకాలు మొదలెట్టారు. బీజేపీపై కేసీఆర్‌ విష ప్రచారం చేస్తున్నారు. ప్రశ్నిస్తే గృహనిర్బంధాలు, కేసులని భయపెడుతున్నారు“. అని నిప్పులు చెరిగారు.

 మున్ముందు బీజేపీ శ్రేణులకు మరిన్ని నిర్బంధాలు తప్పవ‌ని చెప్పారు. “తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. కేంద్ర నాయకత్వం పూర్తి అండగా ఉంది. ఏ పార్టీలోనైనా నిత్య అసమ్మతివాదులుంటారు. సీనియర్ నాయకులైనా క్రమశిక్షణ మీరితే వేటు తప్పదు“ అని బండి వ్యాఖ్యానించారు. అంతేకాదు.. రాష్ట్రంలో అభివృద్ధి చేసింది కేంద్ర నిధుల‌తోనేన‌ని.. చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తీసుకుంటూ.. రాష్ట్రం బీద‌ప‌లుకులు ప‌లుకుతోంద‌ని అన్నారు.

ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులుంటారన్నారు. వారు పనిచేయరని, పనిచేసే వాళ్లపై అక్కసు గక్కడమే వారి పని అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన  అవసరం లేదన్నారు. పార్టీ కోసం చిత్తశుద్దితో కృషి చేయాలన్నారు. రాబోయే రోజుల్లో అధికారంలోకి వచ్చే సమయమిదన్నారు. అలాంటి వాళ్ల మాటలు నమ్మి దారి తప్పితే రాజకీయ భవిష్యత్ దెబ్బతింటుందని బండి సంజ‌య్ పార్టీ నేత‌ల‌ను హెచ్చరించారు.

Satya

Recent Posts

ప్యారడైజ్ కొత్త ముహూర్తం ఫిక్సయ్యిందా

ప్యాన్ ఇండియా సినిమాలకు వాయిదాలు మంచి నీళ్లు తాగినంత సులభంగా మారిపోయాయి. రెండు కన్నా తక్కువ డేట్లు మార్చుకుని థియేటర్లకు…

4 minutes ago

రేపు విశాఖకు వైఎస్ జగన్

వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…

19 minutes ago

కొత్త ‘పెద్ది’ త్వరగా వచ్చేయాలి

అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…

2 hours ago

AA23 విలన్ పైనే అందరి కన్ను!

అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…

2 hours ago

రూ.25 లక్షల పరిహారం… ఓ శాశ్వత ఉద్యోగం

విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…

3 hours ago

మీనాక్షి కోసం డీకే క్యాంపు

గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…

3 hours ago