Political News

మ‌ళ్లీ రెచ్చిపోయిన‌ ర‌ఘురామ‌కృష్ణంరాజు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తిరుగుబావుటా ఎగుర‌వేసిన ఆ పార్టీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు.. మ‌రోసారి ఫైర్ బ్రాండ్ వ్యాఖ్య‌ల‌తో రెచ్చిపోయారు. ఇటీవ‌లే ఒక వీడియో పెట్టి జ‌గ‌న్, వైకాపా మీద తీవ్ర విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు చేసిన ఆయ‌న‌.. మ‌రోసారి ఆ పార్టీపై విరుచుకుప‌డ్డారు. త‌న‌పై విమ‌ర్శ‌లు చేసిన వైకాపా ఎమ్మెల్యేల‌కు ఆయ‌న గ‌ట్టిగా బ‌దులిచ్చారు. ఈ సంద‌ర్భంగా ‘‘సింహం సింగిల్‌గా వస్తుంది.. పందులే గుంపులుగా వస్తాయన్న చందంగా అసెంబ్లీ లాబీలో నాపై పడ్డారు’’ అంటూ ఆయ‌న ర‌జ‌నీకాంత్ డైలాగ్ పేల్చ‌డం విశేషం.

‘‘ఎవరండీ వీళ్లు, ఆఫ్ట్రాల్ గాళ్లు.. ఈ జోకర్లు ఎప్పుడైనా నా గురించి జగన్‌కు చెప్పారా? జగన్‌ను అడగండి. ఆయన అబద్దం చెప్పరు. వాళ్లంతా దొంగలు, ప్రజల నుంచి డబ్బులు, చెక్కులు వసూలు చేశారు. ఎన్నిసార్లు నా కొంప చుట్టూ తిరిగారో, దేనికి తిరిగారో కొట్టు సత్యనారాయణకు తెలీదా. ఆ దొంగ సంగతి ఆయన మేనల్లుడిని అడిగితే చెబుతాడు. ఇళ్ల స్థలాల సేకరణ, ఇళ్ల పట్టాలకు సంబంధించి 70 శాతం ఫిర్యాదులు తణుకు ఎమ్మెల్యే కారుమూరిపైనే వచ్చాయి. వీళ్ళంతా దొంగలు, ప్రజల నుంచి క్యాష్, చెక్కులు కలెక్ట్ చేశారు. భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సౌమ్యుడు, నిజాయితీ పరుడు.. జగన్ అపాయింట్ మెంట్ దొరకడంలేదని బాధ పడేవారు.’’ అని రఘురామ కృష్ణంరాజు అన్నారు.

వైసీపీలోకి వస్తానని తాను బతిమాలడం ఏంటని ప్ర‌శ్నించిన‌ రఘురామకృష్ణంరాజు.. గత ఏడాది రిషీ అనే వ్యక్తి ద్వారా ప్రశాంత్ కిశోర్ తనను కలిశారని, పార్టీలో చేరాలని తనకు ఎన్నో ప్రలోభాలు పెట్టారని వెల్లడించారు. తనను ఏ విధంగా ప్రలోభాలకు గురిచేశారో అక్కడే ఉన్న విజయసాయిరెడ్డిని, రాజిరెడ్డిలను అడగాలన్నారు. తాను ఇప్పటి వరకు జగన్ ఇంటికే వెళ్లలేదని, ఎయిర్‌పోర్ట్‌లో ఒకసారి మాత్రమే ఆయన్ను కలిశానని చెప్పారు.

This post was last modified on June 16, 2020 8:34 pm

Share
Show comments

Recent Posts

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

5 minutes ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago