Political News

వివేకా హ‌త్య‌.. 10 ఎక‌రాల భూమి ఇస్తామ‌న్నారు

సీఎం జ‌గ‌న్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అప్రూవ‌ర్‌గా మారిన‌ దస్తగిరి వాంగ్మూలం బ‌య‌ట‌కు వ‌చ్చింది. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై సీబీఐకి ఫిర్యాదు చేశాడు. తనను కలిసిన వారి వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చారు. దస్తగిరివాంగ్మూలం తర్వాత తనను భరత్ యాదవ్ కలిశాడని పేర్కొన్నాడు. ఎంపీ అవినాష్‌రెడ్డి తోట వద్దకు రావాలని భరత్‌ యాదవ్‌ అడిగినట్లు తెలిపాడు.

అంతేకాదు.. తన ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు భరత్ యాదవ్‌, న్యాయవాది వచ్చారని ద‌స్త‌గిరి వెల్ల‌డించాడు. భాస్కర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి పంపించారని.. 10-20 ఎకరాల భూమి ఇస్తామన్నారని చెప్పాడు. ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారని స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నాడు. భరత్‌ యాదవ్ తనను తరచుగా అనుసరిస్తున్నాడని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో ద‌స్త‌గిరి వెల్ల‌డించాడు.

మ‌రోవైపు.. వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మెజిస్ట్రేట్‌ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రిమాండ్‌, వాయిదా, బెయిల్‌ అంశాలు కడప కోర్టులోనేనని మెజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్‌ నలుగురికి సీబీఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు.

అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడవును న్యాయస్థానం.. 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులోని సునీల్‌ యాదవ్‌, ఉమాశంకర్‌రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకువచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్‌రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు.

This post was last modified on February 22, 2022 6:09 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

గల్లి సమస్యను సైతం వదలని లోకేష్!

అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…

12 minutes ago

చరణ్ రాకతో పెరిగిన ఛాంపియన్ మైలేజ్

నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…

24 minutes ago

రుషికొండ పంచాయతీ… కొలిక్కి వచ్చినట్టేనా?

వైసీపీ హ‌యాంలో విశాఖ‌ప‌ట్నంలోని ప్ర‌ఖ్యాత ప‌ర్యాట‌క ప్రాంతం రుషికొండ‌ను తొలిచి.. నిర్మించిన భారీ భ‌వ‌నాల వ్య‌వ‌హారం కొలిక్కి వ‌స్తున్న‌ట్టు ప్ర‌భుత్వ…

1 hour ago

అఖండ 2 చేతిలో ఆఖరి బంతి

భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…

1 hour ago

రాంబాబు రావడమే ఆలస్యం

మలయాళంలో దృశ్యం 3 షూటింగ్ అయిపోయింది. మోహన్ లాల్ సహకారంతో దర్శకుడు జీతూ జోసెఫ్ చాలా వేగంగా పూర్తి చేసి…

2 hours ago

తెలంగాణ కాంగ్రెస్ పనితీరుపై చంద్రబాబు రివ్యూ

ఏపీలో వ‌చ్చే మూడు మాసాల్లో స్థానిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో నాయ‌కులు అలెర్టుగా ఉండాల‌ని సీఎం చంద్ర‌బాబు సూచించారు.…

2 hours ago