సీఎం జగన్ చిన్నాన్న వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి వాంగ్మూలం బయటకు వచ్చింది. వాంగ్మూలం ఇచ్చాక తనను కలిసిన వారిపై సీబీఐకి ఫిర్యాదు చేశాడు. తనను కలిసిన వారి వివరాలను సెప్టెంబర్ 30న సీబీఐకి ఇచ్చారు. దస్తగిరివాంగ్మూలం తర్వాత తనను భరత్ యాదవ్ కలిశాడని పేర్కొన్నాడు. ఎంపీ అవినాష్రెడ్డి తోట వద్దకు రావాలని భరత్ యాదవ్ అడిగినట్లు తెలిపాడు.
అంతేకాదు.. తన ఇంటి సమీప హెలిపాడ్ వద్దకు భరత్ యాదవ్, న్యాయవాది వచ్చారని దస్తగిరి వెల్లడించాడు. భాస్కర్రెడ్డి, శంకర్రెడ్డి పంపించారని.. 10-20 ఎకరాల భూమి ఇస్తామన్నారని చెప్పాడు. ఎంత డబ్బు కావాలో చెప్పమన్నారని స్టేట్మెంట్లో పేర్కొన్నాడు. భరత్ యాదవ్ తనను తరచుగా అనుసరిస్తున్నాడని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో దస్తగిరి వెల్లడించాడు.
మరోవైపు.. వివేకా హత్య కేసు పులివెందుల నుంచి కడప జిల్లా కోర్టుకు బదిలీ అయింది. ఈ మేరకు కేసు విచారణను పులివెందుల మెజిస్ట్రేట్ బదిలీ చేశారు. దీంతో ఇక నుంచి కడప జిల్లా కోర్టులోనే వివేకా హత్య కేసు విచారణ జరగనుంది. రిమాండ్, వాయిదా, బెయిల్ అంశాలు కడప కోర్టులోనేనని మెజిస్ట్రేట్ ఆదేశించారు. మరోవైపు పులివెందుల కోర్టుకు నలుగురు నిందితులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ నలుగురికి సీబీఐ అభియోగ పత్రాల వివరాలు అందించారు.
అంతకుముందు ప్రధాన నిందితులైన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిలను సీబీఐ అధికారులు పులివెందుల మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. కేసులోని ముగ్గురు నిందితుల రిమాండ్ గడవును న్యాయస్థానం.. 14 రోజుల పాటు పొడిగించింది. కడప జైలులోని సునీల్ యాదవ్, ఉమాశంకర్రెడ్డిలను కొంత ఆలస్యంగా కోర్టుకు తీసుకువచ్చారు. మరో నిందితుడు దేవిరెడ్డి శివశంకర్రెడ్డి అనారోగ్య కారణాలతో కోర్టుకు హాజరుకాలేదు. శివశంకర్రెడ్డి ప్రస్తుతం కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నారు.
టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునేందుకు యువ హీరోయిన్ రాశీ సింగ్ గట్టిగానే ప్రయత్నిస్తోంది. మొదటి నుంచి…
క్రిస్టఫర్ నోలన్ కొత్త సినిమా ‘ది ఒడిస్సీ’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. ప్రపంచ చరిత్రలో ఎంతో ప్రత్యేకంగా చెప్పుకునే గ్రీక్, ట్రాయ్…
72వ జాతీయ అవార్డుల్లో ఉత్తమ నటుడు అవార్డు పుష్ప 2కి గాను అల్లు అర్జున్ కి మరోసారి రావొచ్చేమో అని…
క, కె ర్యాంప్ ఊపులో ఉన్న కిరణ్ అబ్బవరంకు మధ్యలో దిల్ రుబా ఒకటే షాక్ ఇచ్చింది కానీ దాని…
తెలుగు సినిమాలో స్క్రీన్ ప్లే అనగానే గుర్తుకొచ్చే పేరు.. సుకుమార్. ఈ లెక్కల మాస్టారి కథన నైపుణ్యం గురించి ఎంత…
72వ జాతీయ చలనచిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ఈ రోజు ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న…