Political News

ఈ గ‌ట్టునుంటావా.. ఆ గ‌ట్టుకెళ్తావా..ఎమ్మెల్యేపై ఒత్తిడి..!


ఒక పార్టీ త‌ర‌ఫున గెలిచారు.. మ‌రో పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కుటుంబ‌స‌మేతంగా వెళ్లి సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. పార్టీ కండువాను కూడా క‌ప్పుకొన్నారు. ఇంత వ‌రకు బాగానే ఉంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న క‌ల‌వ‌లేక పోతున్నారు. అడుగడుగునా.. ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో అస‌లు ఆయ‌న వైసీపీలోనే ఉంటారా?  లేక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. మ‌ళ్లీ పాత‌గూటికి చేరుకుంటారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌రు కాబ‌ట్టి.. ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు.

ఇంత‌కీ.. ఆయ‌న ఎవ‌రంటే.. విశాఖ‌న‌గ‌రంలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వాసుప‌ల్లి గ‌ణేష్‌. ఈయ‌న టీడీపీకి అత్యంత కావ‌ల‌సిన మ‌నిషి. పైగా.. చంద్ర‌బాబుకు స‌న్నిహితుడ‌నే పేరు తెచ్చుకున్నారు. 2019లో వైసీపీ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. అనూ హ్యంగా వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఏడాది త‌ర్వాత‌.. ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారిపోయారు. కుమారుడిని వెంట‌బెట్టుకుని మ‌రీ వెళ్లి జ‌గ‌న్‌తో కండువాలు క‌ప్పించుకున్నారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. స్థానిక వైసీపీ నేత‌ల‌తో మాత్రం వివాదాలు పెట్టుకుంటున్నారు.

వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న `చెద‌పురుగులు` అంటూ బ‌హిరంగంగా ఇటీవ‌ల చేసిన కామెంట్‌.. తీవ్ర‌స్థాయిలో దుమారం రేపుతోంది. దీనిపై ఆగ్ర‌హించిన‌.. వైసీపీస్థానిక నేత‌లు.. అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు ఆయ‌న పార్టీలో ఉన్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. టీడీపీలోకి వెళ్లిపోయే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని.. అందుకే త‌మ‌ను తిట్టిపోస్తున్నార‌ని.. వారి వాద‌న‌. ఇప్ప‌టికే దీనిపై కీల‌క స‌ల‌హాదారుడికి ఫిర్యాదు చేశారు. మ‌రో వైపు.. వాసుప‌ల్లి కూడా వైసీపీనేత‌లు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

ఇటీవ‌ల‌.. సీఎం జ‌గ‌న్ చేదోడు ప‌థ‌కం కింద నిధులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డి నాయ‌కులు ఒక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి.. స్థానిక ఎమ్మెల్యేగా ఆయ‌న‌కు కూడా ఆహ్వానం పంపారు. అయితే.. ఆయ‌న మాత్రం హాజ‌రు కాలేదు. ఈ విష‌యాన్ని కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. దీంతో ఈ గ‌ట్టునుంటావా.. ఆ గ‌ట్టుకెళ్తావా?  అంటూ.. వైసీపీ నాయ‌కులు.. వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, ఈ విష‌యంలో గ‌ణేష్ రివ‌ర్స్‌గా ఆలోచిస్తున్నారు.

వైసీపీ నాయ‌కులు త‌న‌తో కావాల‌నే గొడ‌వ పెట్టుకుంటున్నార‌ని.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌న‌కు ఫాలోయింగ్ ఉంద‌ని.. అది చూసి ఓర్వ‌లేకే.. ఇప్పుడు త‌న‌కు పొగ‌పెడుతున్నార‌ని.. ఆయ‌న చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధాలు జ‌రుగుతున్నాయి. మ‌రి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on February 22, 2022 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘టైగర్ తమ్ముళ్ల’ ఆశలు మళ్లీ చిగురించాయి

లోకనాయకుడు కమల్ హాసన్ తమిళనాట రాజకీయాల్లో అడుగు పెట్టి ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ పార్టీ…

4 minutes ago

JD చక్రవర్తిని ఇలాగేనా వాడుకోవడం

శివలో సైడ్ విలన్ గా పరిచయమై తక్కువ టైంలో ఎక్కువ గుర్తింపు తెచ్చుకుని గులాబీ, సత్యతో సోలో హీరోగా మంచి…

11 minutes ago

విజ‌య్‌ను క‌ట్ట‌డి చేయ‌డ‌మే వాళ్ళ కొంప ముంచిందా?

త‌మిళ‌నాట జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ద‌ళ‌ప‌తి విజ‌య్ విజ‌య‌దుందుభి మోగించారు. ఏక‌ప‌క్షంగా 110 స్థానాల్లో ఆయ‌న విజ‌యం ద‌క్కించుకునే దిశ‌గా…

21 minutes ago

జాక్ పాట్ కొట్టిన జన నాయకుడు

నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…

48 minutes ago

రాకెట్ లా దూసుకుపోతున్న దళపతి పార్టీ

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…

1 hour ago

నిజమా… విజయ్ కోసమే త్రిష తిరుమలకు?

తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో…

1 hour ago