Political News

ఈ గ‌ట్టునుంటావా.. ఆ గ‌ట్టుకెళ్తావా..ఎమ్మెల్యేపై ఒత్తిడి..!


ఒక పార్టీ త‌ర‌ఫున గెలిచారు.. మ‌రో పార్టీకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. కుటుంబ‌స‌మేతంగా వెళ్లి సీఎం జ‌గ‌న్‌ను క‌లిశారు. పార్టీ కండువాను కూడా క‌ప్పుకొన్నారు. ఇంత వ‌రకు బాగానే ఉంది. కానీ, క్షేత్ర‌స్థాయిలో మాత్రం వైసీపీ నేత‌ల‌తో ఆయ‌న క‌ల‌వ‌లేక పోతున్నారు. అడుగడుగునా.. ఆధిప‌త్య ధోర‌ణిని ప్ర‌ద‌ర్శిస్తున్నారు. దీంతో వైసీపీ నేత‌ల‌కు ఆయ‌న‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో అస‌లు ఆయ‌న వైసీపీలోనే ఉంటారా?  లేక వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి.. మ‌ళ్లీ పాత‌గూటికి చేరుకుంటారా? అనే చ‌ర్చ జోరుగా సాగుతోంది. రాజకీయాల్లో శాశ్వ‌త శ‌త్రువులు, శాశ్వ‌త మిత్రులు ఎవ‌రూ ఉండ‌రు కాబ‌ట్టి.. ఏదైనా జ‌ర‌గొచ్చ‌ని అంటున్నారు.

ఇంత‌కీ.. ఆయ‌న ఎవ‌రంటే.. విశాఖ‌న‌గ‌రంలోని ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న వాసుప‌ల్లి గ‌ణేష్‌. ఈయ‌న టీడీపీకి అత్యంత కావ‌ల‌సిన మ‌నిషి. పైగా.. చంద్ర‌బాబుకు స‌న్నిహితుడ‌నే పేరు తెచ్చుకున్నారు. 2019లో వైసీపీ సునామీని త‌ట్టుకుని మ‌రీ విజ‌యం ద‌క్కించుకున్నారు. అయితే.. అనూ హ్యంగా వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన ఏడాది త‌ర్వాత‌.. ఆయ‌న వైసీపీకి మ‌ద్ద‌తుదారుగా మారిపోయారు. కుమారుడిని వెంట‌బెట్టుకుని మ‌రీ వెళ్లి జ‌గ‌న్‌తో కండువాలు క‌ప్పించుకున్నారు. ఇంతవ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. స్థానిక వైసీపీ నేత‌ల‌తో మాత్రం వివాదాలు పెట్టుకుంటున్నారు.

వైసీపీ నేత‌ల‌ను ఆయ‌న `చెద‌పురుగులు` అంటూ బ‌హిరంగంగా ఇటీవ‌ల చేసిన కామెంట్‌.. తీవ్ర‌స్థాయిలో దుమారం రేపుతోంది. దీనిపై ఆగ్ర‌హించిన‌.. వైసీపీస్థానిక నేత‌లు.. అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేశారు ఆయ‌న పార్టీలో ఉన్నా.. ప్ర‌యోజ‌నం లేద‌ని.. టీడీపీలోకి వెళ్లిపోయే ఆలోచ‌న‌లో ఉన్నార‌ని.. అందుకే త‌మ‌ను తిట్టిపోస్తున్నార‌ని.. వారి వాద‌న‌. ఇప్ప‌టికే దీనిపై కీల‌క స‌ల‌హాదారుడికి ఫిర్యాదు చేశారు. మ‌రో వైపు.. వాసుప‌ల్లి కూడా వైసీపీనేత‌లు నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాల‌కు దూరంగా ఉంటున్నారు.

ఇటీవ‌ల‌.. సీఎం జ‌గ‌న్ చేదోడు ప‌థ‌కం కింద నిధులు విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ఇక్క‌డి నాయ‌కులు ఒక కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసి.. స్థానిక ఎమ్మెల్యేగా ఆయ‌న‌కు కూడా ఆహ్వానం పంపారు. అయితే.. ఆయ‌న మాత్రం హాజ‌రు కాలేదు. ఈ విష‌యాన్ని కూడా సీరియ‌స్‌గానే తీసుకున్నారు. దీంతో ఈ గ‌ట్టునుంటావా.. ఆ గ‌ట్టుకెళ్తావా?  అంటూ.. వైసీపీ నాయ‌కులు.. వ్యాఖ్యానిస్తున్నారు. ఇక‌, ఈ విష‌యంలో గ‌ణేష్ రివ‌ర్స్‌గా ఆలోచిస్తున్నారు.

వైసీపీ నాయ‌కులు త‌న‌తో కావాల‌నే గొడ‌వ పెట్టుకుంటున్నార‌ని.. జ‌గ‌న్ ద‌గ్గ‌ర త‌న‌కు ఫాలోయింగ్ ఉంద‌ని.. అది చూసి ఓర్వ‌లేకే.. ఇప్పుడు త‌న‌కు పొగ‌పెడుతున్నార‌ని.. ఆయ‌న చెబుతున్నారు. దీంతో ఇప్పుడు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధాలు జ‌రుగుతున్నాయి. మ‌రి అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.

This post was last modified on February 22, 2022 4:03 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

3 hours ago

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

7 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

7 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

9 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

9 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

10 hours ago