ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి గుండెపోటుతో ఆకస్మికంగా మరణించడంతో ఆయన నిర్వహించిన పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖను ఎవరికిస్తారనే చర్చ రాజకీయవర్గాలలో మొదలైంది. విషాద సమయంలో ఈ చర్చ సరి కానప్పటికీ కీలక మంత్రిత్వ శాఖ కావడంతో వీలైనంత వేగం భర్తీ చేయడం తప్పనిసరి. అయితే, ఎలాగూ జగన్ మంత్రివర్గాన్ని మారుస్తారు కాబట్టి ఆ ప్రక్రియలో భాగంగానే ఇది భర్తీ చేస్తారని తెలుస్తోంది.
అయితే, గౌతమ్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన పదవిని ఎవరికి ఇస్తారనేది వైసీపీలోనూ చర్చనీయాంశంగానే ఉంది. ప్రధానంగా రెండు పేర్లు వినిపిస్తున్నాయి. నగరి ఎమ్మెల్యే రోజా, ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. గౌతమ్ రెడ్డి నిర్వహించిన శాఖలోని పరిశ్రమల శాఖను రోజాకు, ఐటీ శాఖను కేతిరెడ్డికి ఇస్తారనే ప్రచారం ఒకటి ఉంది.
అయితే, రోజాకు మంత్రి పదవి ఇవ్వడం అనేది అంత సులభంగా జరగకపోవచ్చనీ సమాచారం. చిత్తూరు జిల్లాలో మరో బలమైన నేతకు మంత్రి పదవి ఇవ్వడానికి అక్కడి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంగీకరించక పోవచ్చని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్ కనుక ఆయన్ను అనునయించగలిగితే రోజాకు మంత్రి పదవి దక్కే అవకాశం ఉంటుంది. లేదంటే, కేతిరెడ్డికే రెండు శాఖలూ దక్కే అవకాశాలున్నాయి.
మరోవైపు శాఖల కేటాయింపులో ఇంకోవాదనా వినిపిస్తోంది. కీలకమైన పరిశ్రమల శాఖ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికే దక్కొచ్చనేదీ వినిపిస్తోంది. ఆర్థిక మంత్రి బుగ్గన పేరు కూడా పరిశ్రమల శాఖ కోసం పరిశీలనలో ఉంది. అదే సమయంలో ఐటీ శాఖ కోసం కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరుతో పాటు విడదల రజినీ పేరు కూడా వినిపిస్తోంది. రజనీ ఎన్నారై రిటర్న్. ఆమె సాఫ్ట్ వేర్ రంగం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ఆమెకు మంత్రి పదవి ఇవ్వడానికి ఇదో అర్హతగా కనిపిస్తోంది. అయితే, ఊహాగానాలు ఎన్నున్నా సజ్జల సూచన, జగన్ నిర్ణయం మేరకే పదవి కేటాయిస్తారనేది వైసీపీ వర్గాలు చెబుతున్న మాట.
This post was last modified on February 22, 2022 10:18 am
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…