తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియపై తెలంగాణా పోలీసులు ఛార్జిషీటు వేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వందల కోట్ల రూపాయల విలువైన భూమి సొంతదారులను కిడ్నాప్ చేసేందుకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి తదితరులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన విషయం అప్పట్లో సంచలనమైంది. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులుగా వేషాలు వేసుకుని భూమి ఓనర్లు ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావు ఇంట్లోకి ప్రవేశించారు.
సోదరులు ముగ్గురిని కిడ్నాప్ చేశారు. అయితే వీళ్ళ వాలకంపై అనుమానం వచ్చిన సోదరులు వెంటనే పోలీసులు కంట్రోల్ రూం 100కి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు చేసేదేమీలేక సోదరులను అప్పా జంక్షన్ దగ్గర వదిలేసి పారిపోయారు. ఇదే విషయమై తర్వాత దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేసి కోర్టులో పెట్టి రిమాండ్ కు పంపారు.
ఆ తర్వాత చాలా రోజులు భర్త, తమ్ముడు పరారీలోనే ఉన్నారు. చివరకు ముందస్తు బెయిల్ తెచ్చుకుని కోర్టులో లొంగిపోయారు. ఆ కేసులోనే పోలీసులు తాజాగా అఖిల, భార్గవ్, జగద్విఖ్యాత్ తో పాటు మరో 34 మందిపైన చార్జిషీటు వేయటం ఇంట్రెస్టింగ్ గా మారింది. చార్జిషీటును పరిశీలించిన తర్వాత పోలీసులకు కోర్టు అవసరమైన అనుమతులు ఇస్తుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఒకసారి కోర్టు కనుక అనుమతిస్తే మళ్ళీ అఖిల అండ్ కో ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఖాయం.
ఈసారి భార్గవ్, జగద్విఖ్యాత్ తప్పించుకునే అవకాశాలు లేవు. మొత్తానికి కిడ్నాపులు, హత్య కుట్రలకు, దాడులకు, ఫోర్జరీ సంతకాలకు అఖిల ఫ్యామిలీ ఫుల్లు బిజీగా ఉంది. చాలా కాలం తర్వాత అఖిల తన నియోజకవర్గం ఆళ్ళగడ్డకు వెళ్ళి వైసీపీ ఎంఎల్ఏ అవినీతిపై చాలెంజ్ చేసి కాస్త హడావిడి చేశారు. అమావాస్యకో పౌర్ణమికో నియోజకవర్గంలో ప్రత్యక్షమవడం, మిగిలిన మద్దతుదారులతో సమావేశం పెట్టడం, ప్రత్యర్ధులకు వార్నింగులివ్వటంతోనే సరిపోతోంది అఖిలకు. దాడి కేసులో ఇప్పుడు కూడా ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలోనే ఉన్నాడు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి అఖిల పెద్ద తలనొప్పిగా మారింది అన్నది వాస్తవం
This post was last modified on February 21, 2022 7:20 pm
బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కి విపరీతమైన ఫ్రీ పబ్లిసిటీ జరుగుతుంది. అదేంటో ఆమె సినిమాల వల్ల వచ్చిన పాపులారిటీ…
ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి…
తెలుగు సినిమాలో పరిగెత్తడంలోనూ ప్రత్యేక స్టాండర్డ్ సెట్ చేసిన ఏకైక హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు. అతని రన్నింగ్…
విపరీతమైన ప్రి రిలీజ్ హైప్ వల్ల వసూళ్లు రూ.500 కోట్ల మార్కును దాటి ఉండొచ్చు. నిర్మాతకు లాభం అందించి ఉండచ్చు.…
వైసీపీ అధినేత జగన్ లో పెద్దగా మార్పు రాలేదా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. అధికారంలో ఉండగా వైసీపీ నాయకులు…
కోలీవుడ్ భామ ప్రియాంక మోహన్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ మేడిన్ కొరియా. ఆర్ కార్తీక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ…