Political News

భూమా అఖిలపై ఛార్జిషీటు

తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా పనిచేసిన భూమా అఖిలప్రియపై తెలంగాణా పోలీసులు ఛార్జిషీటు వేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వందల కోట్ల రూపాయల విలువైన భూమి సొంతదారులను కిడ్నాప్ చేసేందుకు భూమా అఖిలప్రియ, ఆమె భర్త భార్గవ్ రామ్, తమ్ముడు జగద్విఖ్యాత్ రెడ్డి తదితరులు కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన విషయం అప్పట్లో సంచలనమైంది. ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులుగా వేషాలు వేసుకుని భూమి ఓనర్లు ప్రవీణ్ రావు, నవీన్ రావు, సునీల్ రావు ఇంట్లోకి ప్రవేశించారు.

సోదరులు ముగ్గురిని కిడ్నాప్ చేశారు. అయితే వీళ్ళ వాలకంపై అనుమానం వచ్చిన సోదరులు వెంటనే పోలీసులు కంట్రోల్ రూం 100కి ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ విషయం తెలుసుకున్న కిడ్నాపర్లు చేసేదేమీలేక సోదరులను అప్పా జంక్షన్ దగ్గర వదిలేసి పారిపోయారు. ఇదే విషయమై తర్వాత దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు అఖిలప్రియను అరెస్టు చేసి కోర్టులో పెట్టి రిమాండ్ కు పంపారు.

ఆ తర్వాత చాలా రోజులు భర్త, తమ్ముడు పరారీలోనే ఉన్నారు. చివరకు ముందస్తు బెయిల్ తెచ్చుకుని కోర్టులో లొంగిపోయారు. ఆ కేసులోనే పోలీసులు తాజాగా అఖిల, భార్గవ్, జగద్విఖ్యాత్ తో పాటు మరో 34 మందిపైన చార్జిషీటు వేయటం ఇంట్రెస్టింగ్ గా మారింది. చార్జిషీటును పరిశీలించిన తర్వాత పోలీసులకు కోర్టు అవసరమైన అనుమతులు ఇస్తుందని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఒకసారి కోర్టు కనుక అనుమతిస్తే మళ్ళీ అఖిల అండ్ కో ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఖాయం.

ఈసారి భార్గవ్, జగద్విఖ్యాత్ తప్పించుకునే అవకాశాలు లేవు. మొత్తానికి కిడ్నాపులు, హత్య కుట్రలకు, దాడులకు, ఫోర్జరీ సంతకాలకు అఖిల ఫ్యామిలీ ఫుల్లు బిజీగా ఉంది. చాలా కాలం తర్వాత అఖిల తన నియోజకవర్గం ఆళ్ళగడ్డకు వెళ్ళి వైసీపీ ఎంఎల్ఏ అవినీతిపై చాలెంజ్ చేసి కాస్త హడావిడి చేశారు. అమావాస్యకో పౌర్ణమికో నియోజకవర్గంలో ప్రత్యక్షమవడం, మిగిలిన మద్దతుదారులతో సమావేశం పెట్టడం, ప్రత్యర్ధులకు వార్నింగులివ్వటంతోనే సరిపోతోంది అఖిలకు. దాడి కేసులో ఇప్పుడు కూడా ఆమె భర్త భార్గవ్ రామ్ పరారీలోనే ఉన్నాడు. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి అఖిల పెద్ద తలనొప్పిగా మారింది అన్నది వాస్తవం

This post was last modified on February 21, 2022 7:20 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

12 minutes ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

51 minutes ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

2 hours ago

ప‌రిష్కారం దొరికేసిన‌ట్టేనా.. `బీసీ బాబు`..

ఏపీ సీఎం చంద్ర‌బాబు... `బీసీ బాబు`గా మార‌నున్నారా? సుదీర్ఘ కాలంగా పెండింగులో ఉన్న స‌మ‌స్య‌ను పరిష్క‌రించేందుకు న‌డుంబిగించారా? అంటే.. ఔన‌నే…

5 hours ago

మాట జారొద్దు: జ‌న‌సేనలో కీల‌క చ‌ర్చ.. !

జ‌న‌సేన పార్టీ నాయ‌కుల‌కు ఆ పార్టీ సీనియ‌ర్ నేత‌, మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. కీల‌క విష‌యాన్ని తేల్చి చెప్పారు. నేరుగా…

5 hours ago

ఎన్నిక‌ల ఎఫెక్ట్‌: కేర‌ళ‌.. ఇక‌పై కేర‌ళం!

త్వ‌ర‌లోనే అసెంబ్లీ ఎన్నికలు జ‌ర‌గ‌నున్న రాష్ట్రాల విష‌యంలో కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు కీల‌క క‌స‌ర‌త్తు చేస్తోంది. ఆయా రాష్ట్రాల…

11 hours ago