ఏపీకి చెందిన పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి హఠాత్తుగా కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుకు గురైన ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందించారు. అయితే.. అప్పటికే ఆయన పల్స్ పూర్తిగా పడిపోవడం.. హృదయ స్పందనలు కూడా తగ్గిపోవడంతో తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు. గౌతం రెడ్డి వయసు 49 సంవత్సరాలు. ఈయన తెలంగాణకు చెందిన మంత్రి కేటీఆర్కు సమకాలికులు. ఇరువురు కూడా ఒకే స్కూల్, కాలేజీలో విద్యను అభ్యసించారు. ఇప్పటికీ .. మిత్రులుగా కొనసాగుతున్నారు.
అయితే.. గౌతంరెడ్డి .. గత వారం రోజులుగా దుబాయ్లో ఉన్నారు. అక్కడ జరిగిన పెట్టుబడుల సదస్సు లో మేకపాటి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే ఒకటి రెండు రోజులు నలతగా ఉందని.. రెస్ట్ తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి. ఆదివారం ఉదయం పర్యటనను ముగించుకుని వచ్చిన మంత్రి మేకపాటి మంగళవారం.. తాడేపల్లిలో ముఖ్యమంత్రి సీఎం జగన్ను కలిసి.. పర్యటన వివరాలను వెల్లడించాల్సి ఉంది. అదే విధంగా పెట్టుబడుల సదస్సుకు సంబంధించి.. మంత్రివర్గ బృందానికి కూడా ఆయన వివరించాల్సి ఉంది. అయితే..అనూహ్యంగా ఆయన గుండెపోటుకు గురికావడం.. తుదిశ్వాస విడవడం.. కుటుంబాన్ని తీవ్రంగా కలిచివేస్తోంది.
మాజీ ఎంపీ..నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్రెడ్డి కుమారుడైన గౌతంరెడ్డి.. ఉన్నత విద్యావంతుడు. అంతేకాదు. వివాద రహితుడిగా రాజకీయాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా అంటేనే రెడ్డి డామినేషన్ రాజకీయాలు కనిపిస్తాయి. కానీ, మంత్రి మేకపాటి మాత్రం ఈ డామినేషన్ రాజకీయాలకు దూరంగా ఉన్నారు. గతంలో తన తండ్రి రాజమోహన్ రెడ్డి మాదిరిగానే గౌతం రెడ్డి కూడా.. అందరినీ కలుపుకొని పోవడం.. రాష్ట్ర రాజకీయాలకు ఉపయోపడే నిర్ణయాలు తీసుకోవడం ద్వారా.. ప్రజలకు చేరువ అయ్యారు.
This post was last modified on February 21, 2022 9:56 am
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రకటనలు చేస్తానంటే ఆయనకు భారీ పారితోషకం ఇవ్వడానికి బోలెడన్ని కంపెనీలు ముందుకు వస్తాయి. కానీ…
గత ఏడాది నాని నిర్మించిన కోర్టుతో పరిచయమైన హీరోయిన్ శ్రీదేవి అప్పల అందులో టీనేజ్ కొచ్చిన కాలేజీ అమ్మాయిగా నటనతో…
టీ20 వరల్డ్ కప్ గ్రూప్ స్టేజ్ లో వరుస విజయాలతో దూసుకువచ్చిన టీమిండియాకు సూపర్ 8 ఆరంభంలోనే ఊహించని ఎదురుదెబ్బ…