Political News

ఏపీ మంత్రి గౌతంరెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం

ఏపీకి చెందిన ప‌రిశ్ర‌మ‌లు, ఐటీ శాఖ మంత్రి మేక‌పాటి గౌతం రెడ్డి హ‌ఠాత్తుగా క‌న్నుమూశారు. సోమ‌వారం ఉద‌యం గుండెపోటుకు గురైన ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించి.. చికిత్స అందించారు. అయితే.. అప్ప‌టికే ఆయ‌న ప‌ల్స్ పూర్తిగా పడిపోవ‌డం.. హృద‌య స్పంద‌న‌లు కూడా త‌గ్గిపోవడంతో తుదిశ్వాస విడిచిన‌ట్టు వైద్యులు తెలిపారు. గౌతం రెడ్డి వ‌య‌సు 49 సంవ‌త్స‌రాలు. ఈయ‌న తెలంగాణ‌కు చెందిన మంత్రి కేటీఆర్‌కు స‌మ‌కాలికులు. ఇరువురు కూడా ఒకే స్కూల్‌, కాలేజీలో విద్య‌ను అభ్యసించారు. ఇప్ప‌టికీ .. మిత్రులుగా కొన‌సాగుతున్నారు.

అయితే.. గౌతంరెడ్డి .. గ‌త వారం రోజులుగా దుబాయ్‌లో ఉన్నారు. అక్క‌డ జ‌రిగిన పెట్టుబ‌డుల స‌ద‌స్సు లో మేక‌పాటి పాల్గొన్నారు. ఈ క్ర‌మంలోనే ఒక‌టి రెండు రోజులు న‌ల‌త‌గా ఉంద‌ని.. రెస్ట్ తీసుకున్నట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఆదివారం ఉద‌యం ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని వ‌చ్చిన మంత్రి మేక‌పాటి మంగ‌ళ‌వారం.. తాడేప‌ల్లిలో ముఖ్య‌మంత్రి సీఎం జ‌గ‌న్‌ను క‌లిసి.. ప‌ర్య‌ట‌న వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సి ఉంది. అదే విధంగా పెట్టుబ‌డుల స‌ద‌స్సుకు సంబంధించి.. మంత్రివ‌ర్గ బృందానికి కూడా ఆయ‌న వివ‌రించాల్సి ఉంది. అయితే..అనూహ్యంగా ఆయ‌న గుండెపోటుకు గురికావ‌డం.. తుదిశ్వాస విడ‌వ‌డం.. కుటుంబాన్ని తీవ్రంగా క‌లిచివేస్తోంది.

మాజీ ఎంపీ..నెల్లూరు జిల్లాకు చెందిన మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి కుమారుడైన గౌతంరెడ్డి.. ఉన్న‌త విద్యావంతుడు. అంతేకాదు. వివాద ర‌హితుడిగా రాజ‌కీయాలు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా అంటేనే రెడ్డి డామినేష‌న్ రాజ‌కీయాలు క‌నిపిస్తాయి. కానీ, మంత్రి మేక‌పాటి మాత్రం ఈ డామినేష‌న్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. గ‌తంలో త‌న తండ్రి రాజ‌మోహ‌న్ రెడ్డి మాదిరిగానే గౌతం రెడ్డి కూడా.. అంద‌రినీ క‌లుపుకొని పోవ‌డం.. రాష్ట్ర రాజ‌కీయాల‌కు ఉప‌యోప‌డే నిర్ణ‌యాలు తీసుకోవ‌డం ద్వారా.. ప్ర‌జ‌ల‌కు చేరువ అయ్యారు.

This post was last modified on February 21, 2022 9:56 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘వైసీపీ చేసిన పాపాలను కడుగుతున్నాం’

రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…

3 hours ago

ఎలుకల మందు ఆర్డర్.. డెలివరీ బాయ్ ఏం చేశాడు?

సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…

4 hours ago

అమరావతిలో జ్ఞాన బుద్ధకు మళ్లీ ప్రాణం

ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…

4 hours ago

పరాశక్తి పండగ చేసుకుంటుంది కానీ

సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…

4 hours ago

చంద్రబాబు – పవన్‌లకు పని తగ్గిస్తున్న జగన్..!

వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…

7 hours ago

ఇంగిత జ్ఞానం లేని వ్యక్తి.. జ‌గ‌న్‌ పై బాబు సీరియ‌స్

వైసీపీ అధినేత జ‌గ‌న్‌పై సీఎం చంద్ర‌బాబు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. వైసీపీ పాల‌న‌తో రాష్ట్రం పూర్తిగా విధ్వంస‌మైందని అన్నారు.…

9 hours ago