Political News

కేసీఆర్ థ‌ర్డ్ ఫ్రంట్‌… అలాంటి చ‌ర్చే జ‌ర‌గ‌లేద‌న్న ప‌వార్‌

బీజేపీ, కాంగ్రెస్ పార్టీల‌కు ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ‌ వేదిక నిర్మించేందుకు కొత్త ఎత్తుగ‌డ‌ను మొద‌లుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మేర‌కు మ‌హారాష్ట్ర టూర్ కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. శివ‌సేన ర‌థ‌సార‌థి, మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే, ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్‌తో స‌మావేశం ఎజెండాగా ఆయ‌న మ‌హారాష్ట్ర టూర్ సాగింది. ఈ ఇద్ద‌రు నేత‌ల‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ విజ‌యవంతంగానే జ‌రిగింది. అయితే, ఎన్‌సీపీ ఛీఫ్ శ‌ర‌ద్ ప‌వార్ మాత్రం కేసీఆర్ కల‌లు క‌ల్ల‌లు చేసే విధంగా మాట్లాడ‌ర‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో స‌మావేశం అనంత‌రం ఎన్సీపీ చీఫ్ శ‌ర‌ద్ ప‌వార్‌తో ఆయ‌న నివాసంలో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారు కొద్దిసేపు ముచ్చ‌టించారు. సీఎం కేసీఆర్‌తో భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడిన శ‌ర‌ద్ ప‌వార్ ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  

సంక్షేమ ప‌థ‌కాల‌లో తెలంగాణ దేశానికే ఆద‌ర్శంగా నిలిచింద‌న్నారు. “దేశంలో ఉన్న పేద‌రికం కావ‌చ్చు.. రైతుల స‌మ‌స్య‌లు కావ‌చ్చు.. ప్ర‌స్తుతం దేశం ఎదుర్కొంటున్న అన్ని స‌మ‌స్య‌ల గురించి మేము చ‌ర్చించాం. రాజ‌కీయంగా పెద్ద‌గా ఏం చ‌ర్చించ‌లేదు. ఎక్కువగా దేశ అభివృద్ధి గురించే మాట్లాడాం. భ‌విష్య‌త్తులోనూ కేసీఆర్‌ను క‌లుస్తాం. ఇంకా చాలా విష‌యాలు చ‌ర్చిస్తాం“ అని శ‌ర‌ద్ ప‌వార్ స్ప‌ష్టం చేశారు.

దేశం కోసం కేంద్ర‌ ప్ర‌భుత్వంతో పోరాడేందుకు ప్రాంతీయ పార్టీల‌తో వేదిక ఏర్పాటు చేసేందుకు శ‌ర‌ద్ ప‌వార్‌తో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ భేటీ కాగా, ఎన్సీపీ ర‌థ‌సార‌థి మాత్రం రాజ‌కీయాలు చ‌ర్చించ‌నే లేదని, వివిధ అంశాల‌ను చ‌ర్చించామ‌ని తెలియ‌జేయ‌డంతో కేసీఆర్ అనుకున్న‌ది ఒక‌టి…. అక్క‌డ జ‌రిగింది ఒక‌టి అని చ‌ర్చించుకుంటున్నారు. మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రేతో స‌మావేశంలో సానుకూల స్పంద‌న పొందిన కేసీఆర్.. ఎన్సీపీ ర‌థ‌సార‌థి ప‌వార్ తో మాత్రం అలాంటి స్పంద‌న పొంద‌లేక‌పోయార‌ని చెప్తున్నారు.

Satya

Recent Posts

త్రినేత్రుడి కన్నెర్రకు ప్రతిరూపం ‘నాగబంధం’

విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…

1 hour ago

బాలయ్యతో కాజల్… గ్లామర్ కు దూరంగా పవర్ఫుల్ రోల్

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…

3 hours ago

ఈ సమయంలో మౌనమేల షర్మిల గారు?

విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…

3 hours ago

సాయికృష్ణ కుటుంబానికి చంద్రబాబు భరోసా

విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…

4 hours ago

జాన్వీ కపూర్ దురదృష్టం అలా ఉంది

పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…

4 hours ago

కృష్ణలంక వివాదాన్ని బాబు ఎలా హ్యాండిల్ చేశారు?

రాజ‌కీయ చతుర‌త‌లో మ‌రోసారి టీడీపీ అధినేత‌, సీఎం చంద్ర‌బాబు చాణ‌క్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. స‌ర్కారును ఇరుకున పెట్టేసి.. కుల‌,…

5 hours ago