బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక నిర్మించేందుకు కొత్త ఎత్తుగడను మొదలుపెట్టిన సీఎం కేసీఆర్ ఈ మేరకు మహారాష్ట్ర టూర్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. శివసేన రథసారథి, మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో సమావేశం ఎజెండాగా ఆయన మహారాష్ట్ర టూర్ సాగింది. ఈ ఇద్దరు నేతలతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ విజయవంతంగానే జరిగింది. అయితే, ఎన్సీపీ ఛీఫ్ శరద్ పవార్ మాత్రం కేసీఆర్ కలలు కల్లలు చేసే విధంగా మాట్లాడరని చర్చ జరుగుతోంది.
మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశం అనంతరం ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో ఆయన నివాసంలో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు కొద్దిసేపు ముచ్చటించారు. సీఎం కేసీఆర్తో భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన శరద్ పవార్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
సంక్షేమ పథకాలలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. “దేశంలో ఉన్న పేదరికం కావచ్చు.. రైతుల సమస్యలు కావచ్చు.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న అన్ని సమస్యల గురించి మేము చర్చించాం. రాజకీయంగా పెద్దగా ఏం చర్చించలేదు. ఎక్కువగా దేశ అభివృద్ధి గురించే మాట్లాడాం. భవిష్యత్తులోనూ కేసీఆర్ను కలుస్తాం. ఇంకా చాలా విషయాలు చర్చిస్తాం“ అని శరద్ పవార్ స్పష్టం చేశారు.
దేశం కోసం కేంద్ర ప్రభుత్వంతో పోరాడేందుకు ప్రాంతీయ పార్టీలతో వేదిక ఏర్పాటు చేసేందుకు శరద్ పవార్తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ కాగా, ఎన్సీపీ రథసారథి మాత్రం రాజకీయాలు చర్చించనే లేదని, వివిధ అంశాలను చర్చించామని తెలియజేయడంతో కేసీఆర్ అనుకున్నది ఒకటి…. అక్కడ జరిగింది ఒకటి అని చర్చించుకుంటున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రేతో సమావేశంలో సానుకూల స్పందన పొందిన కేసీఆర్.. ఎన్సీపీ రథసారథి పవార్ తో మాత్రం అలాంటి స్పందన పొందలేకపోయారని చెప్తున్నారు.
This post was last modified on February 21, 2022 6:53 am
టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేవి మైండ్ గేమ్స్, సస్పెన్స్ త్రిల్లర్స్. 'క్షణం',…
రాజకీయం రాజకీయమే. రాజకీయమనే తానులో ఉండే ఏ పార్టీ అయినా తీరు ఒక్కటే అన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది.…
బాలకృష్ణ ఖాకీ డ్రెస్సు వేస్తే బ్లాక్ బస్టర్ ఖాయమనేది అభిమానుల నమ్మకం. దానికి పునాది వేసింది రౌడీ ఇన్స్పెక్టర్. 1992లో…
అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును బుధవారం లోక్సభ ఆమోదించిన దరిమిలా.. రాజ్యసభలో గురువారం ప్రవేశ పెట్టారు. కేంద్ర హోం శాఖ…
తెలుగు రాష్ట్రాల్లో చాలా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. ఆల్రెడీ అధిక శాతం మూతబడిపోయి ఫంక్షన్ హాళ్లు, షాపింగ్ మాల్స్…
రామాయణ పార్ట్ 1 టీజర్ వచ్చాక సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. ముంబైలో దీని స్పెషల్ ప్రీమియర్ చూసిన…