జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ మేరకు తనదైన శైలిలో ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన శివసేన రథసారథి, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. ఠాక్రే అధికార నివాసమైన ‘వర్ష’కు ముఖ్యమంత్రి కేసీఆర్ తన బృందంతో ఆదివారం మధ్యాహ్నం చేరుకున్నారు. లంచ్ అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సినీ నటుడు ప్రకాశ్ రాజ్ కూడా హాజరవడం కొత్త చర్చకు తెరలేపింది.
ఈ సందర్భంగా భవిష్యత్ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయాలతో పాటు కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చిస్తున్నారు. ఈ సమావేవం ముగిసిన అనంతరం అనంతరం ఎన్సీపీ అధినేత శరద్ పవార్ను కేసీఆర్ కలవనున్నారు. మహారాష్ట్ర పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి వెంట ఎంపీలు సంతోష్ కుమార్, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు కవిత, పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉన్నారు. అయితే, ఈ పర్యటనలో ప్రకాశ్ రాజ్ ఉండటం చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి ముంబైకి బయల్దేరిన సమయంలో ప్రకాశ్ రాజ్ ఆయన వెంట లేరు. ముంబై విమానశ్రయంలో ప్రకాశ్ రాజ్ కేసీఆర్ కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనవెంట వచ్చిన వారిని కేసీఆర్ ఆయనకు పరిచయం చేశారు.
గతంలో మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత దేవేగౌడను కలిసేందుకు కర్ణాటక వెళ్లే సమయంలో కూడా ప్రకాశ్ రాజ్ను కేసీఆర్ వెంటతీసుకువెళ్లారు. అయితే, ప్రకాశ్ రాజ్కు కర్ణాటకలో పరిచయాలు ఉండటం వల్ల వెంటబెట్టుకు వెళ్లారని భావించారు. మరి ముంబై టూర్కు తీసుకువెళ్లడం ఏంటనే చర్చ జరుగుతోంది. ప్రకాశ్రాజ్కు ఉన్న సినీ గ్లామర్ను ఉపయోగించుకునేందుకు ఠాక్రే మీటింగ్కు ఆహ్వానించారని పలువురు విశ్లేషిస్తున్నారు. అయితే, ప్రకాశ్ రాజ్ లేకుండా కేసీఆర్ జాతీయ రాజకీయాలు చేయలేరా అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on February 20, 2022 7:02 pm
దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…
నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…
ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…
ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయనపై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విపక్షాలు ఇచ్చిన…