కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం కేసీయార్ ముంబాయ్ లో బిజీ బిజీగా ఉండబోతున్నారు. ఆదివారం ఉదయానికి కేసీయార్ ముంబాయ్ చేరుకుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే ఆహ్వానం మేరకు కేసీయార్ ముంబాయ్ వెళుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి అని చెబుతున్నప్పటికి ఇది పక్కాగా నరేంద్రమోడి వ్యతిరేక కూటమనే అనుకోవాలి. ఎందుకంటే మోడి బాడీలాంగ్వేజ్ తోనే చాలామంది విభేదిస్తున్నారు.
మధ్యాహ్నం థాక్రే ఇంట్లో లంచ్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతంది. ఎన్డీయేయేతర, యూపీయేయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవటమే ప్రధాన అజెండాగా వీళ్ళ సమావేశం ఉండబోతోంది. పనిలోపనిగా గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని అనుకుంటున్న వార్ధా ప్రాజెక్టుపైన కూడా చర్చ జరుగుతుంది. దాదాపు రెండున్నర గంటపాటు వీళ్ళ భేటీ జరిగే అవకాశముందని సమాచారం.
తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కేసీయార్ కలవబోతున్నారు. వీళ్ళమధ్య కూడా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపైనే చర్చలు జరుగుతాయి. ఒకవైపు బీజేపీని మరోవైపు కాంగ్రెస్ ను కేసీయార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే మహారాష్ట్రలో ఉన్నది శివశేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం. పై మూడు పార్టీల్లో కాంగ్రెస్, ఎన్సీపీల్లో ఏది పక్కకుపోయినా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం.
ఇలాంటి పరిస్ధితుల్లో తనతో థాక్రే చేతులు కలుపుతారని కేసీయార్ ఎలా అనుకున్నారో. పైగా ఎన్సీపీ శరద్ పవార్ కూడా కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని గతంలోనే చెప్పున్నారు. అలాంటపుడు కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో అనుమానంగానే ఉంది. కేసీయార్ లాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసేందుకు అవకాశముంది. మమత తప్ప కేసీయార్ తో చేతులు కలపటానికి ఇంకెవరు సిద్ధంగా లేరనే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాల్సిందే.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…