కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం కేసీయార్ ముంబాయ్ లో బిజీ బిజీగా ఉండబోతున్నారు. ఆదివారం ఉదయానికి కేసీయార్ ముంబాయ్ చేరుకుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే ఆహ్వానం మేరకు కేసీయార్ ముంబాయ్ వెళుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి అని చెబుతున్నప్పటికి ఇది పక్కాగా నరేంద్రమోడి వ్యతిరేక కూటమనే అనుకోవాలి. ఎందుకంటే మోడి బాడీలాంగ్వేజ్ తోనే చాలామంది విభేదిస్తున్నారు.
మధ్యాహ్నం థాక్రే ఇంట్లో లంచ్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతంది. ఎన్డీయేయేతర, యూపీయేయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవటమే ప్రధాన అజెండాగా వీళ్ళ సమావేశం ఉండబోతోంది. పనిలోపనిగా గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని అనుకుంటున్న వార్ధా ప్రాజెక్టుపైన కూడా చర్చ జరుగుతుంది. దాదాపు రెండున్నర గంటపాటు వీళ్ళ భేటీ జరిగే అవకాశముందని సమాచారం.
తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కేసీయార్ కలవబోతున్నారు. వీళ్ళమధ్య కూడా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపైనే చర్చలు జరుగుతాయి. ఒకవైపు బీజేపీని మరోవైపు కాంగ్రెస్ ను కేసీయార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే మహారాష్ట్రలో ఉన్నది శివశేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం. పై మూడు పార్టీల్లో కాంగ్రెస్, ఎన్సీపీల్లో ఏది పక్కకుపోయినా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం.
ఇలాంటి పరిస్ధితుల్లో తనతో థాక్రే చేతులు కలుపుతారని కేసీయార్ ఎలా అనుకున్నారో. పైగా ఎన్సీపీ శరద్ పవార్ కూడా కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని గతంలోనే చెప్పున్నారు. అలాంటపుడు కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో అనుమానంగానే ఉంది. కేసీయార్ లాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసేందుకు అవకాశముంది. మమత తప్ప కేసీయార్ తో చేతులు కలపటానికి ఇంకెవరు సిద్ధంగా లేరనే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాల్సిందే.
This post was last modified on February 20, 2022 6:50 pm
తమిళంలో పెద్ద స్టార్గా ఎదిగిన శివ కార్తికేయన్ లాగే టీవీ రంగం నుంచి ఇండస్ట్రీలోకి వచ్చిన అమ్మాయి ప్రియ భవానీ…
తెలుగులో తెర మీద హీరోలకు ఎలివేషన్లు ఇవ్వడంలో చాలామంది దర్శకులు తమ నైపుణ్యాన్ని చూపిస్తుంటారు కానీ.. వేదికల మీద ఎలివేషన్లు…
ఒకప్పుడు తమిళ ప్రేక్షకుల అభిరుచి గురించి ఇతర భాషల వాళ్లు గొప్పగా చెప్పుకునేవాళ్లు. కొత్త తరహా సినిమాలను, ప్రయోగాత్మక చిత్రాలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం రెడీ అవుతోంది. ప్రభుత్వం వైపు నుంచి ఈ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది.…
వైసీపీ ఓటు బ్యాంకు స్థిరమేనా? ఆ పార్టీ చెబుతున్నట్టు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చే ఎన్నికల వరకు అలానే…
జూన్ నుంచి టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడుతోంది. ఎలాంటి టికెట్ రేట్ల పెంపు పంచాయితీ లేకుండా ఉన్న ధరలతోనే ప్రతి ఒక్కరు…