వృద్ధిమాన్ సాహా.. ఎన్నో ఏళ్లుగా భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వికెట్ కీపర్ బ్యాట్స్మన్. ప్రపంచంలోనే అత్యుత్తమ వికెట్ కీపర్లలో ఒకడిగా అభివర్ణిస్తారు విశ్లేషకులు. ఐతే ధోని లాంటి మేటి ఆటగాడు మూడు ఫార్మాట్లలో దశాబ్దంన్నర పాటు జట్టులో పాతుకుపోవడంతో అతడికి ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ధోని అందుబాటులో లేనపుడు మాత్రమే అతడికి అవకాశాలు దక్కేవి.
ధోని టెస్టుల నుంచి రిటైరయ్యాక రెగ్యులర్ వికెట్ కీపర్గా జట్టులో ఉంటూ వచ్చాడు కానీ.. అతడికి యువ ఆటగాడు రిషబ్ పంత్ గండి కొట్టాడు. వేగంగా భారత జట్టులోకి దూసుకొచ్చిన అతను.. సాహా స్థానాన్ని ప్రశ్నార్థకంగా మార్చాడు. ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో సంచలన ఇన్నింగ్స్లు ఆడి.. సాహాకు తుది జట్టులో చోటు లేకుండా చేశాడు. వయసు మీద పడటం, ఫామ్ లేమి, ఫిట్నెస్ సమస్యలు సాహాకు ప్రతికూలంగా మారి.. చోటు గల్లంతైంది. ఇన్నాళ్లూ జట్టులోకి ఎంపిక చేసి తుది జట్టుకు మాత్రమే దూరం పెట్టేవారు.
కానీ ఇప్పుడు పూర్తిగా జట్టు నుంచే తప్పించేశారు.ఐతే ఎంత మేటి ఆటగాళ్లకైనా ఇలాంటి పరిస్థితి ఎదురవడం సహజం. కానీ 37 ఏళ్ల సాహా మాత్రం సెలక్టర్ల నిర్ణయాన్ని జీర్ణించుకోలేక మీడియా ముందుకొచ్చేశాడు. ఈ సిరీస్ కంటే ముందే తనకు టీమ్ మేనేజ్మెంట్ తనతో మాట్లాడిందని.. ఇక తనను జట్టు ఎంపికకు పరిగణనలోకి తీసుకోబోమని స్పష్టం చేసిందని సాహా వ్యాఖ్యానించాడు. అంతే కాక కోచ్ రాహుల్ ద్రవిడ్ తనతో మాట్లాడుతూ రిటైర్మెంట్ గురించి ఆలోచించాలని చెప్పినట్లు వెల్లడించాడు. గత ఏడాది చివర్లో న్యూజిలాండ్తో టెస్టు మ్యాచ్లో తాను పెయిన్ కిల్లర్స్ వేసుకుని మరీ అర్ధసెంచరీ సాధించానని.. అప్పుడు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీనే తనకు వాట్సాప్ ద్వారా విషెస్ చెప్పి తాను బీసీసీఐ అధ్యక్షుడిగా ఉన్నంత వరకు ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటానని చెప్పాడని.. కానీ కొన్ని నెలల్లోనే ఇంత వేగంగా పరిస్థితులు ఎలా మారిపోయాయో తనకు తెలియట్లేదని వ్యాఖ్యానించాడు.
ఈ వ్యాఖ్యలు భారత క్రికెట్లో చర్చనీయాంశంగా మారాయి. ఇదిలా ఉండగా.. చోటు పోయిన ఫ్రస్టేషన్లో ఉన్న సాహాను వాడుకుని టీఆర్పీలు పెంచుకోవడానికి కొన్ని ఛానెళ్లు గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక ప్రముఖ జర్నలిస్టు సాహాతో చేసిన మెసేజ్ చాట్ బయటికి వచ్చింది. తనకు ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరి.. అందుకు ఒప్పుకోనందుకు సదరు జర్నలిస్టు తనను ఎలా బెదిరించాడో సాహా స్క్రీన్ షాట్ పెట్టి అందరికీ చూపించాడు. మొత్తానికి సాహా వ్యవహారం భారత క్రికెట్లో చిన్నపాటి దుమారాన్ని రేపేలా కనిపిస్తోంది.
This post was last modified on February 20, 2022 6:54 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…