Political News

కేసీయార్ తో థాక్రే చేతులు కలుపుతారా ?

కేంద్రంలోని బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు కోసం కేసీయార్ ముంబాయ్ లో బిజీ బిజీగా ఉండబోతున్నారు. ఆదివారం ఉదయానికి కేసీయార్ ముంబాయ్ చేరుకుంటారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్థవ్ థాక్రే ఆహ్వానం మేరకు కేసీయార్ ముంబాయ్ వెళుతున్నారు. బీజేపీ వ్యతిరేక కూటమి అని చెబుతున్నప్పటికి ఇది పక్కాగా నరేంద్రమోడి వ్యతిరేక కూటమనే అనుకోవాలి. ఎందుకంటే మోడి బాడీలాంగ్వేజ్ తోనే చాలామంది విభేదిస్తున్నారు.

మధ్యాహ్నం థాక్రే ఇంట్లో లంచ్ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్ లో జాతీయ రాజకీయాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతంది. ఎన్డీయేయేతర, యూపీయేయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవటమే ప్రధాన అజెండాగా వీళ్ళ సమావేశం ఉండబోతోంది. పనిలోపనిగా గోదావరి నదిపై మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలని అనుకుంటున్న వార్ధా ప్రాజెక్టుపైన కూడా చర్చ జరుగుతుంది. దాదాపు రెండున్నర గంటపాటు వీళ్ళ భేటీ జరిగే అవకాశముందని సమాచారం.

తర్వాత సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కూడా కేసీయార్ కలవబోతున్నారు. వీళ్ళమధ్య కూడా బీజేపీకి ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటుపైనే చర్చలు జరుగుతాయి.  ఒకవైపు బీజేపీని మరోవైపు కాంగ్రెస్ ను కేసీయార్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకనే వివిధ పార్టీల అధినేతలను కలుస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిందేమంటే మహారాష్ట్రలో ఉన్నది శివశేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వం. పై మూడు పార్టీల్లో కాంగ్రెస్, ఎన్సీపీల్లో ఏది పక్కకుపోయినా సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవటం ఖాయం.

ఇలాంటి పరిస్ధితుల్లో  తనతో థాక్రే చేతులు కలుపుతారని కేసీయార్  ఎలా అనుకున్నారో. పైగా ఎన్సీపీ శరద్ పవార్ కూడా కాంగ్రెస్ లేకుండా ప్రత్యామ్నాయ ఫ్రంట్ ఏర్పాటు సాధ్యం కాదని గతంలోనే చెప్పున్నారు. అలాంటపుడు కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో అనుమానంగానే ఉంది. కేసీయార్ లాగే పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసేందుకు అవకాశముంది. మమత తప్ప కేసీయార్ తో చేతులు కలపటానికి ఇంకెవరు సిద్ధంగా లేరనే అనిపిస్తోంది. ఈ నేపధ్యంలో కేసీయార్ ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో చూడాల్సిందే.

This post was last modified on February 20, 2022 10:46 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

‘కొండా’నే వణికిస్తున్న నంబర్ 5 !

చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…

5 hours ago

రోజాకు రంగు ప‌డుతోంది..

ద‌ర్శ‌కుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో న‌టించిన రోజా.. రంగుప‌డుద్ది అనే డైలాగుతో అల‌రించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…

6 hours ago

కేసీఆర్ ఆ పని ఎందుకు చేయట్లేదంటే…

జాతీయ రాజ‌కీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని ఆశ‌ప‌డ్డ బీఆర్ఎస్ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌తంలో ఏ చిన్న అవ‌కాశం దొరికినా…

9 hours ago

‘పార’పట్టిన పద్మశ్రీ !

తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…

9 hours ago

సమీక్ష – ప్రసన్నవదనం

ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…

10 hours ago

నోట్ల కట్టలను వదలని శేఖర్ కమ్ముల

దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…

10 hours ago