Political News

కాపుల‌ను దువ్వుతున్న బీజేపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కాపు సామాజిక‌వ‌ర్గానికి కీల‌క పాత్ర అన‌డంలో సందేహం లేదు. అధికారంలోకి వ‌చ్చే పార్టీని నిర్ణ‌యించే సామ‌ర్థ్యం ఆ సామాజిక వ‌ర్గానికి ఉంది. అందుకే పార్టీల‌న్నీ వాళ్ల ఓట్ల కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తాయి. ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా గుర్తించిన బీజేపీ.. ఇప్పుడా రాష్ట్రంలో కాపుల‌ను దువ్వే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ప్ర‌భావం చూపేందుకు అతి పెద్ద‌దైన కాపు సామాజిక వ‌ర్గాన్ని మ‌చ్చిక చేసుకునేందుకు ఆ వ‌ర్గం స‌మ‌స్య‌ల‌పై బీజేపీ గ‌ళం విప్పుతోంది.

ఇప్పుడు ఏపీలో బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇవి రెండు క‌లిసి పోటీ చేసే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ మాత్రం మొద‌టి నుంచి త‌న మీద కాపు సామాజిక‌వ‌ర్గం ముద్ర ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇటీవ‌ల ఆయ‌న నోటి నుంచి కాపు మాట వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఏం మాట్లాడ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కాపు స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి బీజేపీ ముందుకు వ‌చ్చింది.  

కాపుల‌కు విద్య, ఉద్యోగ రంగాల్లో అయిదు శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌నే డిమాండ్‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. గ‌త ప్ర‌భుత్వం కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో అయిదు శాతాన్ని కాపుల‌కు కేటాయించింద‌ని.. మార్చి 15లోగా ఆ రిజ్వ‌రేష‌న్లు అమ‌లు చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ కూడా పెట్టింది.

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేంద్రం ప్ర‌క‌టించిన ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో అయిదు శాతాన్ని కాపుల‌కు కేటాయించారు. కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాన్ని అమ‌లు చేయ‌డం లేదు. ఇప్పుడు ఈ స‌మ‌స్య‌ను తీసుకుని బీజేపీ త‌న గ‌ళాన్ని వినిపిస్తోంది. ఇక కాపు రిజర్వేష‌న్ల కోసం ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసుకునే దిశ‌గా ఆ పార్టీ సాగుతోంది.

రాజ్య‌స‌భ‌లోనూ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు ప్ర‌స్తావించారు. ఏపీలో 28 శాతం కాపు సామాజిక‌వ‌ర్గం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఓటు బ్యాంకును మ‌ళ్లించుకోవ‌డం కోసం బీజేపీ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టింది. మ‌రోవైపు రాజ్యాధికారం సాధించ‌డం కోసం కాపు సామాజిక వ‌ర్గంలోని కీల‌క నేత‌లంతా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

This post was last modified on February 19, 2022 8:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

4 minutes ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

49 minutes ago

ఈసారి భోగి ముందుగానే వస్తుంది

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

2 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

2 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

3 hours ago

నాని టార్గెట్ స్పష్టంగా ఉంది

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ మొదటి పాట ఆయా షేర్ సోషల్ మీడియాని ఊపేస్తోంది. గతంలో ఇలాంటి పాటలు ఎవరూ…

3 hours ago