Political News

కాపుల‌ను దువ్వుతున్న బీజేపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో కాపు సామాజిక‌వ‌ర్గానికి కీల‌క పాత్ర అన‌డంలో సందేహం లేదు. అధికారంలోకి వ‌చ్చే పార్టీని నిర్ణ‌యించే సామ‌ర్థ్యం ఆ సామాజిక వ‌ర్గానికి ఉంది. అందుకే పార్టీల‌న్నీ వాళ్ల ఓట్ల కోసం విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తాయి. ఈ విష‌యాన్ని ఆల‌స్యంగా గుర్తించిన బీజేపీ.. ఇప్పుడా రాష్ట్రంలో కాపుల‌ను దువ్వే ప్ర‌య‌త్నాలు మొద‌లెట్టింద‌న్న వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ ప్ర‌భావం చూపేందుకు అతి పెద్ద‌దైన కాపు సామాజిక వ‌ర్గాన్ని మ‌చ్చిక చేసుకునేందుకు ఆ వ‌ర్గం స‌మ‌స్య‌ల‌పై బీజేపీ గ‌ళం విప్పుతోంది.

ఇప్పుడు ఏపీలో బీజేపీ, జ‌న‌సేన మ‌ధ్య పొత్తు ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఇవి రెండు క‌లిసి పోటీ చేసే అవ‌కాశాలే క‌నిపిస్తున్నాయి. మ‌రోవైపు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ కల్యాణ్ మాత్రం మొద‌టి నుంచి త‌న మీద కాపు సామాజిక‌వ‌ర్గం ముద్ర ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. ఇటీవ‌ల ఆయ‌న నోటి నుంచి కాపు మాట వ‌చ్చిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ ఏం మాట్లాడ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కాపు స‌మ‌స్య‌ల‌పై పోరాటానికి బీజేపీ ముందుకు వ‌చ్చింది.  

కాపుల‌కు విద్య, ఉద్యోగ రంగాల్లో అయిదు శాతం రిజ‌ర్వేష‌న్లు క‌ల్పించాల‌నే డిమాండ్‌ను తెర‌పైకి తీసుకొచ్చింది. గ‌త ప్ర‌భుత్వం కేంద్రం ఇచ్చిన ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో అయిదు శాతాన్ని కాపుల‌కు కేటాయించింద‌ని.. మార్చి 15లోగా ఆ రిజ్వ‌రేష‌న్లు అమ‌లు చేయాల‌ని వైసీపీ ప్ర‌భుత్వానికి డెడ్‌లైన్ కూడా పెట్టింది.

చంద్ర‌బాబు అధికారంలో ఉన్న స‌మ‌యంలో కేంద్రం ప్ర‌క‌టించిన ఈబీసీ రిజ‌ర్వేష‌న్ల‌లో అయిదు శాతాన్ని కాపుల‌కు కేటాయించారు. కానీ జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత దాన్ని అమ‌లు చేయ‌డం లేదు. ఇప్పుడు ఈ స‌మ‌స్య‌ను తీసుకుని బీజేపీ త‌న గ‌ళాన్ని వినిపిస్తోంది. ఇక కాపు రిజర్వేష‌న్ల కోసం ఉద్య‌మ కార్య‌చ‌ర‌ణ సిద్ధం చేసుకునే దిశ‌గా ఆ పార్టీ సాగుతోంది.

రాజ్య‌స‌భ‌లోనూ రిజ‌ర్వేష‌న్ల అంశాన్ని ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ న‌ర‌సింహారావు ప్ర‌స్తావించారు. ఏపీలో 28 శాతం కాపు సామాజిక‌వ‌ర్గం ఉంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఈ ఓటు బ్యాంకును మ‌ళ్లించుకోవ‌డం కోసం బీజేపీ ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తులు మొద‌లెట్టింది. మ‌రోవైపు రాజ్యాధికారం సాధించ‌డం కోసం కాపు సామాజిక వ‌ర్గంలోని కీల‌క నేత‌లంతా స‌మావేశాలు నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

This post was last modified on February 19, 2022 8:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టుల మనసు దోచుకున్న కవిత

దేశంలోని ఓ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. అందులో కమ్యూనిస్టు పాలనలో ఉన్న కేరళలోనూ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ…

2 hours ago

శభాష్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నిజమేనండోయ్...కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు ప్రమాదంలో మరణించిన…

5 hours ago

రావణుడిని అంత గొప్పగా చూపించగలరా

ఇటీవలే విడుదలైన రామాయణ పార్ట్ 1 టీజర్ మీద మిశ్రమ స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా ఫీడ్…

6 hours ago

బ్రేకింగ్: లిక్కర్ కేసులో ఏ1 రాజ్ కేసిరెడ్డికి బెయిల్

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏ1గా ఉన్న రాజ్ కేసిరెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు…

6 hours ago

డెకాయిట్ అంచనాల మీటర్ ఎలా ఉంది

ఇంకో మూడు రోజుల్లో డెకాయిట్ థియేటర్లలో అడుగు పెట్టేస్తాడు. హైదరాబాద్ లాంటి మెయిన్ సెంటర్స్ అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. టికెట్ల…

6 hours ago

ఈసీని విపక్షాలు ఏం చెయ్యలేవా?

కేంద్ర ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధాన క‌మిష‌న‌ర్.. జ్ఞానేష్ కుమార్ సేఫ్ అయ్యారు. ఆయ‌న‌పై కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని విప‌క్షాలు ఇచ్చిన…

7 hours ago