బిగ్బాస్…ఈ షో పాపులారిటీ గురించి పరిచయం చేయనవసరం లేదు. అదే సమయంలో దీనిపై వివాదాలు కూడా తెలిసిన సంగతే. తెలుగులో బిగ్ బాస్- 5 పూర్తి అయి దాదాపు రెండు నెలలు కావస్తున్న సమయంలో మరో సీజన్కు శ్రీకారం చుట్టారు. మునుపటిలా టీవీలో కాకుండా ఓటీటీలో వచ్చే ఈ కొత్త సీజన్పై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. దీనిపై స్పందించింది ఎవరో కాదు.. బిగ్ బాస్ అంటేనే కస్సున లేచే సీపీఐ నేత నారాయణ.
ఇటీవల బిగ్బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఉన్న ఈ షోలో ఉరిశిక్ష పడే ఖైదీ అయిన వెన్నెల కిశోర్ బిగ్బాస్ చూడాలని అనుకుంటాడు. దీంతో ఉరిశిక్షను సైతం వాయిదా వేసి ఆయనకు బిగ్ బాస్ చూసే చాన్సిస్తారు.
అంతేకాకుండా జైల్లోని సిబ్బంది, అధికారులు కూడా ఆయనతో కలిసి ఈ షో చూస్తారు. దీనిపైనే నారాయణకు మండిపోయింది. `ఉరిశిక్ష పడే ఖైదీకి సైతం ఆ శిక్ష అమలు వాయిదావేసి #బిగ్ బాస్”చూసేందుకు అనుమతిస్తారు. ఇది ప్రముఖ హీరో నాగార్జున వాణిజ్య ప్రకటన. బిగ్ బాస్ సమాజానికేం సందేశం ఇస్తుంది ??? మీరేసమాదానం చెప్పాలి“ అంటూ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.
ఇటీవలే నాగార్జునపై తనకున్న కోపం, అక్కసు అన్నింటినీ ఓ షోలో నారాయణ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా నాగార్జున ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నారాయణ నిలదీశారు. ఈ షో విషయంలో తాను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏకంగా ప్రోమోపై స్పందించారు. బిగ్బాస్ పై మిగతా వారికంటే నారాయణకే ప్రత్యేకంగా ఆసక్తి ఉన్నట్లుందని కొందరు కామెంట్ చేయడం కొసమెరుపు. మరోవైపు బిగ్ బాస్ షోలో మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ను ఎంపిక చేసుకొని.. వాళ్లని ఇప్పుడు ఓటీటీ కోసం మరోసారి ఇంట్లోకి పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
This post was last modified on February 19, 2022 2:31 pm
పురాణ గాథలను తెరకెక్కించేటపుడు ఎన్నో ఇబ్బందులుంటాయి. అప్పటి వాతావరణాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలిక కాదు. ప్రతి చిన్న విషయం…
వైసీపీ అధినేత జగన్ తాజాగా బుధవారం తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లిలో పర్యటించారు. ఇక్కడి పొగాకు రైతులను ఆయన పరామర్శించారు. తొలుత…
రోజులు మారిపోయాయి. బంధాలు, అనుబంధాలు అన్నీ ఆన్ లైన్ అయిపోయాయి. ఆకలైనప్పుడు ఆహారం, అనారోగ్యంగా వున్నప్పుడు మందులు ఆన్ లైన్లో…
ప్రపంచంలో ఏ భాషలో అయినా సినిమా గొప్పదనం ఒకటుంది. మనుషులు భౌతికంగా ఉన్నా లేకపోయినా వాళ్ళను దశాబ్దాల తరబడి గుర్తుంచుకునేలా…
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇంకా మూలుగుతూనే…
ఎల్లుండి విడుదల కాబోతున్న చిత్రాల్లో అందరి దృష్టి కొరియన్ కనకరాజు మీదే ఉంది. కొద్దో గొప్పో తమిళ దర్శకుడు లోకేష్…