బిగ్బాస్…ఈ షో పాపులారిటీ గురించి పరిచయం చేయనవసరం లేదు. అదే సమయంలో దీనిపై వివాదాలు కూడా తెలిసిన సంగతే. తెలుగులో బిగ్ బాస్- 5 పూర్తి అయి దాదాపు రెండు నెలలు కావస్తున్న సమయంలో మరో సీజన్కు శ్రీకారం చుట్టారు. మునుపటిలా టీవీలో కాకుండా ఓటీటీలో వచ్చే ఈ కొత్త సీజన్పై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. దీనిపై స్పందించింది ఎవరో కాదు.. బిగ్ బాస్ అంటేనే కస్సున లేచే సీపీఐ నేత నారాయణ.
ఇటీవల బిగ్బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఉన్న ఈ షోలో ఉరిశిక్ష పడే ఖైదీ అయిన వెన్నెల కిశోర్ బిగ్బాస్ చూడాలని అనుకుంటాడు. దీంతో ఉరిశిక్షను సైతం వాయిదా వేసి ఆయనకు బిగ్ బాస్ చూసే చాన్సిస్తారు.
అంతేకాకుండా జైల్లోని సిబ్బంది, అధికారులు కూడా ఆయనతో కలిసి ఈ షో చూస్తారు. దీనిపైనే నారాయణకు మండిపోయింది. `ఉరిశిక్ష పడే ఖైదీకి సైతం ఆ శిక్ష అమలు వాయిదావేసి #బిగ్ బాస్”చూసేందుకు అనుమతిస్తారు. ఇది ప్రముఖ హీరో నాగార్జున వాణిజ్య ప్రకటన. బిగ్ బాస్ సమాజానికేం సందేశం ఇస్తుంది ??? మీరేసమాదానం చెప్పాలి“ అంటూ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.
ఇటీవలే నాగార్జునపై తనకున్న కోపం, అక్కసు అన్నింటినీ ఓ షోలో నారాయణ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా నాగార్జున ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నారాయణ నిలదీశారు. ఈ షో విషయంలో తాను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏకంగా ప్రోమోపై స్పందించారు. బిగ్బాస్ పై మిగతా వారికంటే నారాయణకే ప్రత్యేకంగా ఆసక్తి ఉన్నట్లుందని కొందరు కామెంట్ చేయడం కొసమెరుపు. మరోవైపు బిగ్ బాస్ షోలో మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ను ఎంపిక చేసుకొని.. వాళ్లని ఇప్పుడు ఓటీటీ కోసం మరోసారి ఇంట్లోకి పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
This post was last modified on February 19, 2022 2:31 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…