బిగ్బాస్…ఈ షో పాపులారిటీ గురించి పరిచయం చేయనవసరం లేదు. అదే సమయంలో దీనిపై వివాదాలు కూడా తెలిసిన సంగతే. తెలుగులో బిగ్ బాస్- 5 పూర్తి అయి దాదాపు రెండు నెలలు కావస్తున్న సమయంలో మరో సీజన్కు శ్రీకారం చుట్టారు. మునుపటిలా టీవీలో కాకుండా ఓటీటీలో వచ్చే ఈ కొత్త సీజన్పై అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి. దీనిపై స్పందించింది ఎవరో కాదు.. బిగ్ బాస్ అంటేనే కస్సున లేచే సీపీఐ నేత నారాయణ.
ఇటీవల బిగ్బాస్ ఓటీటీ ప్రోమో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆసక్తికరంగా ఉన్న ఈ షోలో ఉరిశిక్ష పడే ఖైదీ అయిన వెన్నెల కిశోర్ బిగ్బాస్ చూడాలని అనుకుంటాడు. దీంతో ఉరిశిక్షను సైతం వాయిదా వేసి ఆయనకు బిగ్ బాస్ చూసే చాన్సిస్తారు.
అంతేకాకుండా జైల్లోని సిబ్బంది, అధికారులు కూడా ఆయనతో కలిసి ఈ షో చూస్తారు. దీనిపైనే నారాయణకు మండిపోయింది. `ఉరిశిక్ష పడే ఖైదీకి సైతం ఆ శిక్ష అమలు వాయిదావేసి #బిగ్ బాస్”చూసేందుకు అనుమతిస్తారు. ఇది ప్రముఖ హీరో నాగార్జున వాణిజ్య ప్రకటన. బిగ్ బాస్ సమాజానికేం సందేశం ఇస్తుంది ??? మీరేసమాదానం చెప్పాలి“ అంటూ తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు.
ఇటీవలే నాగార్జునపై తనకున్న కోపం, అక్కసు అన్నింటినీ ఓ షోలో నారాయణ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బిగ్ బాస్ షో ద్వారా నాగార్జున ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారని నారాయణ నిలదీశారు. ఈ షో విషయంలో తాను తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏకంగా ప్రోమోపై స్పందించారు. బిగ్బాస్ పై మిగతా వారికంటే నారాయణకే ప్రత్యేకంగా ఆసక్తి ఉన్నట్లుందని కొందరు కామెంట్ చేయడం కొసమెరుపు. మరోవైపు బిగ్ బాస్ షోలో మొదటి సీజన్ నుంచి ఐదో సీజన్ వరకు పాల్గొన్న కొందరు కంటెస్టెంట్స్ను ఎంపిక చేసుకొని.. వాళ్లని ఇప్పుడు ఓటీటీ కోసం మరోసారి ఇంట్లోకి పంపించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
This post was last modified on February 19, 2022 2:31 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…