Political News

మోడీకి తలనొప్పిగా మారిన వరుణ్ గాంధీ

ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ వరుణ్ గాంధీ పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. రైతుల పక్షాన నిలిచిన ఎంపీ ఆ మధ్య మోడీకి రాసిన లేఖలు, మోడీకి పంపిన వీడియోలు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి. యూపీలోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కొడుకు వాహనం నడిపి నలుగురు రైతులను చంపేసిన ఘటనపైన మోడీని ఎంపి బాగానే ఇరుకున పెట్టారు. రైతులకు మద్దతుగా మోడీకి ఎంపీ పెట్టిన ట్వీట్లు, వీడియోలనే ప్రతిపక్షాలు కూడా బాగా వాడుకున్నాయి.

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో హీట్ పెరిగిపోతున్న సమయంలో ఎంపీ  ఇపుడు మరో లేఖ రాశారు. ఆర్ధిక నేరగాళ్ళను ప్రభుత్వం ఎందుకు రక్షిస్తోందంటు తన లేఖలో మోడీని ఎంపి నిలదీయటం సంచలనంగా మారింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొడుతున్న రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అండగా ఉంటోందని జనాలు అనుకుంటున్నట్లు ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు.

నీరవ్ మోడీ రు. 14 వేల కోట్లు, విజయ్ మాల్యా రు. 9 వేల కోట్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా గుజరాత్ లో బయటపడిన ఏబీజీ షిప్ యార్డు రు. 23 వేల కోట్ల కుంభకోణాన్ని కూడా ఎంపీ తన లేఖలో ఉదాహరణగా చూపించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు దోచుకుంటుంటే తమ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని వరుణ్ గాంధీ తన లేఖలో మోడీని నిలదీశారు.

ఆర్ధిక నేరగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోగా వివిధ కారణాలతో వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మండిపడ్డారు. రోజుకు అప్పులతో ఎంతో మంది రైతులు, చేనేత కార్మికులు, పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కేంద్రానికి తెలీదా అంటు ప్రశ్నించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం కేవలం కొందరు ఆర్ధిక నేరగాళ్ళకు మాత్రమే మద్దతుగా నిలవటం చాలా తప్పన్నారు. అప్పులు తీసుకున్న మామూలు ప్రజలకు ఒక న్యాయం, ఆర్ధిక నేరగాళ్ళకు మరో న్యాయమా అంటు మోడీని ఎంపీ నిలదీశారు. మొత్తానికి ఎంపీ రాసిన లేఖను ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నాయి.

This post was last modified on February 19, 2022 12:43 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఫ్లో లో క‌థేంటో చెప్పేసిన హీరో

కొంద‌రు ఫిలిం మేక‌ర్స్ త‌మ సినిమా క‌థేంటో చివ‌రి వ‌ర‌కు దాచి పెట్టాల‌ని ప్ర‌య‌త్నిస్తారు. నేరుగా థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌ర‌చాల‌నుకుంటారు.…

4 hours ago

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

6 hours ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

7 hours ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

7 hours ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

8 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

10 hours ago