ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఎంపీ వరుణ్ గాంధీ పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. రైతుల పక్షాన నిలిచిన ఎంపీ ఆ మధ్య మోడీకి రాసిన లేఖలు, మోడీకి పంపిన వీడియోలు పార్టీలో పెద్ద దుమారాన్ని రేపాయి. యూపీలోని లఖింపూర్ ఖేరిలో కేంద్ర మంత్రి కొడుకు వాహనం నడిపి నలుగురు రైతులను చంపేసిన ఘటనపైన మోడీని ఎంపి బాగానే ఇరుకున పెట్టారు. రైతులకు మద్దతుగా మోడీకి ఎంపీ పెట్టిన ట్వీట్లు, వీడియోలనే ప్రతిపక్షాలు కూడా బాగా వాడుకున్నాయి.
ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో హీట్ పెరిగిపోతున్న సమయంలో ఎంపీ ఇపుడు మరో లేఖ రాశారు. ఆర్ధిక నేరగాళ్ళను ప్రభుత్వం ఎందుకు రక్షిస్తోందంటు తన లేఖలో మోడీని ఎంపి నిలదీయటం సంచలనంగా మారింది. బ్యాంకుల నుంచి వేల కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఎగ్గొడుతున్న రాజకీయ నేతలకు, పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం అండగా ఉంటోందని జనాలు అనుకుంటున్నట్లు ఎంపీ తన లేఖలో ప్రస్తావించారు.
నీరవ్ మోడీ రు. 14 వేల కోట్లు, విజయ్ మాల్యా రు. 9 వేల కోట్లు తీసుకుని బ్యాంకులను మోసం చేసిన విషయాన్ని ప్రస్తావించారు. తాజాగా గుజరాత్ లో బయటపడిన ఏబీజీ షిప్ యార్డు రు. 23 వేల కోట్ల కుంభకోణాన్ని కూడా ఎంపీ తన లేఖలో ఉదాహరణగా చూపించారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలు దోచుకుంటుంటే తమ ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటోందని వరుణ్ గాంధీ తన లేఖలో మోడీని నిలదీశారు.
ఆర్ధిక నేరగాళ్ళపై కఠిన చర్యలు తీసుకోకపోగా వివిధ కారణాలతో వాళ్ళకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నట్లు మండిపడ్డారు. రోజుకు అప్పులతో ఎంతో మంది రైతులు, చేనేత కార్మికులు, పేదలు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయం కేంద్రానికి తెలీదా అంటు ప్రశ్నించారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన ప్రభుత్వం కేవలం కొందరు ఆర్ధిక నేరగాళ్ళకు మాత్రమే మద్దతుగా నిలవటం చాలా తప్పన్నారు. అప్పులు తీసుకున్న మామూలు ప్రజలకు ఒక న్యాయం, ఆర్ధిక నేరగాళ్ళకు మరో న్యాయమా అంటు మోడీని ఎంపీ నిలదీశారు. మొత్తానికి ఎంపీ రాసిన లేఖను ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నాయి.
This post was last modified on February 19, 2022 12:43 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…