Political News

ఢిల్లీ పోరులో కేసీఆర్‌తో జ‌గ‌న్?

గ‌త కొద్దికాలంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కేంద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తుండ‌టం హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ సార‌థ్యంలోని ప్ర‌భుత్వం విధివిధానాల‌ను ఆయ‌న తీవ్రంగా త‌ప్పుప‌డుతుండ‌గా.. .వివిధ రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు, జాతీయ పార్టీల నేత‌లు ఆయ‌న‌కు సంఘీభావం తెలుపుతున్నారు.

అయితే, పొరుగు రాష్ట్రమైన ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నుంచి మాత్రం స్పంద‌న రావ‌డం లేదు. ఈ విష‌యంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌లుపుకొనిపోవాల‌ని సూచించారు.

ఎనిమిదేళ్ల క్రితం లోక్‌సభలో ఏపీ విభజన బిల్లు ఆమోదం జరిగినట్టు ప్రకటించారని పేర్కొన్న ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్… ఈ ప్ర‌క‌ట‌న ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్ర మోడీ, హోంశాఖ మంత్రి అమిత్‌షా పార్లమెంట్ ఉభయసభల్లోనే చెప్పారని గుర్తు చేశారు. అందుకే రాష్ట్ర విభజనలో ఏపీకి జరిగిన అన్యాయంపై ప్రధాని మోడీ, అమిత్ షా స్పందించాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సాక్షిగా జరిగిన అన్యాయాన్ని సరిదిద్దకుంటే భావితరాలు క్షమించమని హెచ్చరించారు.

రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై సీఎం జగన్ నోరుమెదపకపోవటం అన్యాయమంటూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌, ప్రతిపక్ష నేత చంద్రబాబు కొట్టుకొని ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేస్తారా అని మండిపడిన ఉండవల్లి అరుణ్‌ కుమార్.. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం ప్రయత్నించరా? అని నిలదీశారు.  ఏపీకి జరిగిన అన్యాయంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడాలని సూచించిన ఉండవల్లి.. బీజేపీని నిలదీసేందుకు ఏపీని కలుపుకోవాలన్నారు.

This post was last modified on February 19, 2022 8:43 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

1 hour ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago