వచ్చే ఎన్నికల్లో టికెట్ల కోసం.. టీడీపీలో అప్పుడే గుసగుస ప్రారంభమైంది. ఎన్నికలకు ఏడాది ముందు నుంచే అభ్యర్థులను నిర్ణయించడం ద్వారా.. పార్టీని పరుగులు పెట్టించాలని.. చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలో యువతకు కూడా టికెట్లు ఎక్కువగానే ఇవ్వాలని నిర్ణయించారు. అయితే.. యూత్లో ఎక్కువ మంది.. లోకేష్కుసన్నిహితులు ఉన్నారు. ఒకే నియోజకవర్గం నుంచి ఇద్దరు ముగ్గురు కూడా లోకేష్కు టచ్లో ఉన్నారు. వీరు ఇప్పుడు తమ ఆశలన్నీ.. లోకేష్పైనే పెట్టుకున్నారు.
లోకేష్కు ఐటీ టీంలో ఉన్నవారు.. ఆయన కనుసన్నల్లో మెలుగుతున్న వారు కూడా టికెట్లు కోరుతున్నారు. అయితే.. ఇప్పటికే ఉన్న వారసులను కాదని.. లోకేష్ వీరిని ప్రమోట్ చేయడం కష్టమనే భావన ఉంది. ఇదిలావుంటే.. పార్టీలో సీనియర్లు.. ఇప్పటికే పార్టీలో టికెట్ ఇచ్చినా విజయం దక్కించుకోని వారు.. తమ తమ వారసులను కూడా రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో వారు .. నేరుగా పార్టీలోకి తీసుకురాకుండా.. ముందు వెళ్లి లోకేష్ను ప్రసన్నం చేసుకోవాలని.. వారికి సూచిస్తున్నారు.
దీంతో కొత్తగా రావాలని అనుకుంటున్న యువ నాయకులు లోకేష్ చుట్టూ తిరుగుతున్నారు. దీంతో ఇప్పటి వరకు ప్రాధాన్యం ఉంటుందా ? ఉండదా ? అనుకున్న లోకేష్కు ఇప్పుడు గ్రాఫ్ పెరిగిపోయింది. యువ నేతల నుంచి ఫోన్లు.. తనను కలుసుకునేందుకు వచ్చేవారితో ఆయన తీరిక లేకుండా ఉన్నారు. అయితే.. వీరంతా ఆశపడుతున్నది వచ్చే ఎన్నికల్లో టికెట్ల వస్తాయనే..!
కానీ, వచ్చే ఎన్నికలు.. వైసీపీ వర్సెస్.. టీడీపీకి మధ్య హోరా హోరీ పోరు సాగనున్న నేపథ్యంలో గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్లు దక్కే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో లోకేష్ సిఫారసులకు ఏమేరకు ప్రాధాన్యం ఉంటుంది. ఉన్నా.. ఇంత మందికి టికెట్లు ఇచ్చే పరిస్థితి పార్టీలో ఉంటుందా ? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. మరి లోకేష్ ఏమేరకు సక్సెస్ అవుతారో చూడాలి.
This post was last modified on February 17, 2022 11:00 am
ఏపీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టుగా మారుతోందా? .. పార్టీ నాయకులు దీనస్థితిలో ఉన్నారా? అంటే.. ఔననే సమాధానమే…
ఇరాన్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…
ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన తన చివరి చిత్రం అనగనగా ఒక…
2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…
రాజకీయాల్లోనే కాదు.. ఆటల్లోనూ తన సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల…
ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…