బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కేంద్రంగా వివాదాలు పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ గా ఏదో వివాదంలో ఎంపీ ఎందుకు ఇరుక్కుంటున్నారో అర్ధం కావటం లేదు. తాజాగా తన అనుచరులతో ఎంపీ కృష్ణలంక పోలీసుస్టేషన్ లో వీరంగం చేసినట్లు, పోలీసులపై దౌర్జన్యం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరే ఈ ప్రచారాన్ని ఎంపీ ఖండిస్తున్నారనుకోండి అది వేరే సంగతి. పోలీసుస్టేషన్లో జరిగింది చాలా చిన్న ఘటనైతే దాన్ని తానంటే పడని మీడియా బూతద్దంలో చూపిస్తోందంటు మండిపోయారు.
పైగా ఎక్కడెక్కడో జరిగిన ఘటనలన్నీ తనమీదే రుద్దితే ఎలాగంటు నిలదీశారు. సరే ఎంపీ వాదన ఎలాగున్నా అసలేం జరిగింది ? అని ఆరా తీస్తే జరిగిన దాంట్లో ఎస్ఐ అతి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బుధవారం అర్ధరాత్రి ఎస్ఐ మూర్తి తన సిబ్బందితో బస్టాండ్ దగ్గర వాహనాల చెకింగ్ లో ఉన్నారు. అదే సమయంలో మోటారుసైకిల్ పై త్రిబుల్ రైడింగ్ లో ముగ్గురు యువకులు వచ్చారు. వాళ్ళని ఆపిన ఎస్ఐ వివరాలడిగారు.
తాము సినిమా చూసొస్తున్నట్లు చెప్పిన వారు భోజనానికి వెళుతున్నామని చెప్పారు. త్రిబుల్ రైడింగ్ తప్పని చెప్పిన ఎస్ఐ వారిలో ఒకరిని అందరి ముందు కొట్టారు. దాంతో వారిలో ఒకడు తాము ఎంపీ బంధువని చెప్పటంతో ముగ్గురినీ పోలీసుస్టేషన్ కు తరలించారు. తర్వాత స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ మళ్ళీ వాళ్ళని కొట్టారు. ఎస్ఐ తమని కొట్టడాన్ని మొబైల్ ఫోన్లో వీడియో తీసిన కుర్రాళ్ళు దాన్ని ఎంపీకి పంపారు. ఎంపీ ఫోన్ చేసినా ఎస్ఐ తీయలేదు. దాంతో నేరుగా స్టేషన్ కు వచ్చారు ఎంపీ.
అక్కడ ఎస్ఐకి ఎంపీగా వాగ్వాదం జరిగింది. తాను ఫోన్ చేసినా ఎందుకని తీయలేదంటు ఎంపీ ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే మాస్కు పెట్టుకున్న ఎంపీని ఎస్ఐ ముందు గుర్తించకుండా ర్యాష్ గా మాట్లాడారట. మాస్కు తీసేసిన తర్వాత ఎంపీనీ గుర్తుపట్టారు. ఈలోగానే ఎంపీ అనుచరులకు స్టేషన్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. మోటారు వాహనాల చట్టం క్రింద కేసు నమోదు చేసి ముగ్గురిని ఎస్ఐ వదిలేశారు.
త్రిబుల్ రైడింగ్ చేసిన వారిని ఎస్ఐ మందలించి చలానా రాసి వారిని బస్టాండ్ దగ్గరే వదిలేసుండవచ్చు. కానీ అలాచేయకుండా ఎస్ఐ వారిని కొట్టారు. పోనీ స్టేషన్ కు తెచ్చిన తర్వాతైనా వారిని వదిలేశారా అంటే మళ్ళీ అక్కడా కొట్టారు. అంటే తాను ఎంపీ బంధువునని చెప్పిన తర్వాతే ఎస్ఐ కొట్టినట్లు అర్ధమవుతోంది. పోలీసుస్టేషన్లో వారిపై నమోదుచేసిన కేసేదో బస్టాండ్ లోనే చేసుండచ్చు. కొట్టడం చట్ట ప్రకారం తప్పు. అయినా ఎస్సై తెలిసే చేశారన్నది ఎంపీ మనుషుల ఆరోపణ. ఏదేమైనా పోలీసులతో దురుసుగా వ్యవహరించటం ఎంపీ తప్పేనటంలో సందేహం లేదు.
This post was last modified on February 17, 2022 10:58 am
నాలుగు నెలల క్రితం జన నాయకుడు వాయిదా పడినప్పుడు అభిమానులు తెగ కలవరపడ్డారు. సెన్సార్ వివాదాల వల్ల ఎప్పుడు వస్తుందో…
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సోమవారం ఉదయం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన తొలి గంటలో ఆసక్తికర…
తమిళనాడు ఎన్నికల ముంగిట రాజకీయాలతో సంబంధం లేని ఒక వ్యక్తి పేరు బాగా చర్చనీయాంశం అయిందే. ఆ పేరు ఇంకేదో…
ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పశ్చిమ…
గత శుక్రవారం జెట్లీ అనే సినిమా రిలీజైంది. అది కమెడియన్ సత్య హీరోగా పరిచయం అయిన సినిమా. అయినా సరే..…
ఒకప్పుడు తెలుగు సినిమాల మీద తమిళ చిత్రాలు స్పష్టమైన ఆధిపత్యం చూపించేవి. అక్కడ ఎంతోమంది మేటి దర్శకులు ఉండేవాళ్లు. కొత్త…