Political News

వైసీపీ ఎంపీ గొడవ పడింది నిజమేనా?

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కేంద్రంగా వివాదాలు పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ గా ఏదో వివాదంలో ఎంపీ ఎందుకు ఇరుక్కుంటున్నారో అర్ధం కావటం లేదు. తాజాగా తన అనుచరులతో ఎంపీ కృష్ణలంక పోలీసుస్టేషన్ లో వీరంగం చేసినట్లు, పోలీసులపై దౌర్జన్యం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరే ఈ ప్రచారాన్ని ఎంపీ ఖండిస్తున్నారనుకోండి అది వేరే సంగతి. పోలీసుస్టేషన్లో జరిగింది చాలా చిన్న ఘటనైతే దాన్ని తానంటే పడని మీడియా బూతద్దంలో చూపిస్తోందంటు మండిపోయారు.

పైగా ఎక్కడెక్కడో జరిగిన ఘటనలన్నీ తనమీదే రుద్దితే ఎలాగంటు నిలదీశారు. సరే ఎంపీ వాదన ఎలాగున్నా అసలేం జరిగింది ? అని ఆరా తీస్తే జరిగిన దాంట్లో ఎస్ఐ అతి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బుధవారం అర్ధరాత్రి ఎస్ఐ మూర్తి తన సిబ్బందితో బస్టాండ్ దగ్గర వాహనాల చెకింగ్ లో ఉన్నారు. అదే సమయంలో మోటారుసైకిల్ పై త్రిబుల్ రైడింగ్ లో ముగ్గురు యువకులు వచ్చారు. వాళ్ళని ఆపిన ఎస్ఐ వివరాలడిగారు.

తాము సినిమా చూసొస్తున్నట్లు చెప్పిన వారు భోజనానికి వెళుతున్నామని చెప్పారు. త్రిబుల్ రైడింగ్ తప్పని చెప్పిన ఎస్ఐ వారిలో ఒకరిని అందరి ముందు కొట్టారు. దాంతో వారిలో ఒకడు తాము ఎంపీ బంధువని చెప్పటంతో ముగ్గురినీ పోలీసుస్టేషన్ కు తరలించారు. తర్వాత స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ మళ్ళీ వాళ్ళని కొట్టారు. ఎస్ఐ తమని కొట్టడాన్ని మొబైల్ ఫోన్లో వీడియో తీసిన కుర్రాళ్ళు దాన్ని ఎంపీకి పంపారు.  ఎంపీ ఫోన్ చేసినా ఎస్ఐ తీయలేదు. దాంతో నేరుగా స్టేషన్ కు వచ్చారు ఎంపీ.

అక్కడ ఎస్ఐకి ఎంపీగా వాగ్వాదం జరిగింది. తాను ఫోన్ చేసినా ఎందుకని తీయలేదంటు ఎంపీ ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే మాస్కు పెట్టుకున్న ఎంపీని ఎస్ఐ ముందు గుర్తించకుండా ర్యాష్ గా మాట్లాడారట. మాస్కు తీసేసిన తర్వాత ఎంపీనీ గుర్తుపట్టారు. ఈలోగానే ఎంపీ అనుచరులకు స్టేషన్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. మోటారు వాహనాల చట్టం క్రింద కేసు నమోదు చేసి ముగ్గురిని ఎస్ఐ వదిలేశారు.

త్రిబుల్ రైడింగ్ చేసిన వారిని  ఎస్ఐ మందలించి  చలానా రాసి వారిని బస్టాండ్ దగ్గరే వదిలేసుండవచ్చు. కానీ అలాచేయకుండా ఎస్ఐ వారిని కొట్టారు. పోనీ స్టేషన్ కు తెచ్చిన తర్వాతైనా వారిని వదిలేశారా అంటే మళ్ళీ అక్కడా కొట్టారు. అంటే తాను ఎంపీ బంధువునని చెప్పిన తర్వాతే ఎస్ఐ కొట్టినట్లు అర్ధమవుతోంది. పోలీసుస్టేషన్లో వారిపై నమోదుచేసిన కేసేదో బస్టాండ్ లోనే చేసుండచ్చు. కొట్టడం చట్ట ప్రకారం తప్పు. అయినా ఎస్సై తెలిసే చేశారన్నది ఎంపీ మనుషుల ఆరోపణ. ఏదేమైనా పోలీసులతో దురుసుగా వ్యవహరించటం ఎంపీ తప్పేనటంలో సందేహం లేదు.

Satya

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

3 hours ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

3 hours ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

3 hours ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

3 hours ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

3 hours ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

4 hours ago