Political News

వైసీపీ ఎంపీ గొడవ పడింది నిజమేనా?

బాపట్ల ఎంపీ నందిగం సురేష్ కేంద్రంగా వివాదాలు పెరిగిపోతున్నాయి. రెగ్యులర్ గా ఏదో వివాదంలో ఎంపీ ఎందుకు ఇరుక్కుంటున్నారో అర్ధం కావటం లేదు. తాజాగా తన అనుచరులతో ఎంపీ కృష్ణలంక పోలీసుస్టేషన్ లో వీరంగం చేసినట్లు, పోలీసులపై దౌర్జన్యం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. సరే ఈ ప్రచారాన్ని ఎంపీ ఖండిస్తున్నారనుకోండి అది వేరే సంగతి. పోలీసుస్టేషన్లో జరిగింది చాలా చిన్న ఘటనైతే దాన్ని తానంటే పడని మీడియా బూతద్దంలో చూపిస్తోందంటు మండిపోయారు.

పైగా ఎక్కడెక్కడో జరిగిన ఘటనలన్నీ తనమీదే రుద్దితే ఎలాగంటు నిలదీశారు. సరే ఎంపీ వాదన ఎలాగున్నా అసలేం జరిగింది ? అని ఆరా తీస్తే జరిగిన దాంట్లో ఎస్ఐ అతి కూడా స్పష్టంగా కనబడుతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే బుధవారం అర్ధరాత్రి ఎస్ఐ మూర్తి తన సిబ్బందితో బస్టాండ్ దగ్గర వాహనాల చెకింగ్ లో ఉన్నారు. అదే సమయంలో మోటారుసైకిల్ పై త్రిబుల్ రైడింగ్ లో ముగ్గురు యువకులు వచ్చారు. వాళ్ళని ఆపిన ఎస్ఐ వివరాలడిగారు.

తాము సినిమా చూసొస్తున్నట్లు చెప్పిన వారు భోజనానికి వెళుతున్నామని చెప్పారు. త్రిబుల్ రైడింగ్ తప్పని చెప్పిన ఎస్ఐ వారిలో ఒకరిని అందరి ముందు కొట్టారు. దాంతో వారిలో ఒకడు తాము ఎంపీ బంధువని చెప్పటంతో ముగ్గురినీ పోలీసుస్టేషన్ కు తరలించారు. తర్వాత స్టేషన్ కు వచ్చిన ఎస్ఐ మళ్ళీ వాళ్ళని కొట్టారు. ఎస్ఐ తమని కొట్టడాన్ని మొబైల్ ఫోన్లో వీడియో తీసిన కుర్రాళ్ళు దాన్ని ఎంపీకి పంపారు.  ఎంపీ ఫోన్ చేసినా ఎస్ఐ తీయలేదు. దాంతో నేరుగా స్టేషన్ కు వచ్చారు ఎంపీ.

అక్కడ ఎస్ఐకి ఎంపీగా వాగ్వాదం జరిగింది. తాను ఫోన్ చేసినా ఎందుకని తీయలేదంటు ఎంపీ ఆగ్రహంతో ఊగిపోయారు. అయితే మాస్కు పెట్టుకున్న ఎంపీని ఎస్ఐ ముందు గుర్తించకుండా ర్యాష్ గా మాట్లాడారట. మాస్కు తీసేసిన తర్వాత ఎంపీనీ గుర్తుపట్టారు. ఈలోగానే ఎంపీ అనుచరులకు స్టేషన్ సిబ్బందికి వాగ్వాదం జరిగింది. మోటారు వాహనాల చట్టం క్రింద కేసు నమోదు చేసి ముగ్గురిని ఎస్ఐ వదిలేశారు.

త్రిబుల్ రైడింగ్ చేసిన వారిని  ఎస్ఐ మందలించి  చలానా రాసి వారిని బస్టాండ్ దగ్గరే వదిలేసుండవచ్చు. కానీ అలాచేయకుండా ఎస్ఐ వారిని కొట్టారు. పోనీ స్టేషన్ కు తెచ్చిన తర్వాతైనా వారిని వదిలేశారా అంటే మళ్ళీ అక్కడా కొట్టారు. అంటే తాను ఎంపీ బంధువునని చెప్పిన తర్వాతే ఎస్ఐ కొట్టినట్లు అర్ధమవుతోంది. పోలీసుస్టేషన్లో వారిపై నమోదుచేసిన కేసేదో బస్టాండ్ లోనే చేసుండచ్చు. కొట్టడం చట్ట ప్రకారం తప్పు. అయినా ఎస్సై తెలిసే చేశారన్నది ఎంపీ మనుషుల ఆరోపణ. ఏదేమైనా పోలీసులతో దురుసుగా వ్యవహరించటం ఎంపీ తప్పేనటంలో సందేహం లేదు.

This post was last modified on February 17, 2022 10:58 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ష‌ర్మిలమ్మా.. మీ పార్టీ దీన‌స్థితి చూడ‌మ్మా.. !

ఏపీ కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టుగా మారుతోందా? .. పార్టీ నాయ‌కులు దీన‌స్థితిలో ఉన్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే…

1 hour ago

ఇరాన్‌లో భారతీయ విద్యార్థులు.. ఇటు ప్రాణాలు, అటు పరీక్షలు

ఇరాన్‌లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు అక్కడ వైద్య విద్యనభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఒకవైపు అమెరికా…

2 hours ago

బాలీవుడ్‌కు పొలిశెట్టి పంచ్

ఇప్పుడు తెలుగులో వంద కోట్ల హీరోగా ఎదిగాడు న‌వీన్ పొలిశెట్టి. సంక్రాంతికి విడుదలైన త‌న చివ‌రి చిత్రం అన‌గ‌న‌గా ఒక…

2 hours ago

శర్వానంద్ భోగికి అసలైన ఛాలెంజ్

2026 శర్వానంద్ కు చాలా స్పెషల్ ఇయర్ గా నిలవబోతోంది. సంక్రాంతి పండక్కు విపరీతమైన పోటీ మధ్య 'నారి నారి…

3 hours ago

అయ్యన్నను ఓడించిన రఘురామ

రాజ‌కీయాల్లోనే కాదు.. ఆట‌ల్లోనూ త‌న సత్తా నిరూపించారు... ఉండి ఎమ్మెల్యే అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు. అసెంబ్లీ బడ్జెట్ స‌మావేశాల…

3 hours ago

నంది అవార్డులంటే అంత చులకనా

ఇప్పుడు ఏపీలో ఇంకా వాటి పునరుద్ధరణ జరగలేదు, తెలంగాణలో గద్దర్ గా పేరు మారింది కానీ ఒకప్పుడు నంది అవార్డులంటే…

4 hours ago