Political News

ఈ ఇద్దరు ఎటూ కాకుండా పోతారా ?

ఇపుడిదే విషయమై అందరిలోను అనుమానాలు పెరిగిపోతున్నాయి. జాతీయ స్ధాయిలో మారిపోతున్న రాజకీయ సమీకరణల్లో ఏపీ పాత్ర ఎక్కడా కనబడటం లేదు. ఎన్డీఏ, యూపీయేయేతర పార్టీలతో  కూటమి కట్టేందుకు ప్రయత్నాలు జోరందుకున్న విషయం అందరికీ కనబడుతోంది. ఒకవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మరోవైపు కేసీయార్ చాలా స్పీడు మీదున్నారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఒడిస్సా సీఎం నవీన్ పట్నాయక్ తదితరులతో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు.

వీళ్ళందరు వచ్చే ఎన్నికల్లో సమావేశం అవటానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని వార్తలు కనబడుతున్నాయి. తమతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను కూడా కలుపుకోవాలని తటస్త ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తున్నారు. కేజ్రీవాల్ కూడా వీరికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఎన్డీయే, యూపీఏ కూటమి తమను తాము కన్సాలిడేట్ చేసుకునేందుకు భాగస్వామ్య పక్షాలతో రెగ్యులర్ గా సమావేశాలు పెట్టుకుంటున్నాయి.

ఈ మొత్తం వ్యవహారంలో అందరూ కలిసి ఏపీని వదిలేసినట్లే అనుమానంగా ఉంది. ఏ రాజకీయ పక్షం కూడా జగన్మోహన్ రెడ్డితో కానీ లేదా చంద్రబాబు నాయుడుతో కానీ టచ్ లోకి వస్తున్నట్లు లేదు. చంద్రబాబు అన్ని పార్టీలకు ప్రస్తుతం సమ దూరం పాటిస్తుండటం వల్ల కేసీఆర్ కి చంద్రబాబు అంటే పడకపోవడం అతన్ని సంప్రదించడం లేదు. మరి అధికారంలో ఉన్న జగన్ తో టచ్ లోకి రావాలి కదా. సీఎంను కూడా ఎవరూ ఎందుకని టచ్ చేయటం లేదు ?

ఎందుకంటే జగన్ పై న చాలామందికి నమ్మకం లేనట్లుంది. జగన్ నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా తమతో చేతులు కలిపేంత సీన్ లేదని మమత, కేజ్రీవాల్, కేసీయార్ కు అర్ధమైపోయినట్లుంది. జగన్ పై ఉన్న కేసులు, చంద్రబాబుకు ఉన్న రాజకీయ అనివార్యతల కారణంగానే కూటమికి దూరంగా ఉన్నారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోడీకి లేదా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. ఈ విషయాన్ని గడచిన ఎనిమిదేళ్ళుగా యావత్ దేశం చూస్తూనే ఉంది. పోనీ నరేంద్ర మోడీ అయినా వీళ్ళిద్దరికీ ఇవ్వాల్సినంత ప్రాదాన్యతిస్తున్నారా అంటే అదీ లేదు. అందుకనే చివరకు జగన్, చంద్రబాబు చివరకు ఏ కూటమికీ కాకుండా పోతారేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

This post was last modified on February 16, 2022 5:41 pm

Share
Show comments
Published by
Tharun

Recent Posts

సినీ తారల సందడితో పోలింగ్ కళకళ

స్టార్లు సెలబ్రిటీలు తెరమీద, బయట కనిపించినప్పుడు వేరే సంగతి కానీ ఎన్నికల సందర్భంగా ఓటు హక్కుని వినియోగించుకోవడం కోసం పోలింగ్…

12 mins ago

క‌డ‌ప‌లో రికార్డు స్థాయి పోలింగ్‌.. అక్క చెల్లెళ్ల ఎఫెక్టేనా?

ఏపీలో జ‌రుగుతున్న పార్ల‌మెంటు, అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఒక‌టి రెండు జిల్లాలు మిన‌హా.. మిగిలిన జిల్లాల్లో పోలింగ్ ప్ర‌క్రియ ఆశాజ‌న‌కంగానే సాగుతోంది.…

15 mins ago

చంద్ర‌బాబు పేరిట త‌ప్పుడు ప్ర‌చారం.. స్ట్రాంగ్ వార్నింగ్‌

ఏపీలో పోలింగ్ ప్ర‌క్రియ‌కు మ‌రికొన్ని గంట‌ల ముందు.. సంచ‌ల‌నం చోటు చేసుకుంది. కూట‌మి పార్టీల ముఖ్య నేత‌, టీడీపీ అధినేత…

16 hours ago

జ‌గ‌న్ చేయాల్సిన ప‌ని.. బాబు చేస్తున్నారు..

ఏపీలో చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. శ‌నివారం సాయంత్రంతో ఎన్నిక‌ల ప్ర‌చారం ముగిసిపోవ‌డంతో నాయ‌కులు, పార్టీల అధినే త‌లు ఎక్క‌డిక‌క్క‌డ సేద…

17 hours ago

బెట్టింగ్ లో రూ.2 కోట్లు .. కొట్టిచంపిన తండ్రి

బెట్టింగ్‌లో రూ.2 కోట్లు పోగొట్టిన కుమారుడిని తండ్రి హతమార్చిన ఘటన మెదక్‌ జిల్లాలోని చిన్నశంకరంపేట మండలం బగిరాత్‌పల్లిలో చోటు చేసుకుంది.…

17 hours ago

పవన్‌కు ప్రాణం, జగన్‌కు ఓటు.. మారుతుందా?

ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల్లో యూత్‌లో పవన్‌కు ఉన్నది మామూలు క్రేజ్ కాదు. సినిమాల్లో సూపర్ స్టార్ ఇమేజ్ వల్ల…

18 hours ago