విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎంపీ నందిగం సురేష్ హల్ చల్ చేశారు. తన అనుచరులను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలంటూ ఎస్ ఐ, సిబ్బందితో నందిగం సురేష్, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. అంతేకాదు, ఈ వ్యవహారాన్ని ఫోన్ లో రికార్డు చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ పై కూడా సురేష్ అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. తన ఫోన్ ఇవ్వాలని కోరిన శ్రీనివాస్ పై సురేష్ అనుచరులు దాడి కూడా చేసినట్లు తెలుస్తోంది. ఆ ముగ్గురు యువకుల్లో ఒకరు సురేష్ మేనల్లుడని తెలుస్తోంది.
విజయవాడలోని ఓ మల్టిప్లెక్స్ లో సినిమా చూసి వస్తున్న ముగ్గురు యువకులు బైకుపై అతివేగంగా వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్న ఆ ముగ్గురినీ ఆపిన కృష్ణలంక పోలీసులు..వారిని ప్రశ్నించారు. అయితే, తాము ఎంపీ నందిగం సురేష్ మనుషులమని పోలీసులడిగిన ప్రశ్నలకు జవాబివ్వకుండా…ఆ యువకులు దురుసుగా ప్రవర్తించారు. దీంతో, ఆ యువకులను బలవంతంగా కృష్ణలంక పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే, ఆ తతంగాన్ని వీడియో తీసిన యువకులు…దానిని నందిగం సురేష్కు పంపించారు.
దీంతో, అర్ధరాత్రి హుటాహుటిన తన అనుచరులతో కలిసి ఎంపీ నందిగం సురేష్ కృష్ణలంక పీఎస్కు వచ్చి హల్ చల్ చేశారు. తన అనుచరులను పీఎస్కు ఎందుకు తీసుకొచ్చారంటూ చిందులు తొక్కారు. వారిపై ఎందుకు చేయి చేసుకున్నారంటూ నానా హంగామా చేశారు. పోలీసులతో నందిగం సురేష్, ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగి దురుసుగా ప్రవర్తించారు. దీంతో, ఆ తతంగాన్ని రికార్డ్ చేస్తున్న కానిస్టేబుల్ శ్రీనివాస్ ఫోన్ ను సురేష్ అనుచరులు లాక్కున్నారు. అంతటితో ఆగకుండా…స్టేషన్ లోని ఫర్నిచర్ ను సురేష్ అనుచరులు ధ్వసం చేసి పీఎస్ నుంచి వెళ్లిపోయారు.
ఆ సమయంలో తన ఫోన్ తిరిగివ్వాలని ఎంపీ అనుచరులను కానిస్టేబుల్ శ్రీనివాస్ కోరగా, అతడిపై వారు దాడి చేసి అక్కడినుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయం బయటకు పొక్కుండా పోలీసు ఉన్నతాధికారులు యత్నిస్తున్నారని తెలుస్తోంది. అయితే, ఈ వ్యవహారం ఆల్రెడీ సోషల్ మీడియా, మీడియాలో లీక్ కావడంతో ఏం చేయాలా అని ఉన్నతాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారని తెలుస్తోంది.
This post was last modified on February 16, 2022 4:14 pm
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారని వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపిన సీబీఐ తాజాగా సుప్రీం…
ఫరియా అబ్దుల్లా అంటే మనందరికీ 'జాతిరత్నాలు' సినిమాలోని చిట్టినే గుర్తొస్తుంది. ఆ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ…
దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే…
బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఊహించని విధంగా కుప్పకూలాయి. గత రెండు రోజులుగా సాగుతున్న ఈ పతనం శనివారం…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ వేడి పెరుగుతోంది. 16వ శాసనసభ ఐదో సమావేశాలు ఫిబ్రవరి 11 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ…
తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. విచారణ పరిధి క్రమంగా ఉన్నతాధికారుల వరకు విస్తరిస్తోంది. ఈ…