రాష్ట్రంలో అనధికార కోతలు అమలు అవుతున్నాయి. ఇదివరకు కోతలు విధించేటప్పుడు సంబంధిత సంస్థల నుంచి ముందస్తు సమాచారం వినియోగదారులకు అందేది. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయిపోయింది.కరెంట్ ఎప్పుడు ఉంటుందో, ఉండదో కూడా తెలియని సందిగ్ధత నెలకొని ఉంది.ముఖ్యంగా రెండు రంగాలను ప్రభుత్వం తప్పనిసరిగా ఆదుకోవాల్సి ఉంది. ఒకటి వ్యవసాయ రంగం,రెండు పారిశ్రామిక రంగం. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరాలో ఎప్పటికప్పుడు కోతలు వస్తూనే ఉన్నాయి.
అనధికార కోతల కారణంగా గ్రామీణ ఆంధ్రావని ఇబ్బందులు పడుతూనే ఉంది. లోడ్ రిలీఫ్ పేరిట తీసుకు వచ్చిన నిబంధనల కారణంగా విద్యుత్ సరఫరా అన్నది ఎప్పటికప్పుడు నిలిచిపోతోంది.ముఖ్యంగా సరఫరా కన్నావాడకం ఎక్కువగా ఉంటోంది.దాంతో నగర ప్రాంతాలలో కూడా విద్యుత్ కోతలు తప్పనిసరిగా చేయాల్సి వస్తోందని, పొదుపునకు తాము సూచనలు చేస్తూ ఉన్నా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని సంబంధిత అధికారులు వాపోతున్నారు.
ముఖ్యంగా బొగ్గు నిల్వలు లేకపోవడం,దాంతో థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అనుకున్న విధంగా ఉత్పత్తి ఇవ్వలేకపోతున్నాయి. జెన్కో ప్లాంట్లకు ప్రధానంగా ఇదే సమస్యగా పరిణమిస్తోంది.మరోవైపు ఉత్పత్తి సంస్థలకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడం కూడా మరో కారణంగా పరిణమిస్తోంది.
ఎన్టీపీసీఎల్ కు 300 కోట్లు ఇవ్వాల్సి ఉంటే కనీసం 30 కోట్లు సర్దుబాటు చేయమన్నా చేయలేకపోయింది జగన్ సర్కారు.దీంతో ఉత్పత్తి కేంద్రాల నుంచి ఆశించిన రీతిలో ఆంధ్రాకు సరఫరా లేదు.ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణ విద్యుత్ కోతలను సులువుగా అధిగమించింది.అదేవిధంగా వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకూ సజావుగానే సరఫరా ఇవ్వగలుగుతోంది.కోతల నివారణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టినా నిధుల లేమి కారణంగా ఆ మాట పైకి చెప్పలేక వైసీపీ ఫెయిల్ అవుతోంది.
This post was last modified on February 15, 2022 1:57 pm
గిరిజన ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాలపై జనసేన ఉక్కుపిడికిలి బిగిస్తోంది. ఇటీవల కాలంలో ఆయా నియోజకవర్గాలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్…
బీఆర్ఎస్ నాయకుడు, మాటల తూటాలను తనదైన శైలిలో ఎటైనా తిప్పగల నేర్పరిగా పేరొందిన నేత.. అన్నింటికీ మించి `అందరివాడు`గా గుర్తింపు…
వెండితెరపై సినిమా చూసే అనుభూతి మారుతోంది. ఒకప్పుడు తెల్లని తెరలు కట్టి ప్రింట్లు ఎంత మసకగా ఉన్నా, లైన్లు కనిపించి…
కష్టం ఎదురైనప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోరాడే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రానికి చెందిన 78 ఏళ్ల…
మహిళల మీద వివిధ రంగాల్లో జరుగుతున్న లైంగిక వేధింపులు, అఘాయిత్యాల మీద కొన్నేళ్ల ముందు మొదలైన ‘మీ టూ’ ఉద్యమాన్ని…
రెండేళ్ల గ్యాప్ తర్వాత సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక.. వరుసగా రీమేక్ సినిమాలే చేస్తూ వచ్చాడు పవర్ స్టార్ పవన్…