Political News

హోదాపై తోక ముడుస్తారా? చంద్ర‌బాబు ఫైర్‌

ప్రత్యేక హోదాపై యుద్ధం చేయకుండా.. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తోడ‌ముడిచార‌ని.. టీడీపీ అధినేత చంద్రబాబు దుయ్య‌బ‌ట్టారు. ప్రత్యేక హోదా కోసం ఎంపీల రాజీనామాలంటూ నాడు చేసిన సవాళ్లు ఏమయ్యాయో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీ ముఖ్య నేతలతో వ్యూహకమిటీ సమావేశం నిర్వహించిన చంద్రబాబు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. కేంద్ర హోంశాఖ అజెండాలో హోదా అంశం పేర్కొన‌డాన్ని తమ ఘనతగా చెప్పుకున్న వైసీపీ నేతలు.. అజెండా నుంచి దానిని తీసేయ‌గానే.. దీనిని టీడీపీకి ముడిపెట్టి బురద చల్లడమేంటని చంద్రబాబు ధ్వజమెత్తారు.

రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా తెస్తామ‌ని.. ఎంపీల‌ను ఇవ్వండ‌ని ప్ర‌జ‌ల‌ను వేడుకున్న జ‌గ‌న్‌రెడ్డి.. ఇప్పుడు ఏం చెబుతార‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌త్యేక హోదా కాదు క‌దా.. క‌నీసం.. కేంద్రం నుంచి వ‌న‌రులు కూడా ద‌క్కించుకోలేక పోతున్నార‌నిబాబు విమ‌ర్శించారు. రాష్ట్ర ఆదాయం తగ్గకపోయినా.. ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలకంటే దారుణంగా ఏపీని దిగజార్చారని ఆగ్రహ వ్యక్తం చేశారు. అప్పులు పెరిగిపోతున్నా.. జ‌గ‌న్‌రెడ్డికి చీమ‌కుట్టిన‌ట్టు కూడా లేద‌ని.. బాబు విమ‌ర్శించారు. ఇంత అప్పులు చేసిన రాష్ట్రం దేశంలో ఎక్క‌డా లేద‌న్నారు. క‌నీసం.. అప్పులు పెరిగిపోతున్నాయి.. వీటిని ఎలా తీరుద్దామ‌నే స్పృహ కూడా ఈ ముఖ్య‌మంత్రికి లేకుండా పోయింద‌ని.. దుయ్య‌బట్టారు.

చేసిన అప్పులు ఎలా తీరుస్తారో.. ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌ని.. చంద్ర‌బాబు డిమాండ్ చేశారు. లేని సమస్యను సృష్టించి జగన్ సినిమా హీరోలను ఘోరంగా అవమానించారన్న చంద్రబాబు.. స్వశక్తితో ఎదిగిన మెగాస్టార్ చిరంజీవి లాంటి వారు జగన్ను ప్రాధేయపడలా అని ఆక్షేపించారు. ప్రపంచ స్థాయికి ఎదిగిన తెలుగు సినిమా పరిశ్రమను కించపరిచారని దుయ్యబట్టారు. గ్రామాల్లో విద్యార్థులకు బడులను దూరం చెయ్యడమే నాడు-నేడు పథకమని విమర్శించారు.

పేదలకు చేరాల్సిన నరేగా పనుల్లో వైసీపీ అవినీతిపై టీడీపీ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో సక్రమంగా విద్యుత్ సరఫరా లేకపోయినా.. అధిక బిల్లులు వస్తుండటాన్ని తప్పుపట్టారు. విశాఖ ఉక్కుపై ఎందుకు చేతులు కట్టుకుని కూర్చున్నాడో జగన్ చెప్పాలని డిమాండ్ చేశారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగింపును ప్రభుత్వం నిలిపివేయ్యాలన్నారు. పొరుగున ఉన్న తెలంగాణ ప్ర‌భుత్వం కేంద్రానికి త‌ల వంచేది లేద‌ని చెబుతుంటే.. ఏపీ ప్ర‌బుత్వం మాత్రం పాద‌సేవ చేస్తోంద‌ని వ్యాఖ్యానించారు. రైతుల‌కు మీట‌ర్లు పెట్ట‌డం వెనుక కేంద్రానికి లొంగిపోవ‌డ‌మే ఉంద‌న్నారు. ప్ర‌తి విష‌యాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేం దుకు ప్రాధాన్యం ఇస్తున్న జ‌గ‌న్‌రెడ్డి.. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను మాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదేన్నారు.

This post was last modified on February 15, 2022 10:15 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

పర్ఫెక్షన్లో రాక్షసుడు జక్కన్న

బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…

18 minutes ago

కర్ణాటకలో తెలుగు కనపడకూడదా?

కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…

3 hours ago

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

4 hours ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

5 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

6 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

6 hours ago