Political News

వ్యూహ‌క‌ర్త‌ను మార్చిన బాబు.. ఇక ప‌రుగులేనా?

తెలుగు దేశం పార్టీ మ‌నుగ‌డ కోసం త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్ కోసం మాజీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడికి వ‌చ్చే ఏపీ ఎన్నిక‌ల్లో విజ‌యం అవ‌స‌రం. లేదంటూ ఆయ‌న రాజ‌కీయ కెరీర్కు ముగింపు ప‌డుతుంది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల‌కు మ‌రో రెండేళ్ల స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచే ఆయ‌న పార్టీని ఆ దిశ‌గా సిద్ధం చేస్తున్నారు. నియోజ‌వ‌కవర్గాల వారీగా ఇంఛార్జీల‌ను నియ‌మిస్తూ సాగుతున్నారు. అయితే తాజాగా ఆయ‌న త‌న ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త‌ను మార్చార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న రాబిన్ శ‌ర్మ స్థానంలో ప్ర‌శాంత్ కిషోర్ టీంలోని సునీల్‌ను తీసుకున్నార‌ని చెబుతున్నారు.

కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇప్ప‌టివ‌ర‌కూ బాబు ఇంఛార్జీల‌ను నియ‌మించ‌లేదు. అక్క‌డ యువ‌కుల‌కు అవ‌కాశం ఇద్దామ‌నే ఆలోచ‌న‌లో ఆయ‌న ఉన్న‌ట్లు తెలిసింది. ఆర్థిక‌, సామాజిక ప‌రంగా అన్ని విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని ఆయ‌న ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంఛార్జీల‌ను నియ‌మించ‌నున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు చేస్తూ ఈ ఎంపిక‌లు చేస్తున్నారు. యువ‌కులైతే ఈ రెండేళ్ల పాటు పార్టీని నియోజ‌క‌వ‌ర్గాల్లో ధైర్యంగా న‌డ‌ప‌గ‌ల‌ర‌ని ఆయ‌న న‌మ్ముతున్నార‌ని స‌మాచారం. అందుకే త్యాగాల‌కు సిద్ధంగా ఉండాల‌ని సీనియ‌ర్లుకు సంకేతాలిచ్చార‌ని టాక్‌.

ఇక గ‌త ఎన్నిక‌ల‌కు ముందు రాబిన్ శ‌ర్మ టీంతో ఒప్పందం కుదుర్చుకున్న చంద్ర‌బాబు.. ఇప్పుడు మ‌న‌సు మార్చుకున్నార‌ని తెలిసింది. గ‌త కొన్ని నెల‌లుగా రాబిన్ శ‌ర్మ టీం నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌ర్వేలు నిర్వ‌హిస్తోంది. కానీ వాటిపై నమ్మ‌కం లేక‌నే బాబు తాజాగా ప్ర‌శాంత్ కిషోర్ టీమ్‌లోని సునీల్‌తో ఒప్పందం చేసుకున్నార‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి.

దీంతో ఈ వ్యూహ‌క‌ర్త ఎలా వ్య‌వ‌హ‌రిస్తారో అనేదానిపై పార్టీ నేత‌ల్లో టెన్ష‌న్ వ్య‌క్త‌మ‌వుతున్న‌ట్లు తెలిసింది. మ‌రోవైపు ఏపీలో గ‌త ఎన్నిక‌ల్లో గెలిచి జ‌గ‌న్ అధికారంలోకి రావ‌డంలో పీకే కీల‌క పాత్ర పోషించారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న జ‌గ‌న్తో క‌లిసి పనిచేసే అవ‌కాశం ఉంది. ఈ నేప‌థ్యంలో పీకే టీమ్‌కే చెందిన సునీల్‌తో బాబు ఒప్పందం చేసుకోవడం ఏమిట‌నే ప్ర‌శ్న‌లు వినిపిస్తున్నాయి. దీనిపై స్ప‌ష్ట‌త రావాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే. 

This post was last modified on February 15, 2022 8:50 am

Share

Recent Posts

పీకే విక్టరీ బీజేపీకి డేంజర్ బెల్స్ మోగించినట్టేనా?

బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…

8 minutes ago

40 నిముషాల్లోనే శ్రీవారి దర్శనం… కేవలం వారికే!

నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…

4 hours ago

జంతర్ మంతర్ కు చెక్ ?

దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…

8 hours ago

సత్య హాస్యం చాలా ప్లస్ అవుతోంది

గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…

8 hours ago

వెంక‌ట‌ప్ప ఫెయిల్… ఇక మాలిక్ ఏం చేస్తాడో?

తెలుగు సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత గొప్ప న‌టుల జాబితా తీస్తే.. అందులో పైవ‌రుస‌లో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒక‌రు.…

9 hours ago

పీకే ఇక ఎమ్మెల్యే సాబ్!

ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…

9 hours ago