Political News

ప్రభుత్వ వీళ్ళని పట్టించుకుంటుందా ?

పీఆర్సీకి సంబంధించి 27 శాతం ఫిట్మెంట్ కోసం ఉపాధ్యాయ సంఘాలు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సంఘాలు చేస్తున్న ఆందోళనను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదు. మెరుగైన ఫిట్మెంట్ సాధించాల్సిందే అనే టార్గెట్ తో పై సంఘాలన్నీ ఉద్యమ కార్యాచరణను ప్రకటించాయి. ఫిబ్రవరి 15-28 తేదీల్లో దశలవారీగా ఆందోళనలు, నిరసనలు చేయాలని డిసైడ్ అయ్యాయి. మార్చిలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటపుడు చలో విజయవాడ కార్యక్రమాన్ని పెట్టుకోవాలని కూడా నిర్ణయించాయి.

సరే వీళ్ళ కార్యాచరణ వీళ్ళిష్టమే అనటంలో సందేహం లేదు. అయితే వీళ్ళని ప్రభుత్వం అసలు పట్టించుకుంటోందా అనేది సందేహం. ఎందుకంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు అంత పెద్దఎత్తున ఆందోళనలు, నిరసనలు చేశారు. ఫిబ్రవరి 3వ తేదీన చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతంగా ముగించారు. ఇంతచేసినా ప్రభుత్వం వీళ్ళ డిమాండ్లకు తలొంచలేదు. వీళ్ళెంత బెదిరించినా బెదరలేదు. మంత్రులు, ఉన్నతాధికారులతో కమిటి వేసి వాళ్ళతోనే చర్చించమని జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు.

మంత్రుల కమిటినే పదే పదే పీఆర్సీ సాధన సమితి నేతలను చర్చలకు పిలిచిందే కానీ ప్రభుత్వం మాత్రం వీళ్ళ డిమాండ్లు నెరవేర్చేందుకు దిగిరాలేదు. చివరకు ఐఆర్ రికవరీ చేసేదిలేదని, హెచ్ఆర్ఏ శ్లాబులను సవరించిందే కానీ ఫిట్మెంట్ ను మాత్రం 23కి మించి పెంచేది లేదని తెగేసి చెప్పేసింది. చివరకు ఒకటకి రెండుసార్లు చర్చలు జరిగి సమ్మె విరమించుకుంటున్నట్లు పీఆర్సీ సాధన సమితి నేతలు ప్రకటించాల్సొచ్చింది. వీళ్ళు సమ్మె విరమించుకునేందుకు న్యాయస్దానం చేసిన వ్యాఖ్యలు కూడా కారణమయ్యాయి. సమ్మె చేసే హక్కు ఉద్యోగులకు లేదని, రాష్ట్రప్రభుత్వ ఆర్ధిక పరిస్ధితి ప్రకారమే జీతాలు పెరుగుదల ఉంటుందని కోర్టు స్పష్టంగా చెప్పేసింది.

పైగా సమ్మెలోకి వెళ్ళే ఉద్యోగులపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఉందని తేల్చిచెప్పింది. ఇదే సమయంలో సమాజంలోని ఏ వర్గం కూడా వీళ్ళ సమ్మెకు మద్దతుగా నిలవలేదు. దాంతో పరిస్దితిని అర్ధం చేసుకున్న పీఆర్సీ సాధన సమితి నేతలు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లోనే ఉద్యోగుల డిమాండ్లను పట్టించుకోని ప్రభుత్వం ఇపుడు ఉపాధ్యాయులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమ్మెను పట్టించుకుంటుందా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జీతాలు తగ్గుతాయంటే అర్ధముంది కానీ ఏదో రూపంలో పెరిగిన జీతాలు అందుకుని కూడా సమ్మెంటే విచిత్రంగా ఉంది. 

This post was last modified on February 14, 2022 12:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

5 minutes ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

35 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

2 hours ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago