తెలంగాణ సీఎం కేసీఆర్కు ఎవరైనా కోపం తెప్పిస్తే.. ఆయన ఎంతవరకైనా వెళ్తారు. ప్రత్యర్థిని దారికి తెచ్చుకోవడమో లేదా ఇబ్బందుల్లోకి నెట్టడమో చేస్తుంటారు. కానీ అదే ఎవరిపైనా అయినా ప్రేమ వస్తే మాత్రం అడగకుండానే వరాలు ఇచ్చేస్తారు. అధిక ప్రయోజనాలు కట్టబెడతారు. కేసీఆర్ గురించి తెలిసిన ఎవరైనా ఆయన తీరు గురించి ఇలాగే చెప్తారనడంలో సందేహం లేదు. మరి ఇప్పుడు ఆ విషయం గురించి ఎందుకు అంటారా? జిల్లాల పర్యటనలో ఉన్న కేసీఆర్.. రోజుకో దగ్గర భారీ బహిరంగ సభ పెట్టి కేంద్రంలోని బీజేపీపై మాటల యుద్ధం చేస్తున్నారు. ఆ క్రమంలోనే తాజాగా కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీకి మద్దతుగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.
ఆ ఎన్నికలతో..
ప్రస్తుతం దేశంలో అయిదు రాష్ట్రాల ఎన్నికలతో రాజకీయాలు హీటెక్కాయి. దేశంలో ఎక్కడా ఏ పరిణామం జరిగినా దాన్ని ఈ ఎన్నికలతో ముడిపెట్టి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈ ఎన్నికల్లో ఆధిపత్యం కోసం కాంగ్రెస్, బీజేపీ తీవ్రంగా పోరాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీపై కాంగ్రెస్ నాయకులు.. కాంగ్రెస్పై బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నాయి.
ఈ క్రమంలో రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ బీజేపీ సీఎం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తామెప్పుడైనా రాహుల్ గాంధీ పుట్టుక గురించి మాట్లాడామా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2016లో భారత్ జరిపిన సర్జికల్ స్ట్రైక్స్పై రాహుల్ ఆధారాలు అడిగారు.. కానీ తామెప్పుడైనా రాహుల్ గాంధీ వ్యక్తిగత విషయాల గురించి అడిగామా అని హిమంత అన్నారు. రాహుల్ ఎవరికి పుట్టారో సాక్షం కావాలని అడిగామా అంటూ ప్రశ్నించారు.
కన్నీళ్లు వస్తున్నాయి..
రాహుల్ గాంధీపై బీజేపీ సీఎం హిమంత బిశ్వశర్మ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపాయి. తాజాగా రాయగిరి సభలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ల కుటుంబం గురించి ఇలాగైనా మాట్లాడేదని మండిపడ్డారు. ఆ వ్యాఖ్యలు తనను కలిచివేశాయని కళ్ల నుంచి కన్నీళ్లు వస్తున్నాయని అన్నారు. ధర్మం గురించి మాట్లాడే బీజేపీకి ధర్మం అంటే ఇదేనా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిమంతను తక్షణమే బర్తరఫ్ చేయాలని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కేసీఆర్ డిమాండ్ చేశారు. దేశంలో ఎవరికి అన్యాయం చేసినా సహించేది లేదన్నారు. కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్పై ప్రేమ పుట్టుకురావడానికి కారణం మోడీపై కోపమేనని విశ్లేషకులు అంటున్నారు. మరోవైపు రాహుల్ గాంధీకి మద్దతుగా మాట్లాడడంతో రాష్ట్రంలో ఆ పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టినట్లయిందని నిపుణులు చెబుతున్నారు.
This post was last modified on February 14, 2022 9:23 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…