సీనియర్ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి కొంత కాలంగా సినిమా కార్యక్రమాలకు, మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ మధ్య ఆయనకు సినిమాలు కూడా తగ్గినట్లుగా కనిపిస్తోంది. చాన్నాళ్లకు ఆయన తాను కీలక పాత్ర పోషించిన సన్ ఆఫ్ ఇండియా ప్రి రిలీజ్ ఈవెంట్కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తున్నపుడు చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం రేపాయి.
సంబంధిత వీడియోలు రెండు రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. సినీ పరిశ్రమకు సంబంధించి కొంత వైరాగ్య ధోరణిలో మాట్లాడారు పోసాని. అంతే కాక తెలుగు సినీ పరిశ్రమ తనను బహిష్కరించిందన్న కోణంలో ఆయన మాట్లాడటం గమనార్హం. వందల సినిమాలకు పని చేసిన పరుచూరి సోదరులనే దూరం పెట్టిన ఇండస్ట్రీ ఇదని.. అలాగే ఆత్రేయ లాంటి దిగ్గజాన్ని కూడా దూరం పెట్టారని.. వీళ్లలాగా బతకకూడదని తాను నేర్చుకున్నానని పోసాని వ్యాఖ్యానించారు.
తెలుగు సినిమా పరిశ్రమ తనను బహిష్కరించినా.. తన తర్వాతి తరాలు కూడా బతికేంత సంపాదించుకున్నానని.. దేవుడు తనకు అన్నీ ఇచ్చాడని.. సినీ పరిశ్రమ నుంచి తాను ఇప్పుడు ఏమీ ఆశించడం లేదని.. ఇది తనకు బోనస్ అని ఆయన అన్నారు. పోసాని మాటల్ని బట్టి చూస్తే.. తనను ఉద్దేశపూర్వకంగా సినిమాల నుంచి పక్కన పెడుతున్నారనే అర్థం ధ్వనిస్తోంది. గత ఏడాది జనసేనాని పవన్ కళ్యాణ్ మీద ఆయన చేసిన తీవ్ర వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఏపీ సీఎం జగన్ను విమర్శించినందుకు పోసాని ప్రెస్ మీట్ పెట్టి పవన్ను విమర్శించడం.. ఆ తర్వాత పవన్ అభిమానులు తనను బెదిరించినందుకు మళ్లీ ప్రెస్ మీట్ పెట్టి పవన్ మీద వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో దూషణలకు దిగడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలో పోసానికి అవకాశాలు తగ్గినట్లుగా కనిపిస్తోంది. తనను కావాలనే దూరం పెడుతున్నారన్న ఉద్దేశంతో పోసాని ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా కనిపిస్తోంది.
This post was last modified on February 14, 2022 8:59 am
ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…
కొందరు నటులు తరచుగా సినిమాల్లో కనిపిస్తుంటారు. చాలా ఫెమిలియర్గా అనిపిస్తారు. కానీ ఆ నటుల పేరేంటో కూడా జనాలకు గుర్తుండదు.…
చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…
సినిమాలకు టైటిళ్లు పెట్టడంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టైలే వేరు. స్టార్ హీరోల సినిమాలకు సైతం, క్లాస్గా, కొంచెం పొయెటిగ్గా, ఫ్యామిలీ…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ భారీ విజయం సాధించిన ఉత్సాహంలో ఉన్నారు మెగాస్టార్ చిరంజీవి. దీనికి తోడు చరణ్కు…
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారం.. కీలక మలుపు తిరిగింది. ఈ కల్తీ వ్యవహారంపై విచారణ…