Political News

మోడీ.. దేశం నీ అబ్బ సొత్తా: నిప్పులు చెరిగిన కేసీఆర్‌

కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారుపై తెలంగాణ సీఎం కేసీఆర్ మ‌రోసారి రెచ్చిపోయారు. మోడీ అవినీతి ప‌రుడ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న అవినీతి చిట్టా త‌న ద‌గ్గ‌ర ఉంద‌ని చెప్పారు. ప్రధాని మోడీ ప్రభుత్వానికి పిచ్చి ముదురుతోందని సీఎం దుయ్యబట్టారు. యాదాద్రి జిల్లాలో కేసీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. పిచ్చి పిచ్చి పాలసీలు తీసుకొస్తున్నారని తప్పుబట్టారు. ‘‘మోడీ దేశం నీ అబ్బ సొత్తు కాదు. లాఠీ, లూటీ, మతపిచ్చి.. ఇదే బీజేపీ సిద్ధాంతం. ప్రజా సమస్యలను పక్కనపెట్టి..మత రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టాలి“ అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

దేశం ఆక‌లి రాజ్యం
మోడీ చేతగానితనం వల్లే దేశంలో కరెంట్‌ కోతలు, నీళ్ల తగాదాలు వస్తున్నాయన్నారు.  అన్నిరంగాల్లో తెలంగాణ అభివృద్ధి చెందుతోందని అన్నారు. రైతుబంధుతో గ్రామాలు పచ్చబడ్డాయని కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులకు సంబంధించి చిన్న చిన్న సమస్యలున్నాయన్న ఆయ‌న‌ 40 ఏళ్లపాటు పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రూల్స్ సరళీకరిస్తామ‌ని  కేసీఆర్ ప్రకటించారు. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ఆకలి రాజ్యాల జాబితాలో భారత్‌ 101వ స్థానంలో ఉందని పేర్కొన్నారు. మోడీ పాలనలో దేశాన్ని ఆకలిరాజ్యంగా మార్చారని ఆరోపించారు.  

కుక్క‌మూతి పిందెలు!
మోడీ పాలనలో దేశాన్ని ఆకలి రాజ్యంగా మార్చారు. కరోనా సమయంలో మోడీ తెలివితక్కువ లాక్‌డౌన్‌ నిర్ణయం వల్ల కోట్లాది మంది ఇబ్బందులు పడ్డారు. కేంద్రంలో జరిగే అవినీతి బాగోతాల చిట్టా నాకు అందింది. నిన్నే మమతా బెనర్జీ , మొన్న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే మాట్లాడారు. కేంద్రంపై అందరం కలిసి పోరాటం చేయాలి. నిన్న జనగామలో మాట్లాడితే బీజేపీ నేతలు.. నువ్వెంత అని నన్ను విమర్శిస్తున్నారని కేసీఆర్ అన్నారు. తెలంగాణ సమాజం మేల్కొనాలి.. దొంగలతో పోరాటం చేయాలని అన్నారు. దేశ రాజకీయాల్లో మొలిచిన కుక్కమూతి పిందె ఈ బీజేపీ అని దుయ్య‌బ‌ట్టారు. ఈ దరిద్రాన్ని ఎంత తొందరగా వదిలించుకుంటేనే.. ఈ దేశానికి అంతా మంచి జరుగుతుందన్నారు. దేశమంతా తిరిగి అన్ని భాషల్లో వీరి బాగోతాలు చెబుతాన‌ని కేసీఆర్ చెప్పారు.

రాహుల్‌కు మ‌ద్ద‌తు
రాహుల్‌ గాంధీ నాన్న, నాయనమ్మ దేశం కోసం అమరులయ్యారని కేసీఆర్‌ గుర్తు చేశారు. రాహుల్‌ గాంధీ గురించి అసోం సీఎం అసభ్యంగా మాట్లాడతారా? అని మండిపడ్డారు. రాహుల్‌ను ఉద్దేశించి అసోం సీఎం చేసిన వ్యాఖ్యలు తనను కలచి వేశాయని వెల్లండించారు. మోడీ గారు.. అసోం సీఎం చేసిన వ్యాఖ్యలే మీ సంస్కారమా? అని ప్రశ్నించారు. అసోం ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్‌ చేయాలని డిమాండ్ చేశారు. ధర్మాన్ని, నిజాన్ని కాపాడేందుకు తెలంగాణ సమాజం పులిలా కొట్లాడుతుందని ప్రకటించారు. కేంద్రం అన్ని రంగాల్లో విఫలమైందని కేసీఆర్ అన్నారు.

Satya

Recent Posts

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

1 hour ago

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

4 hours ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

5 hours ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

5 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

5 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

6 hours ago