ప్రస్తుతం దేశవ్యాప్తంగా అందరి దృష్టి అయిదు రాష్ట్రాల ఎన్నికలపై ఉంది. ముఖ్యంగా దేశ రాజకీయాల్లో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇప్పటికే అక్కడ తొలి దశ పోలింగ్ కూడా పూర్తయింది. అధికారం నిలబెట్టుకోవడం కోసం బీజేపీ, గద్దెనెక్కడం కోసం కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో పార్టీల విజయ సమీకరణాలు మార్చేంతలా చిన్నపార్టీలు ప్రభావం చూపే అవకాశం ఉంది. చిన్న పార్టీలే కదా అని తేలిగ్గా తీసేయడానికి వీల్లేదు. అవే చివరకు కొంప ముంచుతాయని విశ్లేషకులు అంటున్నారు.
ఆ సమీకరణాలతో..
యూపీలో కుల మతాల సమీకరణాలే ప్రధాన కారణాలుగా చిన్ని పార్టీలు పుట్టుకొచ్చాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ప్రధానంగా ఎంబీసీల నుంచి పటు చిన్న పార్టీలు ఆవిర్భవించాయి. ముఖ్యంగా 1989 నుంచి రాష్ట్రంలో చిన్న, మధ్యస్థాయి పార్టీల సంఖ్య వేగంగా పెరుగుతూ వచ్చింది. 1991 అసెంబ్లీ ఎన్నికల నుంచి ఆయా పార్టీలకు వస్తున్న ఓట్ల శాతంలోనూ గణనీయ పెరుగుదల కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ అప్నాదళ్ (ఎస్), నిషాద్ పార్టీ, ఎస్బీఎస్పీలు చిన్నపార్టీల్లో ప్రముఖమైనవిగా కనిపిస్తున్నాయి.
పొత్తు అనివార్యం..
రాష్ట్రంలో అధికారం కోసం పోరాడే ప్రధాన పార్టీలు ఈ చిన్న పార్టీలతో పొత్తు పెట్టుకోవడం అనివార్యంగా మారింది. ఆయా సామాజిక వర్గాల్లో ఈ చిన్న పార్టీలు చూపించే ప్రభావమే అందుకు కారణం. 2017 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అప్నాదళ్, సుహెల్దేవ్ రాజ్భర్ భారతీయ సమాజ్ పార్టీ (ఎస్బీఎస్పీ)లతో పొత్తు బీజేపీకి బాగా కలిసొచ్చింది. ప్రధానంగా ఎంబీసీల ఓట్లను పొందడంలో ఆ రెండు పార్టీలు బీజేపీకి అండగా నిలిచాయి. కానీ ఈ ఎన్నికల నాటికి పరిస్థితులు మారిపోయాయి. ఎస్బీఎస్పీ పార్టీ సమాజ్వాదీ పార్టీ కూటమిలో చేరింది. అప్నాదళ్లోని ఓ చీలికవర్గంతో పాటు మరికొన్ని చిన్నపార్టీలతో కలిసి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ చేతులు కలిపారు.
గత ఎన్నికల్లో ఫలితాల ఆధారంగా అఖిలేష్ ఇలా చిన్న పార్టీలకు ప్రాధాన్యత ఇచ్చారని విశ్లేషకులు అంటున్నారు. ఈ సారి బీజేపీ.. నిషాద్ పార్టీ, అప్నాదళ్తో కలిసి ఎన్నికలకు సిద్ధమైంది. ఆ చిన్న పార్టీల గుర్తులపై బీజేపీ అభ్యర్థులు పోటీ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో అర్థమవుతోంది. గత ఎన్నికల్లో దాదాపు 289 చిన్న పార్టీలు పోటీ చేశాయని సమాచారం.
This post was last modified on February 12, 2022 2:47 pm
ఈ ఏడాది సంక్రాంతి సినిమాల సందడితో ఎంతో ఆశాజనకంగా మొదలైన టాలీవుడ్ బాక్సాఫీస్.. ఆ తర్వాత ఎంత వెలవెలబోయిందో తెలిసిందే.…
ఏపీలో ప్రభుత్వ పాఠశాలలు సత్తా చాటాయి. రెండు రోజుల క్రితం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో సర్కారీ బడులకు చెందిన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. తన ఆధ్వర్యంలోని పంచాయితీ రాజ్ శాఖలో గత రెండేళ్లలో ఎన్నో మంచి కార్యక్రమాలు…
భారతీయ సినిమాలు ఆస్కార్ సాధించడం దశాబ్దాల కలగా మిగిలిపోయింది. అడపాదడపా ఎప్పుడో ఒకసారి తప్పించి ప్రతి సంవత్సరం దాన్ని అందుకునే…
నిన్న రిలీజైన కొత్త సినిమాలు ఏ దిశకు వెళ్తున్నాయో ఓపెనింగ్స్, పబ్లిక్ టాక్స్ స్పష్టం చేస్తున్నాయి. పూర్తి క్లారిటీ సోమవారానికి…
కెరీర్ ప్రారంభంలో రజనీకాంత్ అల్లుడిగా ఎక్కువ గుర్తింపు ఉన్నా చాలా తక్కువ టైంలో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ తెచ్చుకున్న హీరోగా…