Political News

తెలంగాణ నేత‌ల్లారా పుణ్యం క‌ట్టుకోండి… ష‌ర్మిల కీల‌క ప్ర‌క‌ట‌న‌

గ‌త కొద్దికాలంగా రాజ‌కీయంగా స్త‌బ్ధుగా ఉన్న వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల మ‌ళ్లీ తెలంగాణ రాజ‌కీయాల్లోని ప‌రిణామాల‌పై మ‌ళ్లీ స్పందిస్తున్నారు. తాజాగా తెలంగాణలోని పొలిటిక‌ల్ హీట్ పై , ముఖ్య‌మంత్రి కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ మాట తప్పే మనిషి కాదని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. దొర ఇచ్చిన మాట కోసం తల నరుక్కుంటాడు తప్పితే మాట తప్పే మనిషి కాదని వ్యంగ్యంగా కామెంట్ చేశారు. అయితే, అన్నీ కోర్టులే గుర్తు చేయాల‌ని కామెంట్ చేశారు.

ఏడు సంవ‌త్స‌రాల కింద సూసైడ్ చేసుకున్న 133 మంది రైతులకు ఇప్పటిదాకా ఎక్స్ గ్రేషియా ఇవ్వలేదని ష‌ర్మిల‌ దుయ్యబట్టారు. రూ.6 లక్షలు ఇస్తామని 2015లో ఇచ్చిన జీవో కాగితాలకే పరిమితమైందని.. రైతు కుటుంబాలకు ఇప్పటివరకు పరిహారం అందలేదని మండిపడ్డారు.

Shrmila‘దొరకు కోర్టులు మొట్టికాయలు వేస్తేకానీ ఇచ్చిన జీవో గుర్తుకురాదు. కరోనా టెస్టులు పెంచాలని, టీఎస్పీఎస్సీ సభ్యులను భర్తీ చేయాలని, రాష్ట్రంలో కమిషన్లను ఏర్పాటు చేయండని, ఆఖరికి చనిపోయిన రైతులను ఆదుకోవాలని కోర్టులే చెప్పాలి’ అని షర్మిల పేర్కొన్నారు. కోర్టులు చెబితేకానీ బాధ్యతలు గుర్తుకురాని ఈ చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దని ఆమె విమర్శించారు.

తెలంగాణలో చావులు లేకుండా చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉందని వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల అన్నారు. తెలంగాణ ఇచ్చిన వారికైనా.. తెలంగాణ తెచ్చిన వారికైనా ఆ పుణ్యం దక్కాలంటే రాష్ట్రంలో చావులు లేకుండా చూడాలన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన వారికైనా, ఎవరికైనా తెలంగాణ సాధించిన పుణ్యం దక్కాలంటే.. సాధించిన తెలంగాణాలో చావులు లేకుండా చూడాలని ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యల గురించి పట్టించుకోని వారు.. తెలంగాణ ఎలా ఏర్పడిందని కొట్టుకు చస్తున్నారని మండిపడ్డారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగుల చావుల గురించి కొట్లాడే వారు ఎవరని మీడియాకు రిలీజ్ చేసిన ఓ ప్రెస్ నోట్ లో షర్మిలప్రశ్నించారు.

This post was last modified on February 11, 2022 3:58 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రేమ పెళ్లితో షాకిచ్చిన వైర‌ల్ మోనాలిసా

మోనాలిసా.. గ‌త ఏడాది సోష‌ల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్‌ప్రదేశ్‌లో జ‌రిగిన‌ మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…

9 minutes ago

కిం క‌ర్త‌వ్యం… అంత‌ర్మ‌థ‌నంలో బీఆర్ఎస్‌?

తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌, ఆ పార్టీ కార్య‌నిర్వాహ‌క అధ్య‌క్షుడు కేటీఆర్‌, మాజీ మంత్రి పార్టీ కీల‌క…

41 minutes ago

ఇరానీ చాయ్ మీద ఇరాన్ వార్

ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికాల యుద్ధం మన దేశంపై కూడా ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ తో పోలిస్తే ఎల్పీజీ…

47 minutes ago

లోక్‌సభ స్పీకర్‌పై అవిశ్వాసం.. ఎందుకంటే!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సాగుతోంది. ఇలా లోక్‌సభ స్పీకర్‌పై తమకు విశ్వాసం…

58 minutes ago

రెండు విషయాల్లో ఉస్తాదే కరెక్ట్

ఉస్తాద్ భగత్ సింగ్ కౌంట్ డౌన్ సంవత్సరాలు, నెలల నుంచి కేవలం ఏడు రోజులకు వచ్చేసింది. ముందు రోజు ప్రీమియర్లు…

2 hours ago

అసెంబ్లీకి వస్తే ఆ జాకీలను పడేయొచ్చుగా జగన్

అత్యంత కీలకమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు డుమ్మా కొట్టిన జగన్…ఆ తర్వాత అడపాదడపా మీడియా ముందుకు వచ్చి వెళుతున్న సంగతి…

4 hours ago