Political News

తెలుగు మీడియా స‌ర్కిల్స్‌లో క‌ల‌క‌లం

క‌రోనాకు ఎదురెళ్లి విధులు నిర్వ‌ర్తిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల‌కు అంద‌రూ స‌లాం కొట్టేవాళ్లే. వాళ్ల గొప్ప‌ద‌నాన్ని కీర్తించేవాళ్లే. ప్ర‌భుత్వం కూడా వారి క‌ష్టాన్ని గుర్తించి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చింది. ఐతే మీడియా వాళ్లు సైతం క‌రోనాపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న వాళ్లే. వైర‌స్ విజృంభిస్తున్న చోట్ల‌కే వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్నారు.

లాక్ డౌన్ టైంలో కూడా ఆఫీసుల‌కెళ్లి విధులు నిర్వ‌ర్తించారు. అయినా వారి క‌ష్టాన్ని గుర్తించిన వాళ్లెవ్వ‌రూ లేరు. ఇన్సెంటివ్స్ లేక‌పోగా.. ఉన్న జీతాల్లోనే కోత ప‌డింది. ఉద్యోగాలూ లేచిపోయాయి. ఇవ‌న్నీ చాల‌వ‌ని ఇప్పుడు జ‌ర్న‌లిస్టులు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డి ఆసుప‌త్రుల‌కు ప‌రుగులు పెడుతుండ‌టం ఆ వ‌ర్గాల్లో ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే కొంత‌మంది రిపోర్ట‌ర్లు క‌రోనా బారిన ప‌డ్డారు. మ‌నోజ్ అనే టీవీ5 జ‌ర్న‌లిస్టు ప్రాణాలు కూడా కోల్పోయాడు.

ఇప్పుడు తాజాగా పెద్ద ఎత్తున మీడియా ప్ర‌తినిధుల్లో క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆదివారం 140 మంది తెలుగు రిపోర్ట‌ర్ల‌కు క‌రోనా టెస్టులు చేయ‌గా.. అందులో 23 మంది పాజిటివ్‌గా తేలారు. వీళ్లంద‌రినీ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. వీరి కుటుంబ స‌భ్యులు, వారితో స‌న్నిహితంగా మెలిగిన వారికి కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ టెస్టులు జ‌ర్న‌లిస్టుల బ‌ల‌వంతం మేర‌కు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో ఆరోగ్య మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను క‌రోనా టెస్టుల కోసం అడిగారు రిపోర్ట‌ర్లు. ఐతే ఆయ‌న మాత్రం మీరంతా బాగానే ఉన్నారు కదా, మీకెందుకు టెస్టులు అంటూ న‌వ్వుతూ బ‌దులిచ్చారు. కానీ జ‌ర్న‌లిస్టులు ఊరుకోకుండా త‌మ‌కు టెస్టులు చేయాల్సిందే అని డిమాండ్ చేయ‌డంతో ఆయ‌న అంగీక‌రించారు. అలా ప‌రీక్ష‌లు చేస్తేనే 23 మంది రిపోర్ట‌ర్ల‌కు క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. దీంతో మీడియా వ‌ర్గాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి.

This post was last modified on June 15, 2020 2:16 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

3 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

4 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

5 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

6 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

6 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

8 hours ago