Political News

తెలుగు మీడియా స‌ర్కిల్స్‌లో క‌ల‌క‌లం

క‌రోనాకు ఎదురెళ్లి విధులు నిర్వ‌ర్తిస్తున్న వైద్యులు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల‌కు అంద‌రూ స‌లాం కొట్టేవాళ్లే. వాళ్ల గొప్ప‌ద‌నాన్ని కీర్తించేవాళ్లే. ప్ర‌భుత్వం కూడా వారి క‌ష్టాన్ని గుర్తించి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చింది. ఐతే మీడియా వాళ్లు సైతం క‌రోనాపై అలుపెర‌గ‌ని పోరాటం చేస్తున్న వాళ్లే. వైర‌స్ విజృంభిస్తున్న చోట్ల‌కే వెళ్లి రిపోర్టింగ్ చేస్తున్నారు.

లాక్ డౌన్ టైంలో కూడా ఆఫీసుల‌కెళ్లి విధులు నిర్వ‌ర్తించారు. అయినా వారి క‌ష్టాన్ని గుర్తించిన వాళ్లెవ్వ‌రూ లేరు. ఇన్సెంటివ్స్ లేక‌పోగా.. ఉన్న జీతాల్లోనే కోత ప‌డింది. ఉద్యోగాలూ లేచిపోయాయి. ఇవ‌న్నీ చాల‌వ‌ని ఇప్పుడు జ‌ర్న‌లిస్టులు వ‌రుస‌గా క‌రోనా బారిన ప‌డి ఆసుప‌త్రుల‌కు ప‌రుగులు పెడుతుండ‌టం ఆ వ‌ర్గాల్లో ఆందోళ‌న రేకెత్తిస్తోంది. ఇప్ప‌టికే కొంత‌మంది రిపోర్ట‌ర్లు క‌రోనా బారిన ప‌డ్డారు. మ‌నోజ్ అనే టీవీ5 జ‌ర్న‌లిస్టు ప్రాణాలు కూడా కోల్పోయాడు.

ఇప్పుడు తాజాగా పెద్ద ఎత్తున మీడియా ప్ర‌తినిధుల్లో క‌రోనా పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఆదివారం 140 మంది తెలుగు రిపోర్ట‌ర్ల‌కు క‌రోనా టెస్టులు చేయ‌గా.. అందులో 23 మంది పాజిటివ్‌గా తేలారు. వీళ్లంద‌రినీ ఆసుప‌త్రుల‌కు త‌ర‌లిస్తున్నారు. వీరి కుటుంబ స‌భ్యులు, వారితో స‌న్నిహితంగా మెలిగిన వారికి కూడా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ టెస్టులు జ‌ర్న‌లిస్టుల బ‌ల‌వంతం మేర‌కు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో ఆరోగ్య మంత్రి ఈట‌ల రాజేంద‌ర్‌ను క‌రోనా టెస్టుల కోసం అడిగారు రిపోర్ట‌ర్లు. ఐతే ఆయ‌న మాత్రం మీరంతా బాగానే ఉన్నారు కదా, మీకెందుకు టెస్టులు అంటూ న‌వ్వుతూ బ‌దులిచ్చారు. కానీ జ‌ర్న‌లిస్టులు ఊరుకోకుండా త‌మ‌కు టెస్టులు చేయాల్సిందే అని డిమాండ్ చేయ‌డంతో ఆయ‌న అంగీక‌రించారు. అలా ప‌రీక్ష‌లు చేస్తేనే 23 మంది రిపోర్ట‌ర్ల‌కు క‌రోనా ఉన్న‌ట్లు తేలింది. దీంతో మీడియా వ‌ర్గాలు ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డ్డాయి.

This post was last modified on June 15, 2020 2:16 pm

Share

Recent Posts

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

2 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

2 hours ago

అప్పట్లో చిరు ఏడాదికి నాలుగు సినిమాలు చేసినా గొడవే

ఇప్పుడు పెద్ద హీరోల నుంచి ఏడాదికో సినిమా వస్తే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంది. ఒక్క ప్రభాస్‌ను పక్కన పెడితే.. అల్లు…

9 hours ago

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది…

10 hours ago

హృద‌య విదార‌కం… టీచ‌ర్ దెబ్బ‌కు ప్రాణం వ‌దిలిన పిల్లాడు

పిల్ల‌ల విష‌యంలో త‌ల్లిదండ్రులైనా, ఉపాధ్యాయులైనా ఎంత సున్నితంగా వ్య‌వ‌హ‌రించాలో చెప్పే ఉదంత‌మిది. విద్యార్థుల‌ను క్ర‌మ‌శిక్ష‌ణ‌లో పెట్టాల‌ని, వారిలో భ‌యం పెంచాల‌ని…

11 hours ago

యాక్సిడెంట్ కేసులో జనసేన ఎంపీ తనయుడు

హైదరాబాద్ మాదాపూర్ ఇనార్బిట్ మాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భారతి అనే 26 ఏళ్ల యువతి మృతి చెందిన…

12 hours ago