ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఈ రోజు ఏపీ సీఎం జగన్ తో సినీ పెద్దలు, ప్రముఖుల భేటీ తర్వాత ఈ వివాదానికి త్వరలోనే పుల్ స్టాప్ పడబోతున్నట్టు సంకేతాలు వస్తున్నాయి. జగన్తో తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని, అలీ, ఆర్.నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అరవింద్, దిల్ రాజు హాజరుకాలేదు. ఈ భేటీ తర్వాత చిరంజీవి కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ ధరల వివాదానికి శుభంకార్డు పడినట్లే భావిస్తున్నామని చిరు మీడియాకు తెలిపారు. సీఎం జగన్ నిర్ణయం అందరినీ సంతోషపర్చిందని, చిన్న సినిమాలకు ఐదో షోకు అనుమతించడం శుభపరిణామమని చిరు అన్నారు.
చిన్న సినిమాల నిర్మాతలకు మంచి వెసులుబాటు ఇచ్చారని చెప్పారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల గురించి గొప్పగా ప్రచారం జరుగుతోందని చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. సమావేశం తర్వాత మహేశ్ బాబు కూడా మీడియాతో మాట్లాడారు. మొదటగా చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలని మహేశ్ అన్నారు.
చిరు మొదటి నుంచీ చొరవ చూపి సమస్య పరిష్కారానికి కృషి చేశారని కొనియాడారు. ఇటీవల సినీ పరిశ్రమలో ఎన్నో సమస్యలు వచ్చాయని, త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వింటారని, వారం..పది రోజుల్లోనే ఆ శుభవార్త వస్తుందని మహేశ్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక, చిరంజీవి సమావేశానికి వెళ్లారు కాబట్టి తాను వెళ్లలేదని అల్లు అరవింద్ చెప్పారు.
This post was last modified on February 10, 2022 5:33 pm
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…
టాలీవుడ్ టాప్ స్టార్లందరూ తమ సినిమా రిలీజ్ ముంగిట డ్రగ్ టెస్టులు చేసుకోవాలని.. అప్పుడే ఆ సినిమాలు రిలీజ్ అయ్యేలా…
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…