Political News

మోడీని వ‌దిలిపెట్ట‌ని టీఆర్ఎస్‌… పెద్ద స్కెచ్చే

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విభ‌జ‌న‌ తెలంగాణ ఏర్పాటుకు సంబంధించి ప్రధానమంత్రి న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్ ఆగ్ర‌హ ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్‌ను చాలా అవమానకర రీతిలో విభజించారని ప్ర‌ధాని మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. మైకులు బంద్ చేసి పెప్పర్‌ స్ప్రే చ‌ల్లి ఎలాంటి చ‌ర్చ లేకుండా రాష్ట్ర ఏర్పాటు ప్ర‌క్రియ పూర్తిచేసిన‌ట్లు ప్ర‌ధాని చేసిన కామెంట్ల‌పై టీఆర్ఎస్ చేస్తున్న నిర‌స‌న‌లో భాగంగా తాజాగా ఎంపీలు రాజ్యసభ చైర్మన్‌కు ఫిర్యాదు చేశారు.

సభా హక్కుల ఉల్లంఘన కింద రాజ్యసభ సెక్రెటరీ జనరల్‌కు టీఆర్ఎస్ ఎంపీలు నోటీసులు అందజేశారు. 187వ నిబంధన కింద టీఆర్‌ఎస్‌ ఎంపీలు కే కేశవరావు, సంతోష్‌, లింగయ్య యాదవ్‌, సురేశ్‌ రెడ్డి నోటీసు ఇచ్చారు. తెలంగాణ బిల్లుపై ప్రధాని అభ్యంతరకరంగా మాట్లాడారని అందులో  పేర్కొన్నారు.

తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానించడమేనని నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటులో పాస్‌ అయిన బిల్లును అవహేళన చేయడం సరికాదని తెలిపారు. పార్లమెంటును, సభాపతులను అవమానపరిచేలా ప్రధాని వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇది సభా హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని వెల్లడించారు.

కాగా, ఇప్ప‌టికే క్షేత్ర‌స్థాయిలో దిష్టిబొమ్మల దహనాలు, నిరసన ప్రదర్శనలు, మోడీ వ్యతిరేక నినాదాలతో టీఆర్ఎస్ పార్టీ హోరెత్తించింది. రాష్ట్ర విభజనపై ప్రధాని వ్యతిరేక వ్యాఖ్యలను నిరసిస్తూ బుధవారం తెలంగాణ ఉద్యమకారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ నాయకులు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. నల్లటి అంగీలు, రిబ్బన్ల్లు ధరించి ర్యాలీలు చేపట్టారు. ‘మోడీ హఠావో.. తెలంగాణ బచావో’ ప్లకార్డులతో బైఠాయించారు. దీనికి కొన‌సాగింపు అన్న‌ట్లుగా నేడు రాజ్య‌స‌భ‌లో నోటీసులు ఇచ్చారు.

Satya

Recent Posts

బాల‌కృష్ణ కూతురు మ‌ళ్లీ చిత‌గ్గొట్టేసింది

సెల‌బ్రెటీల కుటుంబాల్లో కొంద‌రిలో ఎంతో ప్ర‌తిభ ఉన్న‌ప్ప‌టికీ.. అది ఎప్పుడో కానీ బ‌య‌టికి రాదు. ఎప్పుడూ మామూలుగా క‌నిపించే వ్య‌క్తులు..…

4 hours ago

సలార్ ఇవ్వనిది లెనిన్ అందించింది

రిలీజైన రోజు నుంచి వీకెండ్ దాకా చెడుగుడు ఆడేసిన లెనిన్ ఎట్టకేలకు అఖిల్ కెరీర్ లో ఒక హిట్టుని చేర్చేసింది.…

5 hours ago

శేఖ‌ర్ మాస్ట‌ర్ వెర్స‌స్ జానీ మాస్ట‌ర్

టాలీవుడ్ అగ్ర‌శ్రేణి డ్యాన్స్ మాస్ట‌ర్లు ఇద్ద‌రి మ‌ధ్య వివాదం రాజుకుంది. జానీ మాస్ట‌ర్, శేఖ‌ర్ మాస్ట‌ర్ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ చోటు…

7 hours ago

కత్తి కొనల మీద ‘ప్యారడైజ్’ పరుగులు

టాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమాల వ్యవహారం అదిగో పులి ఇదిగో తోక కథలా మారిపోయింది. ఒక డేట్ వేయడం, దానికి…

7 hours ago

పృథ్విరాజ్ టార్గెట్ మిస్ అయ్యిందా

మలయాళ హీరో అయినప్పటికీ సలార్ నుంచి పృథ్విరాజ్ సుకుమారన్ కు మన దగ్గర కూడా ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ నమ్మకంతోనే…

8 hours ago

‘మంగాపురం’లో ఏదో విషయం ఉంది

ఘట్టమనేని మూడో తరం నుంచి మొదటి వారసుడు జయకృష్ణ తొలి సినిమా శ్రీనివాస మంగాపురం జూలై 30 విడుదలకు రెడీ…

8 hours ago