Political News

ఉచిత ప‌థ‌కాలలో.. విద్యుత్‌, పెట్రోల్‌, గ్యాస్‌

ఉచిత ప‌థ‌కాలతో పేరుతో ఇప్ప‌టికే అమ‌లు అవుతున్న వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతుండ‌గా వాట‌న్నింటినీ త‌ల‌ద‌న్నేలా మ‌రో భారీ మేనిఫెస్టో విడుద‌ల అయింది. కీల‌క‌మైన ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన పార్టీ అయిన స‌మాజ్ వాదీ త‌ర‌ఫున సంచ‌ల‌న హామీలు ఇచ్చారు ఆ పార్టీ ర‌థ‌సార‌థి అఖిలేశ్ యాద‌వ్‌. విద్యుత్‌, పెట్రోల్‌, గ్యాస్‌, ఎరువులు ఇలా కీల‌క అవ‌స‌రాలు ఉచితంగా ఇవ్వ‌నున్న‌ట్లు అఖిలేశ్ ఆల్ ఫ్రీ మేనిఫెస్టోలో వెల్ల‌డించారు.

పార్టీ నేత‌ల‌తో క‌లిసి స‌మాజ్‌వాదీ అధ్య‌క్షుడు అఖిలేశ్ యాద‌వ్ తాజాగా యూపీ ఎన్నిక‌ల మేనిఫెస్టోను ప్ర‌క‌టించారు. 300 లోపు యూనిట్ల వ‌ర‌కూ ఉచిత విద్యుత్ అందిస్తామ‌ని అఖిలేశ్ హామీ ఇచ్చారు. దారిద్య్ర రేఖ‌కు దిగువన కుటుంబాల‌కు ఏడాది రెండు సార్లు ఉచితంగా ఎల్పీజీ సిలిండ‌ర్లు ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. బైక్ న‌డిపించే వారికి ప్ర‌తి నెలా ఒక‌సారి ఉచితంగా పెట్రోల్ అందిస్తామ‌ని, ఆటో న‌డిపించే వారికి మూడు లీట‌ర్ల పెట్రోలు, లీట‌ర్ సీఎన్‌జీ గ్యాస్ ఉచితంగా ఇస్తామ‌ని త‌మ‌ మేనిఫెస్టోలో అఖిలేశ్ ప్ర‌క‌టించారు.

ఇక రెండెక‌రాల భూమి ఉన్న వారికి రెండు డీఏపీ బ‌స్తాలు, 5 యూరియా బ‌స్తాలు కూడా ఉచితంగా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. మ‌హిళ‌లు, వృద్ధులు, విక‌లాంగుల‌కు ఏడాదికి 18 వేలు పింఛ‌న్ ఇస్తామ‌ని అఖిలేశ్ ప్ర‌క‌టించారు. కీల‌క‌మైన రైతుల విష‌యంలో అఖిలేశ్ భారీ హామీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చ‌ట్టాల‌ను వ్య‌తిరేకిస్తూ చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాల‌కు 25 ల‌క్ష‌ల చొప్పున న‌ష్ట ప‌రిహారాన్ని చెల్లిస్తామ‌ని అఖిలేశ్ ప్ర‌కటించారు.

రైతు పండించే పంట‌ల‌న్నింటికీ క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర వ‌చ్చేలా చూస్తామ‌ని, చెరుకు రైతులు పంట అమ్మిన 15 రోజుల్లోగా డ‌బ్బు వ‌చ్చేలా చూస్తామ‌ని కూడా స‌మాజ్‌వాదీ త‌న మేనిఫెస్టోలో పొందుప‌రిచారు. 2025 క‌ల్లా రైతుల‌ను రుణ విముక్తుల‌ను చేస్తామ‌ని అందులో హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వ‌స్తే ప‌ల్లెలు, ప‌ట్ట‌ణాల్లో సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా శాంతిభ‌ద్ర‌త‌ల‌ను ప‌ర్య‌వేక్షిస్తామ‌ని తెలిపారు. స‌మాజ్‌వాదీ క్యాంటీన్ల‌ను తెరుస్తామ‌ని, 10 రూపాయల‌కే భోజ‌నాన్ని ఇస్తామ‌ని ఆయ‌న హామీ ఇచ్చారు.

This post was last modified on February 9, 2022 6:48 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

లడ్డూ నెయ్యిపై చంద్రబాబు మాట్లాడింది అందుకేనా?

తిరుమల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగించార‌ని.. పంది, ఆవు కొవ్వుల‌ను కూడా వినియోగించార‌ని సీఎం చంద్ర‌బాబు వ్యాఖ్యానించిన…

30 minutes ago

విచారణలో కేసీఆర్ ఎమోషనల్

ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను సిట్ అధికారులు విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు నంది…

2 hours ago

కేంద్ర బ‌డ్జెట్ స్వ‌రూపం ఏంటి? ఎందుకిలా?

కేంద్ర ప్ర‌భుత్వం తాజాగా ప్ర‌వేశ పెట్టిన 2026-27 వార్షిక బ‌డ్జెట్‌లో ప్ర‌త్యేకంగా ఒక రాష్ట్రానికి అంటూ పెద్ద‌గా కేటాయింపులు ఏమీ…

2 hours ago

మళ్ళీ అవే మాటలా జోగి గారు?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లపై వైసీపీ నేత జోగి రమేశ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం…

3 hours ago

నెల ముందు కొడుకు మర‌ణం… ఇప్పుడు ఆ న‌టుడు

కొంద‌రు న‌టులు త‌రచుగా సినిమాల్లో క‌నిపిస్తుంటారు. చాలా ఫెమిలియ‌ర్‌గా అనిపిస్తారు. కానీ ఆ న‌టుల పేరేంటో కూడా జ‌నాల‌కు గుర్తుండ‌దు.…

5 hours ago

కర్ణుడిగా సూర్య… తీరని కలేనా?

చారిత్రక నేపథ్యం ఉన్న కథలను, భారీ బడ్జెట్లలో, పాన్ ఇండియా స్థాయిలో తీసే ధైర్యం దర్శక నిర్మాతల్లో పెంచిన ఘనత…

5 hours ago