ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సరైన రీతిలో జరగలేదని ప్రధాని మోడీ పార్లమెంటులో చేసిన వ్యాఖలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. ప్రధాని కామెంట్లపై తెలంగాణలో అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ప్రధాని కామెంట్లపై టీఆర్ఎస్ పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావు తక్షణమే స్పందించారు. రాజ్యసభలో ప్రధాని మాటలు తెలంగాణ ప్రజల హృదయాలను గాయపరిచిందని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటును అయన ఎంత వ్యతిరేకిస్తున్నరో అర్థం అవుతున్నదని మండిపడ్డారు.
తెలంగాణపై మోడీ మళ్లీ అక్కసు వెళ్లగక్కారని మండిపడిన హరీష్ రావు తెలంగాణ మీద ఎందుకు అంత వివక్ష.. ఎందుకు అంత కక్ష.. ఎందుకు అంత విషం చిమ్ముతున్నారు అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ వచ్చిందని మనం సంతోషపడితే ప్రధాని మోడీ ఎందుకో దుఃఖ పడుతున్నాడని హరీష్ రావు వ్యాఖ్యానించారు. “ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ విభజన సరిగ్గా జరగలేదట, సుఖ ప్రసవం జరగలేదట.
1999 లో కాకినాడ తీర్మానం చేసి, ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి మోసం చేశారు. నాడు బీజేపీ అధికారంలోకి వచ్చి తెలంగాణ ఇవ్వకుండా దగా చేశారు. సుఖ ప్రసవం చేస్తామంటే మేం వద్దు అన్నమా? ఎందుకు మాట ఇచ్చి తప్పారు?“ అని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయకముందే రాత్రికి రాత్రికి ఏడు మండలాలు, లోయర్ సీలేరు ప్రాజెక్ట్ ను ఆంధ్రలో కలిపారని మండిపడిన హరీశ్ రావు కనీసం మాట చెప్పకుండా చేసి సమాఖ్య స్ఫూర్తికి తూట్లు పొడిచారని మండిపడ్డారు.
తెలంగాణ గురించి ఎప్పుడు మాట్లాడినా ప్రధాని అక్కసు వెళ్లగక్కుతాడు.. ద్వేషం చిమ్ముతాడని హరీష్ రావు ధ్వజమెత్తారు. తెలంగాణ బాగుపడుతుంది… కానీ మోడీకి నచ్చడం లేదు అని హరీష్రావు వ్యాఖ్యానించారు. అభివృద్ధిలో గుజరాత్ను దాటిపోతున్నామని భయమా అని ఆయన ఎద్దేవా చేశారు. పార్లమెంట్లో విభజన చట్టంలో చెప్పినవి అమలు చేయరు కానీ విభజనను మాత్రం తప్పుపడతారు అని హరీష్ రావు మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ నాయకులు ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతారని ఆయన దుయ్యబట్టారు.
గత ఏడాది సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్ బస్టర్ తర్వాత వెంకటేష్ బాగా గ్యాప్ తీసుకున్నారు. అతిథి పాత్ర కాబట్టి మన…
తెలంగాణ… 4 కోట్ల మంది తెలంగాణ భూమిపుత్రుల జాగీరేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు.…
గత కొన్నేళ్లుగా సరైన హిట్ లేక అభిమానులను బాధ పెడుతున్న మాస్ మహారాజ రవితేజ ఎట్టకేలకు రూటు మార్చేశారు. రొటీన్…
ఇవాళ సాయంత్రం ప్రీమియర్లతో విడుదల కాబోతున్న పెద్దికి సంబంధించి అందరు దృష్టి సారిస్తున్న ప్రధానాంశాల్లో ఏఅర్ రెహమాన్ సంగీతం ఒకటి.…
మెగా కౌంట్ డౌన్ లో సంవత్సరాలు నెలలుగా మారిపోయి, రోజులకు దిగిపోయి, ఇప్పుడు గంటల్లోకి వచ్చేసింది. మెగాభిమానులు, సినీ ప్రియులు…
తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొన్నటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాాలే ఇందుకు కారణమని చెప్పాలి. ఈ…